logo

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.

Published : 30 Apr 2024 03:53 IST

కశింకోటలో ట్రాక్టరు నడుపుతున్న కూటమి అభ్యర్థి కొణతాల

కశింకోట, లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని గవరపాలెంలో ఆదివారం పీలా సోమేశ్‌నాయుడు వీధి, శంకర్‌ థియేటర్‌ రహదారి, గౌరీ సంఘం వీధి తదితర ప్రాంతాల్లో బుల్లితెర నటుడు జెమిని సురేశ్‌తో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. మహిళలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించగా అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం కశింకోటలో రైతులతో సమావేశమయ్యారు. వైకాపా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందన్నారు. చెరకు రైతులకు న్యాయం జరిగేలా గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులతో మమేకమై ట్రాక్టరు నడిపారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సీఎం రుత్విక్‌, కూటమి నాయకులు బొడ్డేడ బాలాజీ,  ఆదర్శ రైతు ఆళ్ల అప్పలనాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని