అక్రమ అంతస్తుల్లో కాసుల వర్షం
నగరంలో ఎక్కడైనా అనధికార అంతస్తు నిర్మాణం జరుగుతుంటే కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురుస్తోంది. మహావిశాఖ నగరపాలక సంస్థకు మాత్రం నష్టం వాటిల్లుతోంది.
అధికారులు, ప్రజాప్రతినిధుల చేతివాటం
ఏటా జీవీఎంసీకి రూ.కోట్లలో నష్టం
న్యూస్టుడే, కార్పొరేషన్
నగరంలో ఎక్కడైనా అనధికార అంతస్తు నిర్మాణం జరుగుతుంటే కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురుస్తోంది. మహావిశాఖ నగరపాలక సంస్థకు మాత్రం నష్టం వాటిల్లుతోంది.
నగరంలో 60శాతం వరకు అదనపు అంతస్తులు, అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లు అంచనా.. ఆయా నిర్మాణదారులతో కొందరు అధికారులు కుమ్మక్కవుతున్నారు. రూ.లక్షల్లో లంచాలు తీసుకుంటూ, స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలు పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓపెన్ స్పేస్ ఛార్టీల వసూలులోనూ అవినీతి జరుగుతోందని ఇటీవల కొందరు ఫిర్యాదులు చేయడం గమనార్హం.
* నగరపాలక సంస్థలో ఏళ్ల తరబడి ఈ అక్రమ వ్యవహారాలు కొనసాగుతున్నా దర్యాప్తు, నిఘా సంస్థలు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి సోమవారం, శుక్రవారం జీవీఎంసీలో నిర్వహించే స్పందన కార్యక్రమాలకు అధికశాతం ఫిర్యాదులు అనధికార కట్టడాలపైనే వస్తున్నాయి. ఆయా ఫిర్యాదులను పట్టించుకోని అధికారులు వాటిని పరిష్కరించేసినట్లు ప్రభుత్వానికి సమాచారం ఇస్తున్నారు.
* 39వ వార్డులో 267 గజాల స్థలంలో జీప్లస్3 తరహా నిర్మాణానికి జీవీఎంసీ అనుమతులిచ్చింది. ఈ స్థలానికి వీఎంఆర్డీఏ ల్యాండ్ పొజిషన్ ధ్రువీకరణ లేకపోవడంతోపాటు ఓపెన్ స్పేస్ ఫీజుల కింద నిర్మాణదారు రూ.16.44 లక్షలు జీవీఎంసీకి చెల్లించాల్సి ఉంది. అతను ఆ మొత్తం ఎగ్గొట్టి భవనాన్ని పూర్తి చేశారు.
* 42వ వార్డులో జీప్లస్2 తరహా నిర్మాణానికి అనుమతులు తీసుకున్న యజమాని అదనపు అంతస్తు వేశారు. దీనికి రూ.52.80 లక్షల విలువైన టీడీఆర్ జీవీఎంసీకి సమర్పించాల్సి ఉంది. ఆ మొత్తం ఇవ్వకుండానే కొందరు అధికారుల అండదండలతో అతను నిర్మాణం పూర్తి చేశారు.
* 38వ వార్డులో జీప్లస్4 కట్టడానికి నిర్మాణదారు అనుమతులు పొందారు. రూ.1.31కోట్ల విలువైన స్థలంలో నిర్మాణం పూర్తి చేశారు.. దీనికి 14శాతం చొప్పున రూ.18.42 లక్షలు జీవీఎంసీకి చెల్లించలేదు. గాజువాక 57వ వార్డులో ఓ వ్యక్తి జీప్లస్4 తరహా నిర్మాణం చేపట్టారు. సదరు స్థలానికి వుడా ఎల్పీ నెంబరు లేకపోవడంతోపాటు ఓపెన్ స్పేస్ కోసం 14 శాతం నిధులు రూ.25.14 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం చెల్లించకుండానే నిర్మాణం పూర్తి చేశారు. 56వ వార్డులో 2333 గజాల స్థలంలో నిర్మించిన అపార్టుమెంటు విషయంలోనూ ఇలాగే జరిగింది.
* పెందుర్తి 70వ వార్డులో నిర్మించిన ఓ భవనానికి యజమాని 14శాతం రుసుము రూ.3.57 లక్షలు చెల్లించకపోగా, అదనపు అంతస్తు వేశాడు. తద్వారా జీవీఎంసీకి రూ.12.25 లక్షల నష్టం వాటిల్లింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్మాణదారులతో కుమ్మక్కు కావడంతో ఏటా రూ.కోట్లలో జీవీఎంసీ రాబడి కోల్పోతోంది. మరో వైపు ఖర్చులు పెరిగిపోతుండడంతో ప్రజలపై పన్నుల భారం మోపాల్సి వస్తోంది.
ఇవిగో ఉదాహరణలు..
జీవీఎంసీ 33వ వార్డులో 410 గజాల స్థలంలో జీప్లస్3 తరహా నిర్మాణానికి అధికారులు అనుమతిచ్చారు. నిర్మాణదారు మరో అంతస్తు అక్రమంగా నిర్మించారు. దీనికిగాను స్థలం మార్కెట్ విలువ రూ.1.96 కోట్లలో 50 శాతం రూ.98,40,000 విలువైన టీడీఆర్ (అభివృద్ధి బదలాయింపు హక్కు) పత్రాలు జీవీఎంసీకి సమర్పించాల్సి ఉంది. అధికారుల తీరు కారణంగా జీవీఎంసీకి రూ.98లక్షల నష్టం వాటిల్లింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
అభివృద్ధా.. విధ్వంసమా!!
[ 04-05-2024]
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా శుక్రవారం నగరంలో బాలకృష్ణ రోడ్షో నిర్వహించారు. జాలారిపేట నుంచి మొదలైన రోడ్డు షో వెంకోజిపాలెం, డెయిరీ ఫాం కూడలి, రవీంద్రనగర్, చినగదిలి మీదుగా సాగింది. -
జగన్ సమర్పించు క్లాప్ దోపిడీ..!
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వంలో దోపిడీ విధానాలు కోకొల్లలు. ఇంటింటి నుంచి చెత్తను సేకరించే క్లాప్ వాహనాల్లో కూడా వైకాపా కీలక నేతలు దండుకుంటున్నారు. -
సామాన్య భక్తులే లక్ష్యంగా..
[ 04-05-2024]
గత చందనోత్సవ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి సామాన్య భక్తులందరికీ సులువుగా అప్పన్న నిజరూప దర్శనం కలిగేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. -
ఎంవీవీ కార్యాలయంలో తనిఖీల కలకలం
[ 04-05-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. -
‘సీబీసీఎన్సీ’ ధూళి ప్రమాదకరం..!
[ 04-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్)లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపడుతున్న భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులో గృహాలు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసి మోసపోవద్దని సీబీసీఎన్సీ ప్రతినిధి దాసరి యాకోబ్ తాడేపల్లి పత్రికా ప్రకటన ఇచ్చారు. -
చందనోత్సవ టికెట్ల విక్రయాలకు శ్రీకారం
[ 04-05-2024]
ఈనెల 10వ తేదీన చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శన టికెట్ల విక్రయం శుక్రవారం నుంచి ప్రారంభించారు. సింహగిరిపై జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి, ఆర్జేసీ సుబ్బారావు సంబంధిత వెబ్సైట్ను ప్రారంభించారు. -
ప్రజా సహకారంతో కూటమి గెలుపు : శ్రీభరత్
[ 04-05-2024]
తెదేపా కూటమి గెలుపునకు అన్ని వర్గాలు సహకరించాలని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ , గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. -
కూటమితో మెరుగైన పాలన : గణబాబు
[ 04-05-2024]
తెదేపా కూటమితో మెరుగైన పాలన అందుతుందని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. శుక్రవారం ఆయన 92వ వార్డు ఇందిరానగర్, గణేశ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పేదలను వేధిస్తున్న సైకో జగన్
[ 04-05-2024]
పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాసే వారి చిత్రాలను టీవీల్లో చూసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. -
కూటమి ప్రభుత్వం రావడం ఖాయం
[ 04-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. జల్లూరు, సుంకపూరు, బాపిరాజు కొత్తపల్లి, రామచంద్రపాలెం, సన్యాసిరాజుపాలెం, పాములవాక, బోడపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న జాగాలు.. జోరుగా బేరాలు
[ 04-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు, జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల క్రయవిక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. -
పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటాం
[ 04-05-2024]
మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తూ వారిని చదివించే బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పేర్కొన్నారు. -
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
[ 04-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అదనంగా వినియోగించనున్న ఈవీఎంల (సప్లిమెంటరీ) ర్యాండమైజేషన్ను శుక్రవారం పూర్తి చేశారు. -
సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్
[ 04-05-2024]
విశాఖ జిల్లాకు చెందిన సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్లను పంపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. -
పోస్టల్ బ్యాలెట్కు ఆరు కేంద్రాలు
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ఆరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిణి రోజారాణి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం