17 నెలలు 17 కి.మీ!
జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది.
జాతీయ రహదారి పనులకు మోక్షమెప్పుడో!
మహదేవపూర్-కాళేశ్వరం మధ్య జాతీయ రహదారి 353సీ విస్తరణలో కోల్పోతున్న అటవీ ప్రాంతం
జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది. ఈ రహదారి విస్తరణ పనులు గుడెప్పాడ్ నుంచి మహదేవపూర్ వరకు మూడేళ్ల క్రితమే పూర్తయ్యాయి. కాళేశ్వరం- మహదేవపూర్ మధ్య 17 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులకు 17 నెలల కిందట ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి మోక్షం కలగడం లేదు.
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, న్యూస్టుడే, కాళేశ్వరం
జాతీయ రహదారి 353సీˆ తెలంగాణ- మహారాష్ట్రలను కలుపుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కూడా రాకపోకలు సులభంగా సాగించవచ్చు. కాళేశ్వరం వద్ద గోదావరిపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణంతో ఈ రహదారిపై రాకపోకలు మరింత పెరిగాయి. 353సీ రహదారి అంతటా బాగున్నా.. కాళేశ్వరం- మహదేవపూర్ మధ్య మాత్రం ఇరుగ్గా మారింది. 2022 నవంబరు 12న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడమేగాక, రూ.163 కోట్ల నిధులతో నిర్మించ తలపెట్టిన కాళేశ్వరం- మహదేవపూర్ రహదారికి కూడా శంకుస్థాపన చేశారు.పదిహేడు నెలలు గడిచినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు.
22 నుంచి.. 16 మీటర్లకు కుదింపు..
జాతీయ రహదారిని 22 మీటర్ల వెడల్పుతో చేపట్టాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో చెట్లు కోల్పోవాల్సి వస్తుందని, 16 మీటర్ల వరకే సరిపెట్టాలని అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారి అధికారులు కూడా ఒప్పుకున్నారు. ఒక వైపు జెన్కో నీటి సరఫరా పైపులైను ఉండటంతో విస్తరణకు ఒకవైపు మాత్రమే భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఏడాది కిందటే విస్తరణలో కోల్పోనున్న చెట్లను లెక్కించి నంబర్లు కూడా వేశారు. వృక్షాలకు సంబంధించి డబ్బులు, భూమికి బదులు భూమి అటవీ శాఖకు ఇవ్వాలి. ఇటీవల చిట్యాల, గణపురం మండలాల్లో 21 హెక్టార్ల భూమిని కూడా కేటాయించినట్లు తెలిసింది. రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వేలు చేపట్టి అప్పగించాల్సి ఉంది. ఇప్పటికీ పనులు మాత్రం పట్టాలెక్కలేదు.
2 కిలోమీటర్ల పరిధిలో స్పష్టత కరవు..
కాళేశ్వరం శివారు నుంచి అంతర్రాష్ట్ర గోదావరి వంతెన వరకు దాదాపు 2 కిలోమీటర్ల రహదారి విస్తరణపై ఇప్పటికీ స్పష్టత కరవైంది. మూడు చోట్ల ప్రతిపాదన చేసినా స్థానికులు, రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బస్టాండు నుంచి పాతరోడ్డు మార్గంలోనా లేక ముక్తివనం పక్క నుంచి విస్తరించడమా అనేది తేల్చలేకపోతున్నారు.
మరమ్మతులతో సరి..
మహదేవపూర్ నుంచి కాళేశ్వరం మధ్య వాహనాల రద్దీతో రహదారికి గుంతలు పడుతున్నాయి. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. కుదురుపల్లి వద్ద వంతెన దెబ్బతిని ప్రమాదభరితంగా మారింది. కనీస రక్షణ కరవైంది. ఈ రహదారి వెంట తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి నిత్యం వచ్చే భక్తులకు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వారికి అవస్థలు తప్పడం లేదు.
భూముల కేటాయింపు ప్రక్రియ సాగుతోంది
కృష్ణారెడ్డి, ఇన్ఛార్జి ఈఈ, జాతీయ రహదారులు
జాతీయ రహదారి విస్తరణ నిమిత్తం కావల్సిన అటవీ అనుమతులు దాదాపు పూర్తయ్యాయి. అటవీ భూములకు బదులుగా మరోచోట కేటాయించే ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తికాగానే పనులు చేపట్టే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
23,57,331 మంది ఓటేశారు..!
[ 15-05-2024]
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. -
పరిహారం చెల్లించరు.. పనులు ప్రారంభించరు!
[ 15-05-2024]
రామప్ప నుంచి లక్నవరం జలాశయం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం భూ సేకరణ చేయనున్న స్థలమిది. -
అందరి సహకారంతో ఎన్నికలు విజయవంతం
[ 15-05-2024]
అందరి సహకారంతో ములుగు జిల్లాలో లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం పోలింగ్ నిర్వహణపై ఆమె ప్రకటన విడుదల చేశారు. -
ప్రకటన బోర్డులు భద్రమేనా..!
[ 15-05-2024]
ఇటీవల ముంబయి మెట్రో నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈదురుగాలుల బీభత్సానికి ఘట్కోపర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం భారీ హోర్డింగ్ నేలకూలడంతో పది మందికి పైగా మరణించగా.. 80 మంది వరకు గాయపడ్డారు. -
కాస్త విశ్రాంతి..!
[ 15-05-2024]
రెండు నెలలుగా సాగిన లోక్సభ ఎన్నికల పోరులో అభ్యర్థులు తీరిక లేకుండా పనిచేశారు. ఎన్నికల షెడ్యూలు వచ్చిన నాటి నుంచి టికెట్టు కోసం పార్టీల అధిష్ఠానాలను ప్రసన్నం చేసుకోవడం, -
ఎవరి అంచనాలు వారివే..!
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ సోమవారం ముగియడంతో ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. -
ఫలితం నిక్షిప్తం.. భద్రత కట్టుదిట్టం
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను.. సాధారణ పరిశీలకురాలు స్వాగత్ రణ్వీర్చంద్, -
పెరిగిన వినియోగం..బిల్లుల భారం
[ 15-05-2024]
మండే ఎండలు.. భరించలేని ఉక్కపోత.. వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఏప్రిల్, మే మొదటి వారంలో కరెంటు వినియోగం బాగా పెరిగింది. -
పట్టణ ఓటర్లు..పట్టించుకోలే!
[ 15-05-2024]
అక్షరాస్యులు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంత ఓటర్ల కంటే.. గ్రామీణుల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది.. వంద శాతం పోలింగ్ జరిగేందుకు ప్రభుత్వం పట్టణ ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా నిర్లిప్తత వీడలేదు.. -
పది విద్యార్థులకు ఆదర్శ కళాశాలల ఆహ్వానం
[ 15-05-2024]
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపి, రానున్న 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఆదర్శ కళాశాలలు ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నాయి. -
క్రాస్ ఓటింగ్.. ఎవరికి లాభమో..?
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి.. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమెంది. మూడు రాజకీయ పార్టీల నేతలు సుమారుగా నెల రోజుల పాటు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. -
ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో.. అంతంత మాత్రమే!
[ 15-05-2024]
ఓటర్లందరు ఓటు వేసేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయి. -
ఎమ్మెల్యేలతో మమేకమై పనిచేస్తా
[ 15-05-2024]
పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో తన విజయం కోసం ఎంతో కృషి చేశారని, తాను గెలిస్తే వారితో మమేకమై నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను’ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ అన్నారు. -
ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం
[ 15-05-2024]
ఎన్నికల్లో ఓట్లు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ తాను రుణపడి ఉంటానని ఎంపీ, భారాస అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. -
పేరు పేరునా కృతజ్ఞతలు
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తాను ఎంపీగా విజయం సాధించాలనే లక్ష్యంతో పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు కృషి చేశారని భాజపా అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మకు మందులు తెచ్చేందుకు వెళ్లి అనంతలోకాలకు..
-
కదిలొచ్చిన ఓటు.. కలిసొచ్చేది ఎటు!
-
బిర్యానీ బిల్లు ఎక్కువైందంటూ జవాన్ల వీరంగం
-
కాయ్ రాజా కాయ్!.. కూటమిదే అధికారమని జోరుగా పందేలు
-
నాడు ఫిఫోతోనే చెల్లింపులు.. ఇప్పుడెందుకు లేవు?
-
నాందేడ్-విశాఖ ఎక్స్ప్రెస్కు గ్రీన్ఛానల్.. ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలుబండి