logo

తెదేపాతోనే అభివృద్ధి

ప్రజలు ఆలోచించి ఓటేయాలని తెదేపా నాయకులు ప్రజలకు సూచించారు. తెదేపా అధికారంలోకి వస్తే రాష్ట్రం బంగారుమయం అవుతుందన్నారు. అభివృద్ధి పరుగులు తీస్తుందని వెల్లడించారు.

Published : 28 Apr 2024 03:32 IST

ఇచ్ఛాపురం: కేదారిపురంలో ఎమ్మెల్యే అశోక్‌కు తిలకం దిద్దుతున్న మహిళ పక్కన జనసేన ఇన్‌ఛార్జి దాసరి రాజు

ఇచ్ఛాపురం, కవిటి గ్రామీణం, కంచిలి: ప్రజలు ఆలోచించి ఓటేయాలని తెదేపా నాయకులు ప్రజలకు సూచించారు. తెదేపా అధికారంలోకి వస్తే రాష్ట్రం బంగారుమయం అవుతుందన్నారు. అభివృద్ధి పరుగులు తీస్తుందని వెల్లడించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ ‘6’పై అవగాహన కలిగించారు.

జగన్‌ పాలన ముగింపే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే అశోక్‌

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: జగన్‌ అరాచక పాలనను అంతం చేయడమే కూటమి ప్రధాన లక్ష్యమని, జగన్‌ ఐదేళ్ల పాలనపై కూటమి ఛార్జిషీట్‌ దాఖలు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ బెందాళం అశోక్‌ అన్నారు. శనివారం రామయ్యపుట్టుగలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఐదేళ్ల జగన్‌ పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిందన్నారు. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులతో ఒక్కో కుటుంబంపై రూ. 10 లక్షలు భారం మోపిందని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని