logo

నా అనుకున్న వాళ్లే మోసం చేశారు

అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన కుమార్తె సునీతారెడ్డి పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 05:44 IST

వివేకా కుమార్తె సునీత ఆవేదన

బలపనూరులో రోడ్‌షోలో పాల్గొన్న సునీత, తులసిరెడ్డి

సింహాద్రిపురం, న్యూస్‌టుడే : అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన కుమార్తె సునీతారెడ్డి పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం బలపనూరు, అంకాళమ్మగూడూరు, అగ్రహారం, హిమకుంట్ల, బి.చెర్లోపల్లి, గురిజాల గ్రామాల్లో శనివారం ఆమె బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానన్నారు. నా అనుకున్న వాళ్లే మమ్మల్ని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటానికి షర్మిల మద్దతుగా నిలిచారన్నారు. కాంగ్రెస్‌ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల, పులివెందుల అభ్యర్థిగా బరిలో నిలిచిన ధ్రువకుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. నేను మీ ఆడబిడ్డనే.. నాకు ప్రజాకోర్టులోనైనా న్యాయం లభించాలి, దేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థే మా నాన్నను ఎవరు హత్య చేశారో చెప్పారని, అలాంటి వారిని ఇప్పుడు పోటీలో పెట్టారని, వారికి ఓటేయొద్దని కోరారు. నేను షర్మిల చేస్తున్న పోరాటం ప్రజలంతా గమనించి మాకు న్యాయం చేయాలని కోరారు. రోడ్‌షోలో కాంగ్రెస్‌ పార్టీ మీడియా సెల్‌ ఛైర్మన్‌ తులసిరెడ్డి, నాయకులు శివప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని