logo

తెదేపాలో చేరికలు... విజయానికి సంకేతాలు

తెదేపాలోకి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు చేరిపోతున్నారు. తమ మద్దతు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు పలుకుతున్నారు. మైదుకూరు పట్టణంలో 15వ వార్డుకు చెందిన వైకాపా నాయకులు బండి సుబ్బరాయుడు, బండి రాజాలు వారి అనుచరులతో శనివారం తెదేపాలో చేరారు.

Published : 28 Apr 2024 05:31 IST

మైదుకూరులోని వినాయక్‌నగర్‌లో పార్టీలో చేరిన  నాయకులతో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌

మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు వైద్యం, ఎర్రగుంట్ల(కొండాపురం), కలసపాడు, అట్లూరు, న్యూస్‌టుడే: తెదేపాలోకి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు చేరిపోతున్నారు. తమ మద్దతు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు పలుకుతున్నారు. మైదుకూరు పట్టణంలో 15వ వార్డుకు చెందిన వైకాపా నాయకులు బండి సుబ్బరాయుడు, బండి రాజాలు వారి అనుచరులతో శనివారం తెదేపాలో చేరారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా ఎన్‌డీఏ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దువ్వూరు మండలంలోని ఇడమడక గ్రామానికి చెందిన గుత్తి లక్ష్మీనారాయణ, గుత్తి భూపతి, ముద్దం ప్రసాద్‌, శీల పెద్ద వెంకటసుబ్బయ్య, నరసింహయ్య, పెద్దవీరయ్య, చిన్నవీరయ్య వారి అనుచరులు చేరారు. భాకరాపేట గ్రామానికి చెందిన వైకాపా నాయకులు ఓబులేసు, శ్రీనివాసులు, బాలరంగ, దస్తగిరి, వెంకటరమణ, చంద్ర వారి అనుచరులు పుట్టా సమక్షంలో  పార్టీలో చేరారు.  ప్రొద్దుటూరులో తెదేపా గెలుపు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. తెదేపాలో చేరికలు, వలసలు దానికి సంకేతాలన్నారు. మండల పరిధిలోని పెద్దశెట్టిపల్లె పంచాయితీ నరసింహాపురంలోని చౌడం చిన్న సుబ్బరాయుడుతో పాటు 30 కుటుంబాలు వైకాపాను వీడి తేదేపాలో చేరారు. వారందరికి వరదరాజులరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వరదరాజులరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలంతా తెదేపా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మూపూరు నాగరాజు, సూరి, సుబ్బరాయుడు, వెంకటేష్‌, శ్రీరాములు, వంకం రామమోహన్‌, చిమ్మని, యజ్ఞం బాబు, ఖమ్మం వాసు, చౌడం సత్యనారాయణ, వెంకటేష్‌, రామసుబ్బయ్యతో పాటు 30 మంది తెదేపాలో చేరారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని మేకలబాలాయపల్లె గ్రామానికి చెందిన వన్నూరు ఆధ్వర్యంలో 60 కుటుంబాలు ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

కలసపాడులో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రంతూ, రాంభూపాల్‌రెడ్డి, తదితరులు

కలసపాడు మండలకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో స్థానిక తెదేపా నాయకులు తిమ్మిశెట¨్ట రమణయ్య, అక్కిశెట¨్ట నాగేంద్ర ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన పలు కుటుంబాలు తెదేపాలో చేరారు. వీరికి విజయమ్మ, తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ, మాజీ జడ్పీట©సీ రాంభూపాల్‌రెడ్డి తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 50 కుటుంబాలకు పైగా తెదేపాలో చేరినట్లు రంతూ తెలిపారు. అట్లూరు మండలంలోని ఎస్‌.వెంకటాపురం రంగంపల్లె కాలనీలో పలువురు వైకాపా కుటుంబాలు ఎన్‌డీఏ అభ్యర్థి బొజ్జా రోశన్న ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. ఎస్‌.వెంకటాపురం, జి.కొత్తపల్లె గ్రామాల్లో బొజ్జా రోశన్న ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకే ఓటేయాలంటూ అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని