logo

నేటి నుంచి పవన్‌ ప్రచార భేరి

ఉమ్మడి పశ్చిమలో జనసేనాని పవన్‌కల్యాణ్‌ ప్రచార భేరి మోగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న వారాహి విజయభేరి కార్యక్రమంలో భాగంగా సోమ, మంగళవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు.

Published : 29 Apr 2024 03:15 IST

గణపవరం, తాడేపల్లిగూడెం,  కొయ్యలగూడెంలో సభలు

ఈనాడు, తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే, కొయ్యలగూడెం గ్రామీణం: ఉమ్మడి పశ్చిమలో జనసేనాని పవన్‌కల్యాణ్‌ ప్రచార భేరి మోగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న వారాహి విజయభేరి కార్యక్రమంలో భాగంగా సోమ, మంగళవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. గణపవరం, తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెంలలో రోడ్‌షోతో పాటు భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గణపవరం, తాడేపల్లిగూడెం బహిరంగ సభలు ఈ నెల 22న జరగాల్సి ఉండగా..హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో చివరి నిమిషంలో వాయిదా పడి పవన్‌ రాలేకపోయారు. ఆయన సోమవారం పిఠాపురం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు గణపవరం మహాలక్ష్మి థియేటర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్‌షోగా వచ్చి పోలీస్‌ ఐల్యాండ్‌ సెంటర్‌ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిప్పర, చిలకంపాడు లాకులు మీదుగా రోడ్‌షోగా వచ్చి రాత్రి 7 గంటలకు తాడేపల్లిగూడెం గొల్లగూడెం సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం పిఠాపురం వెళతారు. మంగళవారం సాయంత్రం కొయ్యలగూడెం మండలం గవరవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా కొయ్యలగూడెం వచ్చి అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం తిరిగి పిఠాపురం వెళతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని