పిల్లల చదువులపై పక్షపాతమెందుకు..?
విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, పాఠశాల భవనాలను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నాడు- నేడు పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది.
బిబ్బిలిపేట పాఠశాలను పట్టించుకోని సర్కారు
తెదేపా పంచాయతీ నెపంతో నాడు- నేడులో చేర్చని వైనం
బిబ్బిలిపేట ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో పెచ్చులూడిన పైకప్పు, గోడ
న్యూస్టుడే, ఆమదాలవలస గ్రామీణం: విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, పాఠశాల భవనాలను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నాడు- నేడు పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది. ఆమదాలవలస మండలం బొబ్బిలపేట గ్రామంలోని పాఠశాలను మాత్రం కేవలం తెదేపా పంచాయతీ అనే నెపంతో ఇంత వరకు నాడు-నేడు పనులకు ఎంపిక చేయలేదు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ చదువులు సాగిస్తున్నారు.
వర్షం వస్తే సెలవే..
వర్షం పడితే బొబ్బిలపేట పాఠశాలకు సెలవు ప్రకటించాల్సిందే. చిన్నపాటి వాన కురిసినా తరగతి గది కారిపోవడంతో విద్యార్థులు కుర్చోవడానికి స్థలం లేక ఉపాధ్యాయులు సెలవు ప్రకటిస్తున్నారు. దీంతో చదువులు సక్రమంగా సాగడం లేదని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు తెలియజేసినా ఇటు అధికారులు, అటు పాలకులు స్పందించలేదని సర్పంచి గొండు రమణతో పాటు గ్రామస్థులు వాపోతున్నారు. గతంలో ఈ పాఠశాలలో 70 మంది విద్యార్థులుండే వారు. ప్రస్తుతం 24 మంది పిల్లలు మాత్రమే చదువుతున్నారు. తెదేపా పంచాయతీ కావడంతో పాఠశాలలో విద్యా కమిటీ సైతం ఏర్పాటు చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమికే జై
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జిల్లాలో ప్రధాన పార్టీల విజయంపై పందేలు పోటాపోటీగా సాగుతున్నాయి. -
చెరువుల్నీ వదలని ఘనులు..!
[ 16-05-2024]
ఆమదాలవలస పురపాలక సంఘ పరిధిలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, ప్రధాన కాలువలు ఆక్రమణకు గురవుతున్నా రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు కన్నెత్తి చూడటం లేదు. రూ.కోట్ల విలువైన భూములు కబ్జా కోరల్లో చిక్కుకుని అన్యాక్రాంతమవుతున్నాయి. -
శాశ్వత మరమ్మతులకు చర్యలు
[ 16-05-2024]
గొట్టా బ్యారేజీ దిగువన శాశ్వత మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల సీఈ బీఎస్ఎస్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. -
ఖరీఫ్ సాగుకు కష్టమే..!
[ 16-05-2024]
ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నా జిల్లాలో సాగునీటి వనరుల పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా రైతులకు కష్టాలు తప్పేలా లేవు. -
చిత్తడి నేలలు ధ్వంసం
[ 16-05-2024]
సిక్కోలు తంపర నేలలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ వందల రకాల జీవరాశులు జీవిస్తున్నాయి. ఎన్నో రకాల ఔషధ మొక్కలకు నిలయం. -
కుప్పకూలిన వంతెన... ఏడాదిగా యాతన..!
[ 16-05-2024]
మిగిలిన వాటిని బెల్లుపడ గ్రామం మీదుగా జాతీయ రహదారికి పంపుతున్నారు. దీంతో సమీప గ్రామాలకు చేరుకోవాల్సిన వారికి చుట్టూ తిరిగి వెళ్లాలంటే మరో మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. -
అచ్చెన్నకు ముందస్తు శుభాకాంక్షలు
[ 16-05-2024]
తెెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని కలిసేందుకు వచ్చిన తెదేపా నాయకులతో బుధవారం నిమ్మాడలో సందడి నెలకొంది. -
ఒత్తిడిని అధిగమిస్తే.. ఉత్తమ ర్యాంకు మీదే..!
[ 16-05-2024]
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు 2024-25 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్కు సమయం ఆసన్నమైంది. -
ఏకలవ్య.. అందుబాటులోకి ఎప్పుడయ్యా..?
[ 16-05-2024]
జిల్లాలోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యనందించాలనే లక్ష్యంతో 2014లో అప్పటి ప్రభుత్వం ఏకలవ్య ఆదర్శ పాఠశాలను మంజూరు చేసింది.