జగన్ దంపతులొచ్చి ప్రచారం చేసినా గెలుపు నాదే
ఈ నెల 25వ తేదీన నామినేషన్ తర్వాత తలపెట్టిన కూటమి ర్యాలీ విజయవంతమైనందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మాట్లాడుతున్న కూటమి జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి
జమ్మలమడుగు, న్యూస్టుడే: ఈ నెల 25వ తేదీన నామినేషన్ తర్వాత తలపెట్టిన కూటమి ర్యాలీ విజయవంతమైనందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం స్థానిక భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జగన్రెడ్డి, భారతి, అవినాష్రెడ్డి ఆధ్వర్యంలోనే వివేకానందరెడ్డి హత్య జరిగిందని.... సీబీఐ కూడా అదే చెబుతోందని ఆరోపించారు. నిందితులు ఆ సమయంలో ఎవరి దగ్గర ఉన్నారో దివంగత ముఖ్యమంతి వైఎస్ రాజశేఖర్రెడ్డి తమ్ముళ్లకు తెలియదా అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి తరపున వైఎస్ తమ్ముళ్లు అయిన సుధీకర్రెడ్డి, రవీంద్రనాథరెడ్డి...అవినాష్రెడ్డి తరపున ప్రచారం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వంలో అక్రమ ఇసుక రవాణా, మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతునాయన్నారు. వానలు లేకపోయినా జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. రాజోలి, గండికోట జలాశయం బాధితులకు పరిహారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో జగన్రెడ్డి దంపతులు వచ్చి ప్రచారం చేసినా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. కూటమిని గెలిపిస్తే మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ కళాశాలలు తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకుడు రాజేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రజకుల ఆత్మీయ సదస్సులో ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రజకులను ఏ మాత్రం ఆదుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రజకుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించడంతో పేద మధ్యతరగతి, వివిధ కుల సంఘాలు వెనబడ్డాయన్నాని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, రజక సంఘం నాయకులు తొర్రివేముల చెన్నప్ప, చెలో రవి, లక్ష్మీదేవి, చెన్నప్ప, పిచ్చయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కడప జిల్లా ప్రజల తీర్పు చిరస్థాయిగా నిలిచిపోతుంది: సునీత
[ 11-05-2024]
ఈ ఎన్నికల్లో కడప జిల్లా ప్రజల ఇచ్చే తీర్పు చిరస్థాయిగా నిలిచిపోతుందని వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు. -
షర్మిలను గెలిపించండి: వైఎస్ విజయమ్మ
[ 11-05-2024]
పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏపీ సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. -
కడపలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
[ 11-05-2024]
కడపలోని షిర్డి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు, పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. -
పదేళ్లుగా ఆయనే నేత... మారలేదు ప్రజల తలరాత!
[ 11-05-2024]
పెద్దిరెడ్డి మిథున్రెడ్డి... వైకాపా రాజంపేట ఎంపీగా పదేళ్లుగా ఉంటున్నారు. సీఎం జగన్కు అత్యంత ప్రీతిపాత్రుడు...నమ్మకమైన వ్యక్తి కూడా. -
దోపిడీదారులకు ఓటేయొద్దు
[ 11-05-2024]
సహజ సందప, వనరులను దోచుకుని వాటి ద్వారా సంపాదించిన డబ్బులతో ఎన్నికల్లో గెలవాలని వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ సీఎం భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఐదేళ్లు జగన్ కులాసా.. రైతులకేదీ భరోసా..?
[ 11-05-2024]
విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతలకు అండగా నిలబడతామని సీఎం జగన్ డప్పు కొట్టారు. కర్షకుల కన్నీళ్లు తుడుస్తామని, పూర్తిస్థాయిలో సేవలందించడానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పగా ప్రకటించారు. -
ఉప ముఖ్యమంత్రిగా.. ఉపయోగమేంటి..?
[ 11-05-2024]
అంజాద్బాషా... కార్పొరేటర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2014లో వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ ఓడిపోయినందున ఏమీ చేయలేనని ఐదేళ్లపాటు నగర వాసుల్ని నమ్మించారు. -
అంజాద్ బాషాను కాదు... నన్ను చూడండి
[ 11-05-2024]
‘వైకాపా కడప అసెంబ్లీ అభ్యర్థి అంజాద్బాషాపై కొద్దో, గొప్పో కోపం ఉన్నా పక్కన పెట్టండి... నన్ను చూసి ఓటేయండి...’ అని కడప నగరంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ఓటర్లను వేడుకున్నారు. -
ఉపాధి అన్నావ్.. ఉసురు పోసుకున్నావ్!
[ 11-05-2024]
ఏటా ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన హామీని విస్మరించి నిరుద్యోగులను సీఎం జగన్ నిండా ముంచారు. కొత్త కంపెనీలు రాకపోగా, ప్రోత్సాహకాలు లేక ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలివెళ్లాయి. -
ఆస్తులు మనవి కావాలంటే జగన్ను ఓడించాలి
[ 11-05-2024]
ప్రజల భూములు కాజేసేందుకే వైకాపా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తోందని తెదేపా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు. -
రాష్ట్రంలో వైకాపాకు ఇవే చివరి ఎన్నికలు
[ 11-05-2024]
రాష్ట్రంలో వైకాపాకు సోమవారం జరిగే ఎన్నికలు చవరివని ఆ పార్టీ ఎన్నికల తరువాత ప్రజలిచ్చే తీర్పుతో కనుమరుగు కావడం ఖాయమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. లింగారెడ్డి పేర్కొన్నారు. -
తెదేపాలో భారీగా చేరికలు... శ్రేణుల్లో ఉత్సాహం
[ 11-05-2024]
ప్రొద్దుటూరులో తెదేపాలోకి చేరికలు, వసలు, కలయికలతో కళకళలాడుతోందని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. -
రాచమల్లు చెప్పేదొకటి... చేసేది మరొకటి
[ 11-05-2024]
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి ఆయన మాటలు కోటలు దాటుతాయి... చేతలు మాత్రం గడప దాటవు. గొప్ప మాటకారి. అభినవ దానకర్ణుడిగా పేరుపొందారు. -
ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలను జమ్మలమడుగులో ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. -
ఓటింగ్ ప్రక్రియ ముగిసేవరకు సహకరించాలి
[ 11-05-2024]
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఈ నెల 13న జరగనున్న పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా ముగిసే వరకు అభ్యర్థులు అన్ని విధాలుగా సహకరించాలని ఎన్నికల పరిశీలకుడు భానుదాసు పాల్వే, ఆర్వో కౌసర్ బాను స్పష్టం చేశారు. -
జగన్లో కాంగ్రెస్ కలవరం!
[ 11-05-2024]
వైకాపా అధినేత, సీఎం జగన్ ఎన్నడూ లేని విధంగా కడపలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పదేపదే కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావించారు. ఓట్లు చీల్చేస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. -
మమ్మల్ని నమ్మడంలేదు... మీరైనా రండి!
[ 11-05-2024]
ప్రజల మనసును తెలుసుకున్న వైకాపా నేతలు వాలంటీర్ల వెంటపడుతున్నారు. జగనే మా నమ్మకం అంటూ నినదించిన ఆ పార్టీ నేతలు... ఇప్పుడు మీరే మా దిక్కంటూ వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
-
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్
-
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
-
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్