నేటి నుంచి పవన్ ప్రచార భేరి
ఉమ్మడి పశ్చిమలో జనసేనాని పవన్కల్యాణ్ ప్రచార భేరి మోగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న వారాహి విజయభేరి కార్యక్రమంలో భాగంగా సోమ, మంగళవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు.
గణపవరం, తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెంలో సభలు
ఈనాడు, తాడేపల్లిగూడెం, న్యూస్టుడే, కొయ్యలగూడెం గ్రామీణం: ఉమ్మడి పశ్చిమలో జనసేనాని పవన్కల్యాణ్ ప్రచార భేరి మోగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న వారాహి విజయభేరి కార్యక్రమంలో భాగంగా సోమ, మంగళవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. గణపవరం, తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెంలలో రోడ్షోతో పాటు భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గణపవరం, తాడేపల్లిగూడెం బహిరంగ సభలు ఈ నెల 22న జరగాల్సి ఉండగా..హెలికాప్టర్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో చివరి నిమిషంలో వాయిదా పడి పవన్ రాలేకపోయారు. ఆయన సోమవారం పిఠాపురం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు గణపవరం మహాలక్ష్మి థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్షోగా వచ్చి పోలీస్ ఐల్యాండ్ సెంటర్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిప్పర, చిలకంపాడు లాకులు మీదుగా రోడ్షోగా వచ్చి రాత్రి 7 గంటలకు తాడేపల్లిగూడెం గొల్లగూడెం సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం పిఠాపురం వెళతారు. మంగళవారం సాయంత్రం కొయ్యలగూడెం మండలం గవరవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా కొయ్యలగూడెం వచ్చి అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం తిరిగి పిఠాపురం వెళతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి శ్రేణుల్లో జోష్
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల పండగ ముగిసింది. నేతల భవితవ్యాలన్నీ స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. ఫలితాల విడుదలకు జూన్ 4 వరకు సమయం ఉండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. -
26 వరకూ పలు రైళ్ల రద్దు
[ 16-05-2024]
గుంటూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ఈ నెల 15 నుంచి 26 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖాధికారులు తెలిపారు. -
సొమ్ము జమవుతుందా లేదా?
[ 16-05-2024]
సంక్షేమ పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు దక్కాల్సిన నిధులను పోలింగ్ పూర్తయిన వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. -
ఎంతకాలం ఈ సంక్షోభ గృహాలు?
[ 16-05-2024]
సంక్షేమ వసతి గృహాలు.. సంక్షోభ వసతి గృహాలుగా మారిపోయాయి. కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. మరుగుదొడ్లు లేక ఇక్కట్లు, తాగునీరు లేక అవస్థలు విద్యార్థులకు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ వైఫల్యంతో వేసవి సెలవుల్లో చేయాల్సిన చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయలేక అధికారులు చతికిలపడ్డారు. -
సమావేశాలకే దిక్కు లేదు.. సాయమెక్కడ?
[ 16-05-2024]
మన్యంలోని గిరిజనుల సంక్షేమాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుపరిచే ఉద్దేశంతో కేఆర్పురంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యకలాపాలు నామమాత్రంగా మారాయి. సంక్షేమ పథకాల అమలు తీరు మొక్కుబడి తంతును తలపిస్తోంది. -
ఆగని మట్టి అక్రమ రవాణా
[ 16-05-2024]
ఉన్నతాధికారులు కొద్ది రోజులుగా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉండగా.. క్షేత్ర స్థాయిలో కొంత మంది ఉద్యోగుల సహకారంతో మట్టి మాఫియా బరి తెగించింది. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా తరలింపు సాగిపోతోంది. -
బంతి.. బంతికీ బెట్టింగ్
[ 16-05-2024]
ఈటింగ్.. ప్లేయింగ్.. బ్యాకింగ్త్రీ పదాలు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు హోరెత్తుతున్నాయి. సామాన్యులకు ఈ పదాలు కొత్తగా అనిపించినా క్రికెట్ బెట్టింగ్లో పాల్గొనే వారికి ఎంతో సుపరిచితం. -
పైసా విదల్చలేదు!
[ 16-05-2024]
పెనుగొండ మండలం రామన్నపాలెం, నడిపూడి, ఇలపర్రు, ములపర్రు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు విద్యుత్తు బిల్లులు చెల్లించడం లేదని విద్యుత్తుశాఖ సిబ్బంది 3 నెలలు సరఫరా నిలిపేశారు. -
ప్రేమ వివాహాన్ని కాదన్నారని ఆత్మహత్యాయత్నం
[ 16-05-2024]
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోగా ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించి.. బలవంతంగా తీసుకువెళ్లడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
గోదావరిలో మునిగి ఇద్దరి దుర్మరణం
[ 16-05-2024]
వేర్వేరు ప్రాంతాల్లో గోదావరిలో స్నానానికి దిగిన జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు నదిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. తణుకు పట్టణానికి చెందిన చుక్క బాలాజీ (24) స్థానిక ఏఎస్ఆర్ కళాశాలలో ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్నారు. -
13,70,153 మంది ఓటేశారు
[ 16-05-2024]
జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ శాతం నమోదైంది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 16,37,430 మంది ఓటర్లు ఉండగా 13,70,153(83.68 శాతం) ఓట్లు పోలయ్యాయి. -
సిబ్బంది చేతివాటంతో టన్నుల కొద్దీ తరలిపోతున్న వైనం
[ 16-05-2024]
అటవీ అభివృద్ధి సంస్థపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన లక్షల రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం