మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు
జనగామ, న్యూస్టుడే: జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు. సోమవారం మార్కెట్కు ధాన్యం తెచ్చిన రైతులను లోనికి అనుమతించలేదు. దీంతో రైతులు, అడ్తీ, ఖరీదు హమాలీలు, దడువాయిలతో కలిసి రైతు సంఘం నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. జనగామ సీఐ రఘుపతి, ఎస్ఐ సృజన్, తిరుపతి, జిల్లా మార్కెటింగ్ అధికారి నరేంద్ర, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్లతో వారు తమ ఇబ్బందులను వివరించారు. తమకు పని చూపించాలని మహిళా కార్మికులు దండాలు పెట్టారు.
బంద్తో ఉపాధి కరవు..
ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి తె.రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా చందునాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు మోకు కనకారెడ్డి మాట్లాడారు. మార్కెట్లో వ్యాపారులు, హమాలీలకు వచ్చిన చిన్న సమస్యను పరిష్కరించడానికి బదులుగా మార్కెట్ బంద్పెట్టడంతో కూలీలకు ఉపాధి కరవైందన్నారు. ఇదే అదనుగా మిల్లర్లు, చిల్లర కాంట దుకాణదారులు, రూ.1600కు క్వింటా ధాన్యాన్ని ఖరీదు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సీపీఎం అనుబంధ సంఘాల నాయకులను అదుపులోనికి తీసుకున్నారు. సొంత పూచికత్తుపై వారిని విడిచిపెట్టిన తదుపరి రైతు సంఘం ముఖ్య నాయకులు అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ను కలిసి వివిధ డిమాండ్లతో వినతి పత్రం సమర్పించారు. మార్కెట్ పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమాలలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య, జిల్లా సహాయ కార్యదర్శి రామావత్ మీట్యానాయక్, సీపీఎం అనుబంధ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
జనగామ వ్యవసాయ మార్కెట్యార్డులో క్వింటాలు ధాన్యం కనీస ధర రూ.1825 తో ఖరీదు చేసేందుకు వ్యాపారులు ముందుకు వచ్చారు. ఈ విషయమై సోమవారం రాత్రి స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో రైతు సంఘాలు, ఖరీదు, అడ్తీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. మంగళవారం నుంచి యథావిధిగా మార్కెట్లో ప్రైవేటు క్రయవిక్రయాలకు శ్రీకారం చుట్టనున్నారు.
క్రయవిక్రయాలకు కలెక్టర్ ఆమోదం
జనగామ: మార్కెట్లో లావాదేవిల కొనసాగింపునకు వివిధ వర్గాల నుంచి పెరిగిన వత్తిడి, రైతుల అవసరాలు, అకాల వర్షాలతో రైతుల ఇబ్బందుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ దృష్టిసారించారు. ఈ నెల 10న యార్డులో రైతుల ఆందోళన తదనంతర పరిణామాల నేపథ్యంలో 16 నుంచి మార్కెట్ను మూసివేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మార్కెట్ బంద్ ప్రకటించినా రైతులు కొందరు సోమవారం సరకులు తెచ్చారు. మరోవైపు మార్కెట్ కార్మికులు, వ్యాపారులు క్రయవిక్రయాల అనుమతి కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్ని వర్గాలకు మేలు జరిగేలా సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మార్కెటింగ్ అధికారులతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్రెడ్డి సైతం జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వీటన్నింటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో, అదనపు కలెక్టర్ వివిధ శాఖల అధికారులు, వ్యాపారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. మార్కెట్యార్డు పునఃప్రారంభానికి కలెక్టర్ ఆమోదం తెలిపారు. ముందుగా యార్డులోని ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఖరీదుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందుబాటులో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేని గ్రామాల రైతులు నాణ్యతా ప్రమాణాలతో మార్కెట్కు ధాన్యం తెచ్చి విక్రయించుకోవచ్చునని ప్రకటించారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని ప్రకటించడంతో, మార్కెట్ గేట్లను తెరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుమతి లేని క్లినిక్లు.. అర్హత లేకున్నా చికిత్సలు
[ 03-05-2024]
ఉమ్మడి వరంగల్లో వైద్యం వ్యాపారమైంది. నకిలీ వైద్యులు దీన్ని వ్యాపారంగా మలుచుకొని రూ.కోట్లు సంపాదిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 75 శాతం నకిలీ వైద్యులు ప్రైౖవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ క్లినిక్ల పేరిట చిన్నస్థాయి ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. -
వసతులు కల్పిస్తేనే పండగలా పోలింగ్
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే భారత ఎన్నికల సంఘం జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఎన్కౌంటర్లో చనిపోయింది సుష్మిత కాదా..!
[ 03-05-2024]
ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు వార్తలొచ్చాయి. వీరిలో హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సూధన్పల్లికి చెందిన మావోయిస్టు దళ సభ్యురాలు తిక్క సుష్మిత -
పాత వారికి ప్రాధాన్యం.. కొత్త వారికి గౌరవం
[ 03-05-2024]
పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న పాత వారికి ప్రాధాన్యం ఇస్తూనే.. ఇటీవల కాంగ్రెస్లో చేరిన వారిని గౌరవించుకుందామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. -
మోదీ నాయకత్వంలో దేశం పురోగతి
[ 03-05-2024]
మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గురువారం రాత్రి ఐనవోలు మండల కేంద్రంలో నిర్వహించిన భాజపా కార్నర్ మీటింగ్లో కేంద్ర మాజీ మంత్రి పొన్ను రాధాకృష్ణన్తో కలిసి మాట్లాడారు. -
అమలుకు నోచని హామీలతో కాంగ్రెస్ మోసం
[ 03-05-2024]
అమలుకు నోచని హామీలతో మోసం చేసి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎవరూ నమ్మడం లేదని వరంగల్ లోక్సభ నియోజకవర్గ భారాస అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ అన్నారు. -
‘భాజపావి బ్లాక్మెయిల్ రాజకీయాలు’
[ 03-05-2024]
దేశంలో మరోసారి అధికారంలోకి రావడానికి భాజపా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య విమర్శించారు. -
దేశం కోసం మరోసారి మోదీ..
[ 03-05-2024]
దేశం కోసం, ధర్మం కోసం మూడోసారి మోదీని ప్రధాని కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, 400కు పైగా పార్లమెంటు స్థానాల్లో భాజపా గెలుపు ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే టి.వెంకటరమణారెడ్డి, భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూరనర్సయ్య గౌడ్ అన్నారు. -
నేటి నుంచి ‘ఇంటి వద్ద ఓటింగ్’
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు, 85 ఏళ్లపై బడిన ఓటర్లు, దివ్యాంగులు ఇంటి వద్దనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. -
ఎండలు బాబోయ్..
[ 03-05-2024]
జిల్లాలో రోజురోజుకు ఎండ దంచి కొడుతోంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి.. జన సంచారం లేక రోడ్లు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
ఇంటి నుంచి ఓటుకు అర్హులు 866
[ 03-05-2024]
పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు తమ ఓటు హక్కును తాము ఉన్నచోటనే వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వివిధ వర్గాలవారికి అవకాశం కల్పించింది. -
టీ హబ్కు జబ్బు
[ 03-05-2024]
ములుగు జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ‘టీ హబ్’కు జబ్బు చేసింది. సుమారు 20 రోజులుగా పరీక్షలు నిర్వహించడం లేదు. విద్యుత్తు సమస్య కారణంగా యంత్రాలు పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
అభ్యర్థులు నచ్చకపోతే.. నోటా
[ 03-05-2024]
రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటుహక్కు. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు దీన్ని వినియోగిస్తారు. ఒకవేళ వారెవరూ నచ్చకుంటే నోటా (నన్ ఆఫ్ ద అబోవ్)ను సంధించొచ్చు. -
ఓట్ల గని ఎవరికో?
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. రోజురోజుకు ఎన్నికల వేడి రాజుకుంటోంది.. రాష్ట్రానికి వెలుగులు నింపే సింగరేణి నల్లసూరీల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి కార్మిక ఓటర్లు ప్రభావం చూపనున్నారు. -
ఇంటి నుంచి ఓటుకు స్పందన కరవు
[ 03-05-2024]
ప్రతీసారి ఎన్నికల్లో వృద్ధులు.. దివ్యాంగులు అతికష్టం మీద పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం చూస్తుంటాం. అయితే గత శాసనసభ ఎన్నికల నుంచి ఇంటివద్దే ఓటువేసేందుకు వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. -
పొదుపు సంఘాలకు సోలార్ ప్లాంట్ల నిర్వహణ
[ 03-05-2024]
ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకొని చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న పొదుపు సంఘాల మహిళలు మరింత ఆర్థికంగా బలపడే విధంగా ప్రభుత్వాలు మరో అవకాశం కల్పించాయి. -
వల పన్నారు.. రూ.5 కోట్లకు ముంచారు!
[ 03-05-2024]
వరంగల్ నగరానికి చెందిన ఓ ఉద్యోగి అడ్డదారిలో భారీగా సంపాదించాలనుకున్నాడు. మరో ఇద్దరిని కలుపుకొని స్థానికంగా ఉండే ఓ బడా పత్తి వ్యాపారికి వల వేశారు. -
సెలవులో ఉద్యోగి.. కదలని దస్త్రాలు
[ 03-05-2024]
గ్రేటర్ వరంగల్ టౌన్ప్లానింగ్ విభాగం తీరు ఎవరికి వారే అన్నట్లుగా ఉంది. పెద్ద భవనాల అనుమతులు పెద్ద సార్లు, చిన్నాచితక భవనాల అనుమతులు కిందిస్థాయి అధికారులు చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు