తెదేపాలో చేరికలు... విజయానికి సంకేతాలు
తెదేపాలోకి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు చేరిపోతున్నారు. తమ మద్దతు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు పలుకుతున్నారు. మైదుకూరు పట్టణంలో 15వ వార్డుకు చెందిన వైకాపా నాయకులు బండి సుబ్బరాయుడు, బండి రాజాలు వారి అనుచరులతో శనివారం తెదేపాలో చేరారు.
మైదుకూరులోని వినాయక్నగర్లో పార్టీలో చేరిన నాయకులతో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్యాదవ్
మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు వైద్యం, ఎర్రగుంట్ల(కొండాపురం), కలసపాడు, అట్లూరు, న్యూస్టుడే: తెదేపాలోకి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు చేరిపోతున్నారు. తమ మద్దతు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు పలుకుతున్నారు. మైదుకూరు పట్టణంలో 15వ వార్డుకు చెందిన వైకాపా నాయకులు బండి సుబ్బరాయుడు, బండి రాజాలు వారి అనుచరులతో శనివారం తెదేపాలో చేరారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థి పుట్టా సుధాకర్యాదవ్ అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దువ్వూరు మండలంలోని ఇడమడక గ్రామానికి చెందిన గుత్తి లక్ష్మీనారాయణ, గుత్తి భూపతి, ముద్దం ప్రసాద్, శీల పెద్ద వెంకటసుబ్బయ్య, నరసింహయ్య, పెద్దవీరయ్య, చిన్నవీరయ్య వారి అనుచరులు చేరారు. భాకరాపేట గ్రామానికి చెందిన వైకాపా నాయకులు ఓబులేసు, శ్రీనివాసులు, బాలరంగ, దస్తగిరి, వెంకటరమణ, చంద్ర వారి అనుచరులు పుట్టా సమక్షంలో పార్టీలో చేరారు. ప్రొద్దుటూరులో తెదేపా గెలుపు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. తెదేపాలో చేరికలు, వలసలు దానికి సంకేతాలన్నారు. మండల పరిధిలోని పెద్దశెట్టిపల్లె పంచాయితీ నరసింహాపురంలోని చౌడం చిన్న సుబ్బరాయుడుతో పాటు 30 కుటుంబాలు వైకాపాను వీడి తేదేపాలో చేరారు. వారందరికి వరదరాజులరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వరదరాజులరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలంతా తెదేపా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మూపూరు నాగరాజు, సూరి, సుబ్బరాయుడు, వెంకటేష్, శ్రీరాములు, వంకం రామమోహన్, చిమ్మని, యజ్ఞం బాబు, ఖమ్మం వాసు, చౌడం సత్యనారాయణ, వెంకటేష్, రామసుబ్బయ్యతో పాటు 30 మంది తెదేపాలో చేరారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని మేకలబాలాయపల్లె గ్రామానికి చెందిన వన్నూరు ఆధ్వర్యంలో 60 కుటుంబాలు ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
కలసపాడులో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రంతూ, రాంభూపాల్రెడ్డి, తదితరులు
కలసపాడు మండలకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో స్థానిక తెదేపా నాయకులు తిమ్మిశెట¨్ట రమణయ్య, అక్కిశెట¨్ట నాగేంద్ర ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన పలు కుటుంబాలు తెదేపాలో చేరారు. వీరికి విజయమ్మ, తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ, మాజీ జడ్పీట©సీ రాంభూపాల్రెడ్డి తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 50 కుటుంబాలకు పైగా తెదేపాలో చేరినట్లు రంతూ తెలిపారు. అట్లూరు మండలంలోని ఎస్.వెంకటాపురం రంగంపల్లె కాలనీలో పలువురు వైకాపా కుటుంబాలు ఎన్డీఏ అభ్యర్థి బొజ్జా రోశన్న ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. ఎస్.వెంకటాపురం, జి.కొత్తపల్లె గ్రామాల్లో బొజ్జా రోశన్న ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకే ఓటేయాలంటూ అభ్యర్థించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడితో జనం బలి... ఓటుతో వేటేస్తేనే దీపావళి
