రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఎండ తీవ్రతకు గొడుగులు,
ప్యారిస్, న్యూస్టుడే: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, శుక్రవారం అత్యధికంగా ఈరోడులో 42 డిగ్రీలు, తిరుప్పత్తూర్లో 41.6 డిగ్రీలు, సేలంలో 41.5 డిగ్రీలు, కరూర్ పరమత్తితో 41, తాంబరం 41.0, తిరుత్తణి 40.4, వేలూర్, 40.3, తిరుచ్చి 40.1, నామక్కల్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. మే 1వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో పొడి వాతావరణం ఉంటుందని, మే 2న పశ్చిమ కనుమల జిల్లాలు, వాటిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని, ఇతర జిల్లాలు, పుదుచ్చేరి, కారైక్కల్లో పొడివాతావరణం ఉంటుందని తెలిపింది. మే 1 వరకు 2 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ఉత్తర తమిళనాడులోని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగత్రలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వివరించింది. 30వ తేదీ అత్యధికంగా వేడి గాలులు వీస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. ఆ రోజు మధ్యాహ్నం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడని హెచ్చరించింది. చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది.
తలపై చున్నీలు వేసుకుని వెళ్తున్న కళాశాల విద్యార్థినులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేస్ బైకర్లపై గట్టి నిఘా
[ 12-05-2024]
‘నలుగురిలో హీరో అవ్వాలి.. అందరూ నన్నే చూడాలి.. నా గురించే మాట్లాడుకోవాలి’ అన్నట్లుంది నగర రోడ్లపై బైకుల్లో విన్యాసాలు చేసే యువత ఆలోచన. -
మదురైలో భారీవర్షాలు
[ 12-05-2024]
మదురైలో భారీవర్షాలు కురుస్తుండడంతో వైగై నదీ తీర ప్రజలకు వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. -
సెయిలింగ్లో సత్తా చాటుతున్న యువతి
[ 12-05-2024]
‘కొన్ని సమయాల్లో పడవలో వెళ్లేటప్పుడు గాలి వేగంగా వీస్తుంది. అలలు అధికంగా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటిలోనే ఉండాల్సి వచ్చేది. -
పుష్ప ప్రదర్శనకు పోటెత్తిన సందర్శకులు
[ 12-05-2024]
ఊటీ బొటానికల్ గార్డెన్లోని ‘పుష్ప ప్రదర్శన’ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. -
హిందూ సంప్రదాయంలో కజకిస్థాన్ జంట వివాహం
[ 12-05-2024]
మైలాడుదురై సమీపం తిరుక్కడైయూర్లో కజకిస్థాన్ దేశానికి చెందిన జంట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. -
ఈ నెలలో గరుడన్ విడుదల
[ 12-05-2024]
దర్శకనటుడు శశికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గరుడన్’.