జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తా
అనకాపల్లి జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు.
కూటమి ఎంపీ అభ్యర్థి రమేశ్
పాయకరావుపేటలో ప్రచారం నిర్వహిస్తున్న కూటమి ఎంపీ అభ్యర్థి సి.ఎం.రమేశ్, చిత్రంలో వంగలపూడి అనిత
పాయకరావుపేట, ఎస్.రాయవరం, న్యూస్టుడే: అనకాపల్లి జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. పేటలో శనివారం ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనితతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మోదీ పాలనతో దేశం ముందుకు దూసుకుపోతుందన్నారు. అనిత మాట్లాడుతూ వైకాపా పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని చెప్పారు. ఎస్.రాయవరంలో శనివారం ఉపాధి హామీ పథకం కూలీలతో సీఎం రమేశ్ సమావేశమయ్యారు. ఉపాధి హామీ పథకం కేంద్రం ప్రభుత్వం ద్వారానే అమలవుతోందని ఎంతమందికి తెలుసని కూలీలను అడిగారు. నిరుద్యోగులు ఉపాధి పనులకు హాజరు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పీజీ, బీటెక్, నర్సింగ్ చదివిన విద్యార్ధులు ఉద్యోగాలు లేక ఉపాధి పనికి వచ్చే పరిస్థితిని జగన్ కల్పించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం, ఇంటి నిర్మాణానికి అందించే రూ.1.50 లక్షలకు జగన్మోహన్రెడ్డి తన బొమ్మ వేసుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో తెదేపా మండల శాఖ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు, అమలకంటి అబద్ధం, నేతలు గూటూరు శ్రీనివాసరావు, వి.వెంకటరమణ, జనసేన నాయకులు గెడ్డం బుజ్జి, తోట నగేష్, భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జి పాకలపాటి రవిరాజు, బాదనపల్లి జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన.. తలరాతలు మార్చుకునే తరుణమిదే
[ 12-05-2024]
జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలే ఎక్కువ. సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నా వారి బతుకులు బాగుపడడం లేదు. విత్తు నుంచి ఎరువుల వరకు ధరలు పెంచేశారు. అయిదేళ్లలో వ్యక్తిగతంగా ఒక్క రాయితీ యంత్రమూ ఇవ్వలేదు. -
అవంతిపై ‘ట్రోల్స్’కు అవధుల్లేవ్!
[ 12-05-2024]
భీమిలి వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి)పై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి. ఊసరవెల్లి రంగులు మార్చినంత తేలికగా పార్టీ మార్చారంటూ పోస్టులు పెడుతున్నారు. -
ఐదేళ్ల నరకం వే(ఓ)టేస్తేనే.. నవశకం!!
[ 12-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు. ‘మూడు విధ్వంసాలు.. ఆరు ఆక్రమణలు’ అన్నట్లుగా కొందరు నాయకులు వీరంగం సృష్టించారు. -
ఆస్తి మాది.. హక్కులు సమాధి..!!
[ 12-05-2024]
ముఖ్యమంత్రి నుంచి... మంత్రుల వరకు అందరూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల ప్రమాదం ఏమీ లేదు అని చల్లగా చెబుతున్నారు!! కానీ... ప్రమాదకరమైన చట్టం తెచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని మరో వైపు జనం మండిపడుతున్నారు!! -
పాలన దగా.. బడుగుజీవి భగభగ!
[ 12-05-2024]
ఆదాయం గుప్పెడంత పెరుగుతుంటే ఖర్చులు కొండలా పెరుగుతున్నాయి. తప్పనిసరి అవసరాలకు, తప్పించుకోలేని ఖర్చులకు మధ్య జనం కిందమీదా పడుతున్నారు. అన్నింటికీ బటన్ నొక్కుతున్నామని చెబుతున్న జగన్ పాలనలో ధరల తగ్గింపు బడ్జెట్ బటన్ నొక్కడం మరిచిపోయాడని బడుగుజీవి ఆగ్రహంతో ఉన్నాడు. -
‘దక్షిణం’లో కూటమి భారీ ర్యాలీ
[ 12-05-2024]
దక్షిణ నియోజకవర్గ కూటమి(జనసేన) అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం నియోజకవర్గ పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి ఘనంగా ముగింపు ఇస్తూ మూడు పార్టీల శ్రేణులు భారీగా తరలివచ్చాయి. -
పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
[ 12-05-2024]
విశాఖ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈనెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. -
ఓటు నీ ఆయుధం.. మరువకు ఏ క్షణం..!
[ 12-05-2024]
అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని క్రెడాయ్ ప్రతినిధులు కోరారు. ఈమేరకు శనివారం సూర్యబాగ్ ప్రాంతంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. -
మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం: శ్రీభరత్
[ 12-05-2024]
సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారుల సంక్షేమానికి తెదేపా కూటమి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
కూటమి అభ్యర్థులకు బీసీ సంఘం మద్దతు
[ 12-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో తెదేపా కూటమి అభ్యర్థులకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశాన శంకరరావు వెల్లడించారు. -
యువతా.. తొలిసారి ఓటేస్తున్నారా..!
[ 12-05-2024]
కొత్తగా ఓటు నమోదు చేసుకున్న 18-19ఏళ్ల యువత ఈ ఎన్నికల్లో తొలిసారి ఆ అమూల్యమైన హక్కును వినియోగించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అయితే తొలిసారి కావడంతో ఓటు ఎలా వేయాలో తెలియక కొందరిలో ఆందోళన ఉంటుంది. -
‘తెదేపా కూటమితో... ప్రగతి, ప్రజా సంక్షేమం’
[ 12-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం సాధ్యమవుతాయని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
ప్రచారం పరిసమాప్తం.. కూటమిదే పైచేయి..!
[ 12-05-2024]
జిల్లాలో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన మార్చి 16 నుంచే అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి గత నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకున్న దాఖలాల్లేవు: సూర్యనారాయణ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన.. తలరాతలు మార్చుకునే తరుణమిదే
-
అరకులో కూటమికే మొగ్గు!.. ఈ పార్లమెంటు బరిలో వైకాపా ఎదురీత
-
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు.. సొంత ఊర్లకు చేరుకుంటున్న ప్రవాసాంధ్రులు
-
నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం