దొరికినకాడికి దోచుకోవడమే!
ఆయనదో ప్రత్యేక శైలి. మాటలు సంస్కరణల మైలురాళ్లు దాటుతాయి. చేతల్లోకి వస్తే ఆయనంత అవినీతిపరుడు మరొకరు ఉండరని చెబుతుంటారు. పురపాలక సంఘంలో ఎన్ని విధాలా అక్రమాలకు పాల్పడవచ్చో ఆయనకు తెలిసిన విధంగా మరొకరికి తెలియదు.
పురపాలికలో అవినీతి అనకొండ
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే: ఆయనదో ప్రత్యేక శైలి. మాటలు సంస్కరణల మైలురాళ్లు దాటుతాయి. చేతల్లోకి వస్తే ఆయనంత అవినీతిపరుడు మరొకరు ఉండరని చెబుతుంటారు. పురపాలక సంఘంలో ఎన్ని విధాలా అక్రమాలకు పాల్పడవచ్చో ఆయనకు తెలిసిన విధంగా మరొకరికి తెలియదు. జిల్లాలోని ఓ మంత్రి సహకారంతో ఇతర విభాగం నుంచి డిప్యుటేషన్పై ఉన్నత స్థాయి అధికారిగా వచ్చిన ఆయన కొన్ని నెలలకే రూ.కోట్లకు పడగలెత్తారు. సొంత అవసరాలకు మున్సిపల్ సిబ్బందిని వినియోగించుకుంటూ విమర్శలపాలవుతున్నారు. ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, పారిశుద్ధ్య విభాగాల అధికారులను ఒత్తిడికి గురి చేస్తూ భారీ మొత్తంలో లబ్ధి పొందుతున్నట్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. సదరు అధికారి అవినీతి చిట్టా లెక్కించలేనంత స్థాయికి చేరుకోవడంతో పలువురు తెదేపా నేతలు సదరు అధికారిపై కలెక్టర్కు పలు సందర్భాల్లో ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
వేలానికి ఉద్యోగాలు..
వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్న ఆ మున్సిపాలిటీలో ఇటీవల అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే కంప్యూటర్ పోస్టు ఖాళీ అయ్యింది. పోస్టు రూ.15 లక్షలకు విక్రయానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇంజినీరింగ్ విభాగంలో ఆ అధికారికి వ్యతిరేకంగా పనిచేసే ఇరువురు అవుట్సోర్సింగ్ సిబ్బందిపై వేటు వేసేందుకు చర్యలు ప్రారంభించారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించడానికి ఒక్కొక్క పోస్టుకు రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆప్కాస్ విధానంలో పనిచేసే ఇరువురు పారిశుద్ధ్య సిబ్బందిని వివిధ కారణాలు చూపించి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పోస్టులను కూడా విక్రయానికి పెట్టడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెరపైకి టీడీఆర్ బాండ్లు..
ఇప్పటికే టీడీఆర్ బాండ్ల జారీలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి ఓ రహదారిని బృహత్తర ప్రణాళిక ప్రకారం 40 అడుగుల రోడ్డుగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రోడ్డును వెడల్పు చేయాల్సిన అవసరమే లేదు. కానీ రోడ్డు వైండింగ్ పేరిట బాండ్లు జారీ చేసి పెద్ద మొత్తంలో లబ్ధిపొందాలని ఆ అధికారి ప్రణాళిక సిద్ధం చేశారు.
ఖజానాకు కన్నం.. చిన్న చిన్న ఆక్రమణలు, రోడ్లపై ఉన్న మొక్కలను తొలగించడం వంటి పనులకు రూ.లక్షల్లో బిల్లులు మంజూరు చేస్తూ మున్సిపల్ ఖజానాకు కన్నం వేస్తున్నారు. ఒకటి నుంచి ఆరు వార్డుల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులకు ఏకంగా రూ.33.26 లక్షల బిల్లులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మిస్తుండగా ఆ అధికారి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. ఇవ్వకపోవడంతో ఇంటిని కూల్చేందుకు పురపాలక అధికారులు సిద్ధమయ్యారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఈ సంఘటన పెద్ద దుమారమే లేపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విధ్వంస వేటు
[ 12-05-2024]
గోదావరి సవ్వళ్లు.. ప్రశాంతతకు మారుపేరైన పల్లెలు.. ఆత్మీయతకు రూపమైన పురాలు... ఉమ్మడి పశ్చిమ గోదావరి పేరెత్తగానే రాష్ట్రంలోని ప్రజల మదిలో మెదిలే భావాలివి.. కానీ, అయిదేళ్ల జగన్ పాలనలో జిల్లాలో దాడులు పెరిగిపోయాయి. -
రాష్ట్రానికి జీవనాడి.. పథకాలు ఎడారి
[ 12-05-2024]
అపార జలవనరులు ఉన్న ఏలూరు జిల్లా రాష్ట్రానికి జీవనాడి అయ్యే అవకాశాలు ఉన్నా, వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో ఆ జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. -
ముమ్మాటికీ.. జగనాసుర మార్గాలే!
[ 12-05-2024]
ఏ దేశంలోనైనా ప్రగతికి చిహ్నాలు మార్గాలే.. ఆర్థిక అభ్యున్నతికి ఊపిరినివ్వాల్సిన మార్గాలు జగన్ ఏలుబడిలో బలిపీఠమెక్కాయి. -
రైతుల కంట్లో కారం.. వైకాపా నేతలకు ‘సహకారం’
[ 12-05-2024]
అయిదేళ్ల వైకాపా సర్కారు పాలనలో సహకార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రజా సొమ్మును స్వాహా చేయడంలో సిద్ధహస్తులైన అధికార పార్టీ నేతల కారణంగా అవినీతి ఊబిలో కూరుకుపోయాయి. -
జగన్ వస్తే...జనం అల్లాడాల్సిందే!
[ 12-05-2024]
మండుటెండ..విపరీతమైన ఉక్కపోత...గంటల కొద్దీ నిరీక్షణతో శనివారం కైకలూరులోని సీఎం జగన్ సభకు వచ్చిన ప్రజలు నరకయాతన అనుభవించారు. -
బాకాలూదుకోవడమే
[ 12-05-2024]
కైకలూరులో సీఎం జగన్ శనివారం నిర్వహించిన సిద్ధం సభలో ఆద్యంతం పథకాల గురించి ఊదరకొట్టారు. -
ఈ చట్టం మనకొద్దు
[ 12-05-2024]
వైకాపా సర్కారు తెచ్చిన భూహక్కు చట్టం ప్రతుల నకళ్లను నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పెద అమిరంలోని తన నివాసం వద్ద శనివారం సాయంత్రం దహనం చేసి నిరసన తెలిపారు. -
జగన్కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు
[ 12-05-2024]
నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయలేని సీఎం జగన్ అయిదేళ్లలో 12 సార్లు ఛార్జీలు పెంచి చీకట్లు మిగిల్చారని వైకాపాకు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
క్లీన్ స్వీప్ చేయబోతున్నాం
[ 12-05-2024]
ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ అన్నారు. -
ఓట్ల వేటకు కోట్లు గుమ్మరింపు!
[ 12-05-2024]
ప్రస్తుత ఎన్నికలను రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లపై నోట్ల వాన కురుస్తోంది. -
ఊరు రమ్మంది.. ఓటేయమంది!
[ 12-05-2024]
ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వేలాది మంది ఓటు వేసేందుకు స్వస్థలాలకు భారీగా తరలి వస్తున్నారు. -
వ్యతిరేక ఓటును ఆపే కుట్ర?
[ 12-05-2024]
‘హలో.. మేము తహసీల్దారు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. మీకు తణుకులో ఆదివారం నుంచి ఎన్నికల విధులు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వికృత నేరాల రూపం.. కొడగు బాలిక కేసు కొత్తమలుపు
-
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/24)
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా.. జపాన్ కంపెనీ సీఈఓ