logo

Warangal : అనుమానస్పద స్థితిలో ఎనిమిది నెమళ్లు మృతి

వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలో శుక్రవారం ఎనిమిది నెమళ్లు మృతి చెందాయి. దేవిలాల్‌ తండా శివారులో......

Updated : 28 Jan 2022 16:43 IST

పర్వతగిరి: వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలో శుక్రవారం ఎనిమిది నెమళ్లు మృతి చెందాయి. దేవిలాల్‌ తండా శివారులో అనుమానాస్పదంగా ఎనిమిది నెమళ్లు మృతి చెందాయని సమాచారం అందినట్లు వర్దన్నపేట అటవీ అధికారి సదానందం తెలిపారు. సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి సంఘటనాస్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. మృతి చెందిన నెమళ్లకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌కు తరలించినట్లు తెలిపారు. వీటి మృతికి వ్యవసాయ పొలాలకు వాడే పురుగు మందు లేదా ప్రస్తుతం వ్యాపించే బర్డ్‌ ఫ్ల్యూ వ్యాధి కావొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే, నెమళ్ల మృతికిపై పోస్టుమార్టం తర్వాతే స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై కిషోర్‌కు సమాచారం అందించినట్లు సదానందం పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని