మరోసారి మోదీ ప్రభుత్వం ఖాయం
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్లో సోమవారం నిర్వహించిన భాజపా జనసభ విజయవంతమైంది. ఎండను సైతం లెక్కచేయకుండా లోక్సభ నియోజకర్గం పరిధిలోని ప్రజలు భారీగా తరలొచ్చారు.
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
నిలువెత్తు చిత్రపటంతో ఓ మహిళా కార్యకర్త
ఈనాడు, మహబూబాబాద్, న్యూస్టుడే, మహబూబాబాద్, నెహ్రూసెంటర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్లో సోమవారం నిర్వహించిన భాజపా జనసభ విజయవంతమైంది. ఎండను సైతం లెక్కచేయకుండా లోక్సభ నియోజకర్గం పరిధిలోని ప్రజలు భారీగా తరలొచ్చారు. పార్టీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ విజయం కోరుతూ నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హాజరై ప్రసంగించారు. దేశంలో మూడోసారి మోదీ నేతృత్వంలో భాజపా అధికారంలోకి రాబో తుందని.. మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి ఆచార్య సీతారాంనాయక్ను భారీ మెజార్టీతో గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో మరో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ గిరిజన నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి గురుకులాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
మాట్లాడుతున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వేదికపై ఎడమ నుంచి పార్టీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీధర్రెడ్డి, మాజీ ఎంపీ చాడా సురేష్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, క్రమశిక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, లోక్సభ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్, జాతీయ బీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్రావు, జిల్లా అధ్యక్షుడు వై.వెంకటేశ్వర్రావు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రభారీలు నూకల వెంకటనారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు
25 నిమిషాలు ముందుగానే
మొదట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సభలో పాల్గొన్న జేపీ నడ్డా షెడ్యూల్ ప్రకారం మహబూబాబాద్కు మధ్యాహ్నం 2:45కు రావాలి. నిర్ణీత సమయానికి కంటే 25 నిమిషాల ముందుగానే వేదిక వద్దకు వచ్చారు. అభ్యర్థి సీతారాంనాయక్ తర్వాత నడ్డా అరగంట ప్రసంగించారు.
* అభివృద్ధి తప్ప నాకు మరో ధ్యాస లేదు. ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు సేవకుడిగా పని చేస్తాను. - అజ్మీరా సీతారాంనాయక్, భాజపా అభ్యర్థి
మారుమోగిన మోదీ నినాదం
మోదీ పాలనలో దేశంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి.. ఎంతో కాలంగా ఎదురుచూసిన రామమందిరం నిర్మించుకున్నాం.. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో సమ్మక్క-సారలమ్మ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం.. రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాం.. అంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తుండగా ప్రజలు ఒక్కసారిగా మోదీ.. మోదీ అంటూ చేసిన నినాదాలలో సభాప్రాంగణం మార్మోగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పగటిపూట దోమ.. ప్రాణాంతకమే..!
[ 16-05-2024]
ఈడెస్ రకానికి చెందిన ఆడదోమ ద్వారా డెంగీ వ్యాపిస్తుంది. -
వనితే.. నిర్ణేత!
[ 16-05-2024]
ఒకప్పుడు మహిళలు ఓటింగ్కు దూరంగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతి ఎన్నికల్లో వారిదే పైచేయి అవుతోంది. -
నాణ్యత యంత్రాలు.. నమూనాకే పరిమితం
[ 16-05-2024]
వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గతేడాది మిర్చి పంటకు ఊహించని రీతిలో ధరలు వచ్చాయి. -
పరకాలలో గరిష్ఠం.. పశ్చిమలో కనిష్ఠం
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లాలో 64.76శాతం ఓటింగ్ నమోదైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 59 పోలింగ్ కేంద్రాలు
[ 16-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక కోసం జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి ప్రావీణ్య వెల్లడించారు. -
పెరిగిన పోలింగ్ శాతం!
[ 16-05-2024]
జిల్లాలో జనగామ, స్టే.ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలున్నాయి. -
కస్తూర్బాల బాట పట్టేలా!
[ 16-05-2024]
అనాథలు, పేదరికంలో మగ్గుతున్న బాలికలకు వసతితో కూడిన ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాల నిర్వహణ చేపడుతోంది. -
పల్లె ఓటెత్తింది.. పట్టణం పడకేసింది!
[ 16-05-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పల్లెల్లో ఓటాభిషేకం
[ 16-05-2024]
మహబూబాబాద్ లోక్సభ స్థానానికి జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో 2019 లోక్సభ ఎన్నికల కంటే ఈసారి జరిగిన రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది -
పల్లెల్లో ఓటోత్సాహం!
[ 16-05-2024]
మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి ములుగు శాసనసభ నియోజకవర్గంలో 2019 లోక్సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం కొంతమేర పెరిగింది. -
ప్రత్యక్షంగా వండేది లేదు.. దండుకునుడే!
[ 16-05-2024]
రైళ్లలో ఆహార పదార్థాల అమ్మకాలపై కొందరి గుత్తాధిపత్యం కొనసాగుతోంది. -
అంగన్వాడీ టీచర్ దారుణ హత్య
[ 16-05-2024]
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపురం గ్రామంలో దారుణం జరిగింది. -
ప్రవర్తనా నియమావళి పాటించాలి
[ 16-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నిక జిల్లా సాధారణ పరిశీలకులు రాహుల్ బొజ్జ సూచించారు. -
గ్రేటర్లో ఇంటి దొంగలు..!
[ 16-05-2024]
గ్రేటర్ వరంగల్లో ఇంటి దొంగల బెడద ఎక్కువైంది. కొందరు అధికారులు పెట్రోల్, డీజిల్ అప్పనంగా సొంత వాహనాలకు వాడుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం