కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.
కశింకోటలో ట్రాక్టరు నడుపుతున్న కూటమి అభ్యర్థి కొణతాల
కశింకోట, లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని గవరపాలెంలో ఆదివారం పీలా సోమేశ్నాయుడు వీధి, శంకర్ థియేటర్ రహదారి, గౌరీ సంఘం వీధి తదితర ప్రాంతాల్లో బుల్లితెర నటుడు జెమిని సురేశ్తో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. మహిళలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించగా అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం కశింకోటలో రైతులతో సమావేశమయ్యారు. వైకాపా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందన్నారు. చెరకు రైతులకు న్యాయం జరిగేలా గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులతో మమేకమై ట్రాక్టరు నడిపారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేశ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సీఎం రుత్విక్, కూటమి నాయకులు బొడ్డేడ బాలాజీ, ఆదర్శ రైతు ఆళ్ల అప్పలనాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఎక్కువ.. ఎవరి వైపు!!.. భారీ పోలింగ్పై నేతల విశ్లేషణలు
[ 16-05-2024]
మహిళల ఓట్లు ఎక్కువగా తమకే పడ్డాయని, గెలుపు అవకాశాలు తమవేనంటూ తెదేపా కూటమి, వైకాపా అభ్యర్థులు ఎవరికి వారు దీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీ గణాంకాలను విశ్లేషిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడి మృతి
[ 16-05-2024]
మధురవాడ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. -
ఏదీ.. ఏమయింది నాటి కళ!
[ 16-05-2024]
వైకాపా ప్రభుత్వం రుషికొండపై సాగించిన విధ్వంసానికి సమీప బీచ్ కళావిహీనంగా మారింది. ఎన్నికలకు ముందు సీఎం క్యాంపు కార్యాలయం కోసమంటూ బీచ్లోని వసతులను ఎత్తేశారు. -
‘ఓటమి భయంతో వైకాపా మూకల దాడులు’
[ 16-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే కూటమికే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని, ఇది చూసి ఓర్వలేక రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా మూకలు తెదేపా నాయకులు, శ్రేణులపై దాడులకు దిగుతున్నాయని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. -
నేటి నుంచి నిర్మాల్య చందనం విక్రయాలు
[ 16-05-2024]
చందనోత్సవం సందర్భంగా ఈనెల 10వ తేదీన అప్పన్న స్వామి దేహంపై నుంచి వేరుచేసిన నిర్మాల్య చందనం విక్రయాలు గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. -
నిధుల విడుదలలో.. కుట్ర కోణం?
[ 16-05-2024]
ఎన్నికలకు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల లబ్ధిని జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నానా హడావుడి చేశారు. -
జిల్లాలో 70.03 శాతం పోలింగ్ నమోదు
[ 16-05-2024]
విశాఖ జిల్లా పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, 2019 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం 3.78 మేర పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. -
అర్ధరాత్రి విధ్వంసం
[ 16-05-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ పరిధి వుడాకాలనీలోని ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు జేసీబీతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. -
నేటి నుంచి గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 16-05-2024]
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో నడుస్తున్న బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగులు సీట్ల ప్రవేశాలకు ఈనెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ జరుపుతున్నామని విశాఖ, అనకాపల్లి జిల్లాల గురుకులాల సమన్వయకర్త ఎస్.రూపవతి వెల్లడించారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
[ 16-05-2024]
లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పలు రైళ్ల బయలు దేరే సమయాలను మార్పు (రీ షెడ్యూల్) చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
ముందుకెళ్లే వీల్లేక.. మార్గ మధ్యలో నిలిచే..!
[ 16-05-2024]
గోపాలపట్నం నుంచి బాజీకూడలి మీదుగా ఎన్ఏడీకూడలికి వెళ్లే బీఆర్టీఎస్ సేవా మార్గంలో నిత్యం ట్రాఫిక్ వెతలతో వాహన చోదకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
అన్న జమానాలో అంతా అనధికారమే!
[ 16-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. -
డెంగీతో జాగ్రత్త సుమా!
[ 16-05-2024]
మే నెలలో ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతున్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. -
మీ అభిమానం మరువలేనిది
[ 16-05-2024]
తనకు అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థిగా సీటు ఖరారు చేసినప్పటి నుంచి పోలింగు వరకు తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చూపిన అభిమానానికి సీఎం రమేశ్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
నాడు-నేడు ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
[ 16-05-2024]
అనకాపల్లి జిల్లా పరిధిలో రెండో దశ నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లోని 227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
అనకాపల్లిలో పెరిగిన పోలింగ్
[ 16-05-2024]
అనకాపల్లి జిల్లాలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. అనకాపల్లి, ఎలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లో ఓటర్లు ఉత్సాహంగా, ఓర్పుతో ఓటు వేశారు. కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
-
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!