[ 12-05-2024]
జగనాసురుడి ఏలుబడి... ఎవరూ ఎప్పుడూ ఎక్కడా చూడని పెను విధ్వంసాన్ని స్పష్టించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజల జీవిత చక్రాన్ని వైకాపా ప్రభుత్వం ఛిద్రం చేసింది. -
అక్రమాల్లో బాద్షా
[ 12-05-2024]
‘ఎక్కడెక్కడి నేతలో లెక్కలేనన్ని అక్రమాలు చేస్తుంటే.. జగన్ సొంత జిల్లా, అందులోనూ జిల్లా కేంద్రం ప్రజాప్రతినిధిని.. పైపెచ్చు సీఎం తర్వాత సీఎం అంతటి హోదా కాబట్టి వారికంటే ఒక మెట్టు పైనే ఉండాలి’ అని అనుకున్నారో ఏమో.. కడపలో ఆయన చేయని దౌర్జన్యం లేదు. -
చేసింది శూన్యం... దోచింది అనంతరం
[ 12-05-2024]
మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం చేసింది శూన్యం కానీ దోచింది మాత్రం అనంతం... గుట్టను, మట్టిని, ఇసుకను అక్రమంగా తవ్వుకోవడంతో పాటు భూకబ్జాలు, దౌర్జన్యాలు, గంజాయి, ఎర్రచందనం అక్రమ రవాణా వంటి అక్రమాలతో అలజడులు సృష్టించారు. -
కాంగ్రెస్ సహకారంతోనే కడప ఉక్కు సాకారం
[ 12-05-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కడప ఉక్కు పరిశ్రమ వస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కడప నగరంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. -
తెదేపాలో చేరికలు... జోరుగా ప్రచారాలు
[ 12-05-2024]
భారీగా జరిగాయి. శనివారం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గ మండలాల్లో ఎన్డీఏ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేశారు. -
దొంగనోట్లు పంచి ప్రలోభాలకు గురి చేస్తున్నారు జాగ్రత్త : వరద
[ 12-05-2024]
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి మోసగాడని, ఎన్నికల్లో గెలిచేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు. స్థానిక తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
‘రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది’
[ 12-05-2024]
తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి ఆయన లాగే పాలిస్తారని అనుకున్నాం. -
వైకాపా ప్రభుత్వం మైనారిటీలకు ఏం చేసిందని ఓటేయాలి?
[ 12-05-2024]
వైకాపా ప్రభుత్వం మైనారిటీల కోసం ఏం చేసిందని ఆ పార్టీ నాయకులకు ఓటేయాలని తెదేపా పట్టణాధ్యక్షుడు జబీవుల్లా ప్రశ్నించారు. -
కోదండరాముడి అభిషేకం
[ 12-05-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేకం క్రతువును నయనానందకరంగా నిర్వహించారు. -
రాచమల్లు అరాచకాలపై వరద కరపత్రం విడుదల
[ 12-05-2024]
స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారంటూ తెదేపా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి శనివారం ‘ధుర్యోదన నీ చేష్టలు నీచాతినీచం’ పేరుతో కరపత్రం విడుదల చేశారు -
ఆదినారాయణరెడ్డి ప్రగతిపై కరపత్రం చక్కర్లు
[ 12-05-2024]
జమ్మలమడుగు ఓటరు మహాశయులకు విజ్ఞప్తి’ పేరిట ఒక కరపత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకున్న దాఖలాల్లేవు: సూర్యనారాయణ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన.. తలరాతలు మార్చుకునే తరుణమిదే
-
అరకులో కూటమికే మొగ్గు!.. ఈ పార్లమెంటు బరిలో వైకాపా ఎదురీత
-
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు.. సొంత ఊర్లకు చేరుకుంటున్న ప్రవాసాంధ్రులు
-
నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం