చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు
జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
ముదినేపల్లి పాఠశాలలో ...
‘అన్నం మెతుకులు లావుగా ఉంటున్నాయి. తింటే కడుపులో నొప్పి వస్తోంది. తినలేక ఇంటికి వెళ్లి తింటున్నాం.’ ఓ విద్యార్థిని మాటలివి.
ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు 277 మంది పిల్లలున్నారు. శుక్రవారం పాఠశాలకు 167 మంచి వచ్చారు. అందులో భోజనం చేసింది 150 మంది అని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. వాస్తవంగా 100 మందిలోపే భోజనం చేశారు. ఉడికించిన గుడ్డు, వేరుశనగ చిక్కీ పెట్టలేదు. చాలా చోట్ల తినేందుకు అనువైన స్థలం, తాగేందుకు నీరు, చేతులు శుభ్రం చేసుకునే సౌకర్యం లేకపోవడం గమనార్హం. వంట తయారీ షెడ్లు అపరిశుభ్ర వాతావరణంలో ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు.
ఆగిరిపల్లి మండలంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 50 ఉన్నాయి. అందులో 7,630 మంది విద్యార్థులు చదువుతున్నారు. శుక్రవారం పాఠశాలకు 6,837 మంది విద్యార్థులు వచ్చారు. అయితే ప్రభుత్వ గణాంకాల్లో ఎక్కువ మంది విద్యార్థులు భోజనం చేస్తున్నట్లు చూపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తక్కువ మంది పాఠశాలల్లో భోజనం చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడైంది.
అడవినెక్కలంలో 150 మంది విద్యార్థులకు వండిన అన్నం, పప్పు
ఆగిరిపల్లి, ముదినేపల్లి, న్యూస్టుడే: జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. బడులు ఒంటి పూట పనిచేస్తున్న తరుణంలో అన్నం వద్దంటూ మండుటెండలో ఇంటి ముఖం పడుతున్నారు. శుక్రవారం ‘న్యూస్టుడే బృందం’ పరిశీలించగా..
మెనూలో ఉండాల్సింది
అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, వేరుశనగ చిక్కీ
కానీ
ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో గుడ్లు, చిక్కీలు లేవు
ముదినేపల్లి జడ్పీ పాఠశాలలో చిక్కీలు లేవు
ముదినేపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 348కి 202 మంది హాజరవగా 35 మంది మాత్రమే భోజనం చేశారు. మిగిలిన వారంతా Ëఇంటి బాటపట్టారు. చిక్కీలు మాత్రం ఇవ్వలేదు. సరఫరా లేదని చెబుతున్నారు. అన్నం చిమిడి పోతోందని తినలేకపోతున్నామని పలువురు విద్యార్థులు వాపోయారు. కొత్త బియ్యం కారణమని, నాలుగు నెలల నుంచి అసంపూర్తిగా బిల్లులు వస్తున్నాయని వంట ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.
గోరుముద్దలో ఎగనామం
జగన్ మామయ్య మాటలు కోటలు దాటాయంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. గత 15 రోజులుగా రాగిజావతో పాటు మధ్యాహ్న భోజనంలో గుడ్డు, వేరుశనగ చిక్కీలు మాయమయ్యాయి. పాఠశాలకు బియ్యంతో పాటు రాగిపిండి, బెల్లం, వేరుశనగ చిక్కీలు, గుడ్లు సరఫరా అయ్యేవి. కానీ ప్రస్తుతం బియ్యం ఒక్కటే వస్తోంది. మెనూ ప్రకారం సోమ, బుధ, శుక్రవారాల్లో విద్యార్థులకు చిక్కీ అందించాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు అయిదు రోజులు గుడ్డు అందించాలి. వాటి సరఫరా లేక విద్యార్థులకు వేరుశనగ చిక్కీ, గుడ్డు అందించడం లేదు. రోజూ రాగిజావ అందించాలి రాగిపిండి, బెల్లం సరఫరా లేక అది పిల్లలకు అందడం లేదు. రాగిపిండి, బెల్లం ప్యాకెట్లు, వేరుశనగ చిక్కీలు, గుడ్లు సరఫరా నిలిచిపోయింది. దాంతో విద్యార్థులకు అందడం లేదు అని ఆగిరిపల్లి ఎంఈవో కె.ఆనంద్ కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటర్ల తుది జాబితా విడుదల
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 14,73,811 మంది ఓటర్లున్నారు. -
దేవుడితో ఆటలా?
[ 03-05-2024]
‘ఆ దేవుడి దయతో.. మీ అందరి చల్లని దీవెనతో’ అంటూ ప్రసంగం మొదలు పెట్టే సీఎం జగన్ తన అయిదేళ్ల పాలనలో ఆ దేవుడికే శఠగోపం పెట్టారు. ఆయనతో పాటు వైకాపా ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. -
అన్ని వర్గాలను మోసగించిన జగన్
[ 03-05-2024]
ఉండి మండలంలోని పలు గ్రామాల్లో తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు గురువారం రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక సమస్యలను తెదేపా జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిగ నాగరాజులతో కలిసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. -
సీఎం వస్తే ఇంతేగా.. అర్ధరాత్రి డివైడర్ తొలగింపు
[ 03-05-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా చెట్లను కూల్చడం, నిర్మాణాలను ధ్వంసం చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. శుక్రవారం నరసాపురం పట్టణంలో జరిగే నియోజకవర్గస్థాయి సిద్ధం సభలో జగన్ పాల్గొననున్నారు. -
ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం
[ 03-05-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వరస్వామి ఎదుర్కోలు ఉత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. -
దయ లేదా అసలు?
[ 03-05-2024]
ఈనాడు డిజిటల్, భీమవరం, న్యూస్టుడే బృందం: పేదలకు కాని.. అవ్వాతాతలకు కానీ... పిల్లలకు కానీ ఏ వర్గానికైనా మంచి చేసే విషయంలో జగన్తో పోటీపడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని గర్వంగా చెబుతున్నా.. మరీ ముఖ్యంగా అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే అవకాశం, పరిస్థితి ఉండనే ఉండదు. -
ఎంతో చెప్పారు.. తుస్సుమనిపించారు
[ 03-05-2024]
పథకాలకు పేర్లు మార్చడంలో ఉన్న శ్రద్ధ వాటి అమలులో వైకాపా ప్రభుత్వానికి ఉండటం లేదు. తెదేపా హయాంలో అమలు చేసిన ఎన్టీఆర్ జలసిరి పథకానికి పేరు మార్చి వైఎస్ఆర్ జలకళ అని పెట్టింది. రైతులతో పాటు బోర్లు తవ్విన గుత్తేదారులూ అప్పులపాలైన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల విధుల నుంచి మినహాయింపులో చేతివాటం!
[ 03-05-2024]
ఎన్నికల విధుల నుంచి ఉద్యోగులను మినహాయించే విషయంలో అవకతవకలు జరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 13న నిర్వహించే సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించడానికి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు విధులు కేటాయించడంతోపాటు పలుమార్లు శిక్షణ ఇచ్చారు. -
విద్యావ్యవస్థ నిర్వీర్యం... గురువుల్లో నైరాశ్యం!
[ 03-05-2024]
విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదే. విద్యాబుద్ధులు నేర్పించే వారిని అయిదేళ్లపాటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. -
కుతంత్రాల జమానా!
[ 03-05-2024]
ఓ పక్క నిప్పుల కుంపటిలా ఎండ.. ఎక్కడ పింఛను ఇస్తారో తెలియక అయోమయం..తీరా వెళ్తే సొమ్ము జమైందో తెలుసుకోవడానికే గంటలకొద్దీ నిలువుకాళ్లపై పడిగాపులు.. గురువారం బ్యాంకుల వద్ద పింఛనుదార్ల ఆవేదన అంతా ఇంతా కాదు. పండుటాకుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. -
అవ్వాతాతల ఆక్రందన..!
[ 03-05-2024]
భీమవరం మండలం గొల్లవానితిప్పలో యూనియన్ బ్యాంకు శాఖకు గురువారం ఉదయమే పెద్ద సంఖ్యలో పింఛనుదారులు చేరుకున్నారు. రద్దీ కారణంగా లోపల నిలబడే చోటు లేకపోవడంతో వృద్ధులు ఇలా రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది. -
జగన్ పాలనపై ప్రజల్లో విరక్తి: రఘురామ
[ 03-05-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేలా సాగిన జగన్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని తెదేపా ఉండి అసెంబ్లీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
వైకాపాది అయిదేళ్ల అసమర్థ పాలన
[ 03-05-2024]
గత అయిదేళ్లలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని ఎన్డీయే రాజమహేంద్రవరం ఎంపీˆ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల మండలం మారంపల్లి, రాజుపాలెం, తిరుమలంపాలెం, గొల్లగూడెం, పంగిడిగూడెం, గుణ్ణంపల్లి గ్రామాల్లో గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుతో కలిసి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు