ఎస్ఆర్బీసీ... తుంగలో తొక్కేసి..!
సీఎం జగన్ సొంత జిల్లాలో సాగునీటి పనులకు మోక్షం కలగడంలేదు. ప్రధానంగా నిధుల్లేక నిలిచిపోయిన ఎస్ఆర్బీసీ (శ్రీశైలం కుడికాలువ) పనులు ఏళ్లుగా పడకేశాయి.
ప్రభుత్వం నిధులివ్వక నిలిచిపోయిన పనులు
40 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం
మైలవరం మండలం గంగులనారాయణపల్లె వద్ద నిలిచిన శ్రీశైలం కుడి కాలువ పనులు
న్యూస్టుడే, జమ్మలమడుగు, పెద్దముడియం: సీఎం జగన్ సొంత జిల్లాలో సాగునీటి పనులకు మోక్షం కలగడంలేదు. ప్రధానంగా నిధుల్లేక నిలిచిపోయిన ఎస్ఆర్బీసీ (శ్రీశైలం కుడికాలువ) పనులు ఏళ్లుగా పడకేశాయి. శ్రీశైలం కుడిగట్టు కాలువ ద్వారా కృష్ణా జలాలను మైలవరం జలాశయంలోకి తీసుకురావాలన్న 16 ఏళ్ల కల కలగానే మిగిలిపోయింది. 141 నుంచి 199 కిలోమీటర్ల వరకు కాలువను నిర్మించి సుమారు 17,332 ఎకరాలకు నీరివ్వాలని రూపకల్పన చేశారు. మైలవరం జలాశయంలోకి వెయ్యి క్యూసెక్కుల నీటిని తరలించాలన్నది ప్రధాన లక్ష్యం. 2007, జనవరిలో 36, 37, 38వ ప్యాకేజీల్లో రూ.135.49 కోట్లతో గుత్తేదారులతో ఒప్పందం జరిగింది. 2009, జనవరిలోపు పూర్తిచేయాల్సి ఉంది. రూ.75 కోట్ల మేర పనులు జరిగిన అనంతరం కొన్ని కారణాలతో కాలువ నిర్మాణ పనులు ఆగిపోయాయి. కాలువ పూర్తయితే నంద్యాల జిల్లా అవుకు నుంచి మైలవరం జలాశయానికి నేరుగా నీటిని తరలించవచ్చు. గాలేరు-నగరి కాలువ ద్వారా గండికోట జలాశయంలోకి నీరు చేరితే అక్కడ్నుంచి మైలవరం జలాశయంలోకి నీటిని మళ్లించి నింపుతున్నారు. మూడు ప్యాకేజీల పనులు పూర్తయితే సుమారు 40 వేల ఎకరాలకు లబ్ధి జరిగే అవకాశం ఉంది.
- నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి మైలవరం జలాశయానికి నేరుగా కృష్ణా జలాలలను తీసుకొచ్చేందుకు 2006లో నిర్ణయం తీసుకున్నారు. కాలువ పనుల కోసం సర్వే సైతం చేపట్టారు. అంతకు మునుపే అవుకు నుంచి పేరుసోముల వరకు కాలువను నిర్మించారు. అక్కడి నుంచి మైలవరం జలాశయం వరకు దాదాపు 54 కి.మీ. దూరం ఉంది. 2007, జనవరి 5వ తేదీన పనులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం పనులను రెండేళ్లలో అంటే 2009, జనవరి నాటికి పూర్తిచేయాల్సి ఉంది. పనులు చేపట్టి సుమారు 16 ఏళ్లు కావస్తున్నా కాలువ పనులు మొండికేశాయి. భూసేకరణలో జాప్యం, పెరిగిన ధరలు తదితర కారణాలతో శ్రీశైలం కుడికాలువ పనులకు మోక్షం కలగడంలేదు.
- 36వ ప్యాకేజీలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పెద్దముడియం మండలం కొండసుంకేసుల వరకు 12.77 కి.మీ. ప్రధాన కాలువ, 40 కి.మీ. మేర దాని ఉప కాలువ పనులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.38.72 కోట్లు కేటాయించగా, రూ.16 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు 12.7 కి.మీ. మట్టి కాలువ పనులు చేశారు. సిమెంటు పూత పనులు కేవలం 2 కి.మీ. చేయగలిగారు. ప్యాకేజీ కింద 13,500 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది.
- 37వ ప్యాకేజీ కింద పెద్దముడియం మండలం దిగువ కల్వటాల నుంచి మైలవరం మండలం ఎ.కంబాలదిన్నె వరకు 16.357 కిలోమీటర్ల ప్రధాన, 20.45 కి.మీ. ఉప కాలువలు నిర్మించాల్సి ఉంది. ఇంత వరకు భూసేకరణ జరగలేదు. రూ.48.40 కోట్లు కేటాయించగా రూ.27 కోట్లు ఖర్చు చేశారు. దీని కింద 8,100 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది.
- 38వ ప్యాకేజీ కింద మైలవరం మండలం ఎ.కంబాలదిన్నె నుంచి మైలవరం జలాశయం వరకు 24.41 కి.మీ. ప్రధాన కాలువ, 15 కి.మీ. ఉపకాలువలు నిర్మించాల్సి ఉంది. భూసేకరణ జరగకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఒప్పందం ప్రకారం 21 జనవరి, 2009 నాటికి గడువు పూర్తి కావడంతో మరో ఏడాదిపాటు పొడిగించారు. గుత్తేదారులు చేతులెత్తేయడంతో పనులు ఆగిపోయాయి. 2011, ఫిబ్రవరి 14న ఇంజినీర్ల బృందం మైలవరం మండలం బెస్తవేములలో భూసేకరణ సర్వేలు నిర్వహించినా పురోగతి లేదు.
రైతుల గోడు పట్టించుకునేదెవరు? : ఎస్ఆర్బీసీ కాలువ పనులు పూర్తయితే కొండసుంకేసుల, దిగువ కల్వటాల, పాపాయపల్లె గ్రామాల్లో వేలాది ఎకరాలకు నీరందుతుంది. ఎన్నో ఏళ్లుగా కాలువ పనులు ఆగిపోయాయి. ఇంతవరకూ పట్టించుకున్న వారే లేకపోవడం బాధాకరం.
మేడగం వెంకటరామిరెడ్డి, రైతు, కొండసుంకేసుల, పెద్దముడియం
రూ.230 కోట్లతో ప్రతిపాదనలు : గతేడాది జూన్లో 36, 37, 38 ప్యాకేజీలకు రూ.230 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. రిమార్కులున్నాయని జలవనరులశాఖ అధికారులు వెనక్కి పంపారు.ఆ మేరకు సవరణలు చేసి త్వరలో పంపిస్తాం.
సుబ్బరాయుడు, ఈఈ, ఎస్ఆర్బీసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడితో జనం బలి... ఓటుతో వేటేస్తేనే దీపావళి
[ 12-05-2024]
జగనాసురుడి ఏలుబడి... ఎవరూ ఎప్పుడూ ఎక్కడా చూడని పెను విధ్వంసాన్ని స్పష్టించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజల జీవిత చక్రాన్ని వైకాపా ప్రభుత్వం ఛిద్రం చేసింది. -
అక్రమాల్లో బాద్షా
[ 12-05-2024]
‘ఎక్కడెక్కడి నేతలో లెక్కలేనన్ని అక్రమాలు చేస్తుంటే.. జగన్ సొంత జిల్లా, అందులోనూ జిల్లా కేంద్రం ప్రజాప్రతినిధిని.. పైపెచ్చు సీఎం తర్వాత సీఎం అంతటి హోదా కాబట్టి వారికంటే ఒక మెట్టు పైనే ఉండాలి’ అని అనుకున్నారో ఏమో.. కడపలో ఆయన చేయని దౌర్జన్యం లేదు. -
చేసింది శూన్యం... దోచింది అనంతరం
[ 12-05-2024]
మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం చేసింది శూన్యం కానీ దోచింది మాత్రం అనంతం... గుట్టను, మట్టిని, ఇసుకను అక్రమంగా తవ్వుకోవడంతో పాటు భూకబ్జాలు, దౌర్జన్యాలు, గంజాయి, ఎర్రచందనం అక్రమ రవాణా వంటి అక్రమాలతో అలజడులు సృష్టించారు. -
కాంగ్రెస్ సహకారంతోనే కడప ఉక్కు సాకారం
[ 12-05-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కడప ఉక్కు పరిశ్రమ వస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కడప నగరంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. -
తెదేపాలో చేరికలు... జోరుగా ప్రచారాలు
[ 12-05-2024]
భారీగా జరిగాయి. శనివారం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గ మండలాల్లో ఎన్డీఏ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేశారు. -
దొంగనోట్లు పంచి ప్రలోభాలకు గురి చేస్తున్నారు జాగ్రత్త : వరద
[ 12-05-2024]
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి మోసగాడని, ఎన్నికల్లో గెలిచేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు. స్థానిక తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
‘రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది’
[ 12-05-2024]
తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి ఆయన లాగే పాలిస్తారని అనుకున్నాం. -
వైకాపా ప్రభుత్వం మైనారిటీలకు ఏం చేసిందని ఓటేయాలి?
[ 12-05-2024]
వైకాపా ప్రభుత్వం మైనారిటీల కోసం ఏం చేసిందని ఆ పార్టీ నాయకులకు ఓటేయాలని తెదేపా పట్టణాధ్యక్షుడు జబీవుల్లా ప్రశ్నించారు. -
కోదండరాముడి అభిషేకం
[ 12-05-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేకం క్రతువును నయనానందకరంగా నిర్వహించారు. -
రాచమల్లు అరాచకాలపై వరద కరపత్రం విడుదల
[ 12-05-2024]
స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారంటూ తెదేపా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి శనివారం ‘ధుర్యోదన నీ చేష్టలు నీచాతినీచం’ పేరుతో కరపత్రం విడుదల చేశారు -
ఆదినారాయణరెడ్డి ప్రగతిపై కరపత్రం చక్కర్లు
[ 12-05-2024]
జమ్మలమడుగు ఓటరు మహాశయులకు విజ్ఞప్తి’ పేరిట ఒక కరపత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కాయ్ రాజా కాయ్.. గెలిచేది కూటమేనోయ్!
-
ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి
-
ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకున్న దాఖలాల్లేవు: సూర్యనారాయణ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన.. తలరాతలు మార్చుకునే తరుణమిదే
-
అరకులో కూటమికే మొగ్గు!.. ఈ పార్లమెంటు బరిలో వైకాపా ఎదురీత