logo

ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి

ముస్లిం ఓటర్లు గత ఎన్నికల్లో తనను ఎంతో ప్రోత్సహించారని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ అన్నారు.

Published : 30 Apr 2024 03:55 IST

కూటమి నేతల భరోసా

ముస్లిం సోదరులతో ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : ముస్లిం ఓటర్లు గత ఎన్నికల్లో తనను ఎంతో ప్రోత్సహించారని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ అన్నారు. సిరిపురం బాలల ప్రాంగణంలో సోమవారం సాయంత్రం ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి కూడా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఉత్తర నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. రాష్ట్ర తెదేపా సెక్రటరీ మహమ్మద్‌ నజీర్‌ మాట్లాడుతూ.. తెదేపా హయాంలో ముస్లింల అభివృద్ధికి కృషిచేశామన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేయాలన్నారు. ముస్లిం నాయకులు రహ్మతుల్లా, తెదేపా జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని