‘హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్’
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
మహాముత్తారం : బోర్లగూడెంలో మాట్లాడుతున్న భారాస పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
మహాముత్తారం, పలిమెల, న్యూస్టుడే: అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జయశంకర్ జిల్లాలోని మహాముత్తారం మండలం బోర్లగూడెంలో, పలిమెల మండలం పంకెనలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. రైతు బంధు పెంపు, రెండు లక్షల రుణమాఫీ, కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, పింఛను పెంపు హామీలు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. నిరంతర విద్యుత్తు సరఫరా నుంచి ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్తు లేక పంటలు ఎండుతున్న తీరు బాధ కలిగిస్తోందని అన్నారు. మేడిగడ్డ పేరుతో కేసీఆర్ను ప్రజల్లో తక్కువ చేయాలని గోదావరిలో నిల్వ ఉన్న 10 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వదిలారని మండిపడ్డారు. మారుమూల మండలమైన మహాముత్తారంలో భారాస అధికారంలోకి వచ్చాకే మౌలిక వసతులు మెరుగైన మాట వాస్తవం కాదా అని అన్నారు. కాకా కుటుంబానికే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ను ఏళ్లుగా కేటాయిస్తోందని, రిజర్వేషన్ ఆ ఒక్క కుటుంబానికి సొంతమా అని ప్రశ్నించారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు వింటూ కనీసం ఠాణాల్లో ప్రజల ఫిర్యాదులు స్వీకరించడం లేదని, కాంగ్రెస్ నాయకులు చెబితేనే కేసులు పెడుతున్నారని, అది మంచి పద్ధతి కాదని చెప్పారు. తనకు ఓటేసి గెలిపిస్తే ప్రజల తరఫున పార్లమెంటులో ప్రజా సమస్యల పరిష్కారానికి గళం వినిపిస్తానని ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో మహాముత్తారం జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజిరెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు రాము, ఎంపీటీసీలు అర్జయ్య, వసంత, పలిమెల మండల అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి, నాయకులు జక్కు రాకేశ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
23,57,331 మంది ఓటేశారు..!
[ 15-05-2024]
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. -
పరిహారం చెల్లించరు.. పనులు ప్రారంభించరు!
[ 15-05-2024]
రామప్ప నుంచి లక్నవరం జలాశయం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం భూ సేకరణ చేయనున్న స్థలమిది. -
అందరి సహకారంతో ఎన్నికలు విజయవంతం
[ 15-05-2024]
అందరి సహకారంతో ములుగు జిల్లాలో లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం పోలింగ్ నిర్వహణపై ఆమె ప్రకటన విడుదల చేశారు. -
ప్రకటన బోర్డులు భద్రమేనా..!
[ 15-05-2024]
ఇటీవల ముంబయి మెట్రో నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈదురుగాలుల బీభత్సానికి ఘట్కోపర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం భారీ హోర్డింగ్ నేలకూలడంతో పది మందికి పైగా మరణించగా.. 80 మంది వరకు గాయపడ్డారు. -
కాస్త విశ్రాంతి..!
[ 15-05-2024]
రెండు నెలలుగా సాగిన లోక్సభ ఎన్నికల పోరులో అభ్యర్థులు తీరిక లేకుండా పనిచేశారు. ఎన్నికల షెడ్యూలు వచ్చిన నాటి నుంచి టికెట్టు కోసం పార్టీల అధిష్ఠానాలను ప్రసన్నం చేసుకోవడం, -
ఎవరి అంచనాలు వారివే..!
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ సోమవారం ముగియడంతో ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. -
ఫలితం నిక్షిప్తం.. భద్రత కట్టుదిట్టం
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను.. సాధారణ పరిశీలకురాలు స్వాగత్ రణ్వీర్చంద్, -
పెరిగిన వినియోగం..బిల్లుల భారం
[ 15-05-2024]
మండే ఎండలు.. భరించలేని ఉక్కపోత.. వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఏప్రిల్, మే మొదటి వారంలో కరెంటు వినియోగం బాగా పెరిగింది. -
పట్టణ ఓటర్లు..పట్టించుకోలే!
[ 15-05-2024]
అక్షరాస్యులు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంత ఓటర్ల కంటే.. గ్రామీణుల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది.. వంద శాతం పోలింగ్ జరిగేందుకు ప్రభుత్వం పట్టణ ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా నిర్లిప్తత వీడలేదు.. -
పది విద్యార్థులకు ఆదర్శ కళాశాలల ఆహ్వానం
[ 15-05-2024]
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపి, రానున్న 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఆదర్శ కళాశాలలు ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నాయి. -
క్రాస్ ఓటింగ్.. ఎవరికి లాభమో..?
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి.. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమెంది. మూడు రాజకీయ పార్టీల నేతలు సుమారుగా నెల రోజుల పాటు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. -
ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో.. అంతంత మాత్రమే!
[ 15-05-2024]
ఓటర్లందరు ఓటు వేసేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయి. -
ఎమ్మెల్యేలతో మమేకమై పనిచేస్తా
[ 15-05-2024]
పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో తన విజయం కోసం ఎంతో కృషి చేశారని, తాను గెలిస్తే వారితో మమేకమై నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను’ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ అన్నారు. -
ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం
[ 15-05-2024]
ఎన్నికల్లో ఓట్లు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ తాను రుణపడి ఉంటానని ఎంపీ, భారాస అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. -
పేరు పేరునా కృతజ్ఞతలు
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తాను ఎంపీగా విజయం సాధించాలనే లక్ష్యంతో పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు కృషి చేశారని భాజపా అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మకు మందులు తెచ్చేందుకు వెళ్లి అనంతలోకాలకు..
-
కదిలొచ్చిన ఓటు.. కలిసొచ్చేది ఎటు!
-
బిర్యానీ బిల్లు ఎక్కువైందంటూ జవాన్ల వీరంగం
-
కాయ్ రాజా కాయ్!.. కూటమిదే అధికారమని జోరుగా పందేలు
-
నాడు ఫిఫోతోనే చెల్లింపులు.. ఇప్పుడెందుకు లేవు?
-
నాందేడ్-విశాఖ ఎక్స్ప్రెస్కు గ్రీన్ఛానల్.. ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలుబండి