logo

ఏఎస్పీ కేశప్పపై ఎంసీసీ అధికారుల విచారణ

ఏఎస్పీ కేశప్పపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, ఎంపీడీవో భానుప్రసాద్‌ మంగళవారం విచారణ చేపట్టారు. మదనపల్లె మండలం బొమ్మనచెరువులో ఆదివారం

Published : 24 Apr 2024 02:49 IST

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: ఏఎస్పీ కేశప్పపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, ఎంపీడీవో భానుప్రసాద్‌ మంగళవారం విచారణ చేపట్టారు. మదనపల్లె మండలం బొమ్మనచెరువులో ఆదివారం పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏఎస్పీ శాల్యూట్‌ చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని వచ్చిన ఆరోపణలపై విచారించి నివేదిక ఇవ్వాలని ఎంసీసీ అధికారులను ఆర్వో హరిప్రసాద్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో విచారణ చేపట్టిన అధికారులు ఏఎస్పీ బొమ్మనచెరువుకు రావడం, మంత్రి పెద్దిరెడ్డికి శాల్యూట్‌ చేయడం వాస్తవమని గుర్తించారు. మంత్రితో మాట్లాడారా? ఏం మాట్లాడారు? తదితర వివరాలపై ఆరా తీస్తున్నారు. గ్రామంతోపాటు పంచాయతీ కార్యాలయంలోనూ వేర్వేరుగా విచారణ జరిపారు. ఈ మేరకు ఆర్వోకు నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని