పేదల పొట్టకొట్టిన జగమొండి
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు.
ఎంతో మంది ఆకలితీర్చిన అన్న క్యాంటీన్ల మూత…
అనకాపల్లి పట్టణం, నర్సీపట్నం అర్బన్, ఎలమంచిలి గ్రామీణం, న్యూస్టుడే
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. తెదేపాకు పేరు దక్కకూడదన్న అక్కసుతో కష్టజీవుల ఆకలి కేకలు వినిపించుకోకుండా కర్కశత్వం ప్రదర్శించారు. తెదేపా హయాంలో అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ. 5కే అల్పాహారం, భోజనం అందించేవారు. జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణాల్లోని పేదలు, చుట్టుపక్కల పల్లెల నుంచి అవసరాల నుంచి నిమిత్తం వచ్చే బడుగుజీవుల ఆకలి తీర్చడంలో ఇవి ఎంతో ఉపయోగపడేవి. వైకాపా అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లపై కక్షపూరితంగా వ్యవహరించింది. వాటిని బలవంతంగా మూసేసి అన్నమో రామచంద్రా అని అలమటించేలా చేసింది.
- నర్సీపట్నంలో అన్ని వర్గాల పేదలకు అనుకూలంగా ఉండేలా మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాంతీయ ఆసుపత్రి ఎదురుగా భవనం నిర్మించి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయించారు. ప్రాంతీయ ఆసుపత్రికి రోగుల వెంట సహాయకులుగా వచ్చేవారు. ఆ మార్గంలో ప్రయాణించే ఆటో డ్రైవర్లు, సమీపంలోని నిరుపేదలు, విద్యార్థులు ఇలా రోజూ వందల మంది ఇక్కడ ఆకలి తీర్చుకునేవారు. ఈ క్యాంటీన్ ప్రారంభించింది మొదలు వైకాపా ప్రభుత్వం మూసేసేవరకు 54,969 మంది అల్పాహారం, 94,085 మంది మధ్యాహ్నం, రాత్రి భోజనం చేశారు. తెదేపా ప్రభుత్వం మూడుపూటలకు కలిపి రూ. 73 వరకు వెచ్చించేదని సమాచారం. పేదల నుంచి మాత్రం రూ. 15 మాత్రమే తీసుకునేది. ఇదే భోజనం, అల్పాహారం మూడుపూటలా బయట తింటే రూ. 200 వరకు ఖర్చవుతుంది. తక్కువ మొత్తానికే పేదలు కడుపునిండా కమ్మని భోజనం చేసేవారు. రోజుకు 350 మందికి అల్పాహారం, 350 మందికి మధ్యాహ్న భోజనం, 250 మందికి రాత్రి భోజనం తయారు చేయించి అందుబాటులో ఉంచేవారు. వైకాపా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత క్యాంటీన్ మూసేయడంతో పేదలంతా ఇబ్బంది పడుతున్నారు.
- అనకాపల్లిలో రైల్వేస్టేషన్, ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి వద్ద 2018లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఆసుపత్రికి జిల్లావ్యాప్తంగా వచ్చే రోగుల సహాయకులు, భవన నిర్మాణ కార్మికులు, వివిధ షాపింగ్ మాల్స్లో పని చేసుకునేవారు, రిక్షా కార్మికులు, ప్రయాణికులు ఇలా ఎంతోమందికి ఇవి ఆకలి తీర్చేవి. వీటి కోసం భవనాలు నిర్మించి ఆధునిక హంగులు కల్పించారు. ఒక్కో క్యాంటీన్లో రోజుకి 200 నుంచి 300మంది వరకు ఫలహారం, భోజనాలు చేసేవారు. జగన్ సర్కారు వీటిని నిర్దాక్షిణ్యంగా మూసేసింది. రైల్వేస్టేషన్ క్యాంటీన్ భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. భవనం తలుపులు, కిటికీలు పాడైపోయాయి. దీన్ని పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి వద్ద ఏర్పాటుచేసిన క్యాంటీన్ భవనాన్ని కొవిడ్ సమయంలో పరీక్షలు చేయడానికి ఆర్టీపీసీఆర్ ల్యాబ్గా మార్చారు. ల్యాబ్ను ప్రారంభించిన కొన్ని నెలలకే మూసేశారు. నియమించిన సిబ్బందిని తొలగించారు. ప్రస్తుతం భవనంలో పరికరాలు మాత్రమే ఉన్నాయి.
- ఎలమంచిలి పట్టణంలో జానియర్ కళాశాల సమీపంలో పాత జాతీయ రహదారిపై అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. రోజూ 350 మంది వరకు గ్రామాల నుంచి ఎలమంచిలి వచ్చే ప్రజలు, చిరు వ్యాపారులు, కార్మికులు, కళాశాలకు వచ్చే పేద విద్యార్థులు ఇక్కడే అల్పాహారం, భోజన చేసేవారు. వైకాపా పాలనలో దీనిని మూసేశారు. ప్రస్తుతం వార్డు సచివాలయంగా మార్చారు.
ఆకలి బాధ తీరుస్తున్న అయ్యన్న
పేదల ఆకలి బాధలు తెలిసిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో మొబైల్ అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. దాదాపు 250 రోజుల నుంచి ఓ వ్యాన్ సమకూర్చి అందులో రూ. 2కే అన్నం, కూర, సాంబారు, స్వీట్, పెరుగు అందజేస్తున్నారు. పాత అన్న క్యాంటీన్ వద్ద వారానికి మూడు రోజులు, బీసీ కాలనీ, మరిడిమాంబ ఆలయం వద్ద మూడు రోజులు వ్యాన్ పేదలకు అందుబాటులో ఉంటోంది.
ఎలమంచిలిలో తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు ముందుకు వచ్చి కొన్ని రోజులపాటు తెదేపా కార్యాలయం ముందు మధ్యాహ్నం అన్న క్యాంటీన్ పేరుతో భోజనాలు అందించారు. ఎన్నికల నియమావళితో ప్రస్తుతం విరామం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే క్యాంటీన్ తెరుస్తామని నాయకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్భిణిగా ఉన్న నా చెల్లి కడుపుపై తన్నారు: వైకాపా మూక దాడిలో గాయపడిన నూకరత్నం
[ 17-05-2024]
ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పడంతో తమ కుటుంబంపై దాడి చేశారని వైకాపా కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు తెలిపారు. -
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
[ 17-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు గుర్తుకొస్తాయి. -
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!
[ 17-05-2024]
ఐదేళ్లుగా విశాఖను కబళించిన ‘జె’ గ్యాంగ్లో ఆయన ఒకరు. ఏకంగా రాయలసీమ జిల్లాలు దాటొచ్చి విశాఖలో రూ.వందల కోట్ల విధ్వంసం సాగించారు. రుషికొండ మట్టిని కొల్లగొట్టి.. ఏపీఐఐసీ భూముల్లోనూ దర్జాగా గ్రావెల్ తవ్వకాలు సాగించిన ఘనుడు. -
ఫలితాన్ని శాసించేలా!!
[ 17-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలట్ ఓట్లు వినియోగించుకున్న వారి సంఖ్య ఈ ఎన్నికల్లో గణనీయంగా పెరిగింది. 2019 ఎన్నికల్లో మొత్తం ఓటర్లలో 0.31శాతం మంది పోస్టల్ బ్యాలట్లు వినియోగిస్తే, ఈ ఎన్నికల్లో 1.13 మంది పోస్టల్ ఓట్లు వేశారు. -
ఐదు గంటలు ఆలస్యంగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్
[ 17-05-2024]
విశాఖ నుంచి సికింద్రా బాద్కు గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఐదు గంటలు ఆలస్యమయింది. -
నిధులివ్వకుండా నిర్మాణాలెలా..!
[ 17-05-2024]
ఎలమంచిలిలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులన్నీ పూర్తిచేశారు. పెయింటింగ్ పనులే చేయాల్సి ఉంది. రంగులు వేసే గుత్తేదారును ఆ పని పూర్తిచేయమంటే ఎన్నికలు అయ్యాక చేస్తాం.. ముందుచేస్తే బిల్లులు అవుతాయన్న నమ్మకం లేదని నిలిపేశారు. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
[ 17-05-2024]
దైవదర్శనానికి వెళ్తున్న దంపతులపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను బలి తీసుకుంది. భార్యను ఆసుపత్రిపాల్జేసింది. -
విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!
[ 17-05-2024]
అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. -
ఆందోళన పెంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
[ 17-05-2024]
చట్టాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాగే ఉందని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. -
ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ శిబిరాలు
[ 17-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. -
బాధితులకు ‘తెదేపా’ పరామర్శ
[ 17-05-2024]
విశాఖలోని బర్మాక్యాంపు ప్రాంతంలో జరిగిన వైకాపా నాయకుల దాడిలో గాయపడిన బాధితులను గురువారం 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో విశాఖ పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు గండి బాబ్జీ పరామర్శించారు. -
ఈవీఎంలకు కేంద్ర బలగాల భద్రత సీసీ కెమెరాల ఏర్పాటు
[ 17-05-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న ఓటింగ్ యంత్రాల (ఈవీఎం, వీవీపాట్)స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రతను కల్పించారు. తొలి అంచెలో కేంద్ర బలగాలు భద్రతగా ఉన్నాయి. -
ముగిసిన ఐఐవైసీ వార్షిక సమావేశాలు
[ 17-05-2024]
ఇస్కాన్ (సాగర్నగర్) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) వార్షిక సమావేశాలు గురువారం ముగిశాయి. -
విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్ కార్మికుడి మృతి
[ 17-05-2024]
సబ్బవరం మండలం గాలిభీమవరం రెవెన్యూ పరిధిలోని ఓ బొగ్గు కంపెనీలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ కార్మికుడు(హెల్పర్) మృతి చెందాడు. -
వరాహా నదిలో రాతి విగ్రహం లభ్యం
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెదఉప్పలం సమీపాన వరాహానదిలో నూకాంబిక అమ్మవారి రాతి విగ్రహం గురువారం లభ్యమైంది. -
తెదేపా అభిమానిపై వైకాపా నాయకుల దాడి
[ 17-05-2024]
మండలంలోని జె.పి.అగ్రహారంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తెదేపా అభిమానిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేశామని రోలుగుంట ఎస్సై సురేష్ తెలిపారు. -
పారా వాలీబాల్ జాతీయ జట్టుకు సోముదేవుపల్లి యువకుడి ఎంపిక
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు శివారు పాత సోముదేవుపల్లికి చెందిన దివ్యాంగ యువకుడు అన్నం గణేష్ పారా వాలీబాల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. -
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ
[ 17-05-2024]
జాతీయ రహదారిపై నూతనగుంటపాలెం సమీపాన గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొన్న సంఘటనలో డ్రైవరుతో సహా నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. -
ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
[ 17-05-2024]
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. -
మోసం కేసులో రేవిడి సర్పంచి కుమారుడి అరెస్టు
[ 17-05-2024]
పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారాన్ని పక్కదారి పట్టించిన కేసులో రేవిడి సర్పంచ్ కోన సూరి అప్పయ్యమ్మ కుమారుడు కోన రమణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు
-
గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. త్వరలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్!
-
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!