logo

రామరాజుకు అధిష్ఠానం పిలుపు

ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

Published : 20 Apr 2024 05:51 IST

పాలకోడేరు, న్యూస్‌టుడే: ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. శుక్రవారం ఆయన తరఫున ఉండిలో నామినేషన్‌ దాఖలైంది.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రామరాజు చిన అమిరంలోని తన కార్యాలయంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇంతలోనే ఆయనకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి ఫోన్‌ రావడంతో కార్యాచరణ ప్రకటన వాయిదా వేశారు. శనివారం చంద్రబాబును కలిసిన తరువాత తుది నిర్ణయం వెల్లడిస్తానని ఆయన శ్రేణులకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని