తుది పోరుకు సై
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. సోమవారం నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ గడువు పూర్తి అయింది.
బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు
లోక్సభకు 21... అసెంబ్లీకి 113
మొత్తం 23 మంది ఉససంహరణ
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. సోమవారం నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ గడువు పూర్తి అయింది. అనంత లోక్సభ ఆర్ఓ/కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో సంబంధిత ఆర్ఓలు ఎక్కడికక్కడ బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దీంతో తుది పోరుకు తెర లేచింది. ఆర్ఓల వెల్లడించిన జాబితా ప్రకారం.. అనంత లోక్సభకు 21 మంది బరిలో ఉన్నారు. ఒక్కరూ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. లోక్సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో తెదేపా నుంచి అంబికా లక్ష్మినారాయణ, వైకాపా తరఫున మాలగుండ్ల శంకరనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థిగా వజ్జల మల్లికార్జునతోపాటు.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపితే మొత్తం 21 మంది పోటీలో నిలిచారు. వీరందరికి ఆర్ఓ/కలెక్టర్ వినోద్కుమార్ ఎన్నికల గుర్తులు కూడా కేటాయించారు. తుది జాబితా ఖరారు కావడంతో ప్రచార హోరు కొనసాగనుంది. మే 11వ తేదీ దాకా ఎన్నికల ప్రచారం ఉంటుంది. 13న పోలింగ్ జరగనుంది.
తాడిపత్రిలో 18, ఉరవకొండలో 11
జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 113 మంది పోటీలో ఉన్నారు. ఉరవకొండలో మినహా తక్కిన ఏడు చోట్లా 23 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. తుది పోరులో 113 మంది నిలబడ్డారు. తాడిపత్రిలోనే ఎక్కువగా 18 మంది బరిలో ఉండటం విశేషం. తక్కువగా ఉరవకొండలో పదకొండు మంది ఉన్నారు. అనంత అర్బన్, కళ్యాణదుర్గంలో 15 మంది చొప్పన, శింగనమల, గుంతకల్లులో 14 మంది, రాయదుర్గం, రాప్తాడులో 13 మంది చొప్పున పోటీలో నిలిచారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఏకంగా 8 మంది నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అనంత అర్బన్లో ఆరుగురు, గుంతకల్లులో ముగ్గురు, శింగనమల, రాప్తాడులో ఇద్దరు ప్రకారం, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో ఒక్కొక్కరు తమ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించారు.
ఆ రెండు చోట్లా.. రెండేసి ఈవీఎంలు
అభ్యర్థుల జాబితా ఖరారు కావడంతో ఎన్నికల గుర్తుల కేటాయింపు కూడా పూర్తి చేశారు. ఒక్కో ఈవీఎంలో గరిష్ఠంగా 16 మంది పేర్లు, గుర్తులు మాత్రమే కేటాయించడానికి అవకాశం ఉంది. ఇందులో 15 మంది అభ్యర్థులు, ఒక నోటా గుర్తు ఉంటాయి. ఇంత కంటే ఎక్కువ మంది ఉంటే రెండో ఈవీఎం తప్పనిసరిగా ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో అనంత లోక్సభ, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండేసి ఈవీఎంలు ఉంటాయి. ఎందుకంటే.. అనంత లోక్సభ బరిలో 21 మంది, తాడిపత్రి పోటీలో 18 మంది చొప్పున ఉన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బూత్లో లోక్సభ ఈవీఎంలు రెండు, అసెంబ్లీ స్థానానికి ఒకటి ఉంటాయి. తాడిపత్రి పరిధిలో లోక్సభకు సంబంధించి రెండు, అసెంబ్లీ స్థానానికి మరో రెండు... ఇలా ఒక్క తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో ప్రతి పోలింగు కేంద్రంలో నాలుగు ఈవీఎంలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకరేపుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
[ 01-06-2024]
సార్వత్రిక ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన, ఉత్కంఠకు తెర లేచింది. గెలుపోటములపై లెక్కలు వేసుకోవడంలో తలమునకలయ్యారు. -
నిఘా నీడలో తాడిపత్రి
[ 01-06-2024]
తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కౌంటింగ్ వేళ.. భద్రత కట్టుదిట్టం
[ 01-06-2024]
కౌంటింగ్ ప్రశాంతంగా సజావుగా జరిగేలా కట్టుదిట్ట భద్రతా చర్యలు చేపట్టామని నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. -
మళ్లీ పింఛను ఇబ్బందులు తప్పవా?
[ 01-06-2024]
పింఛన్ లబ్ధిదారులకు జూన్లోనూ కష్టాలు తప్పేలా లేవు. రెండు రోజుల నుంచి ఎండలు తీవ్రం అయ్యాయి. -
వచ్చేది మా పార్టీయే.. తెదేపా కార్యకర్తలను చంపుతా
[ 01-06-2024]
మళ్లీ వచ్చేది మా పార్టీనే.. తెదేపా కార్యకర్తలను చంపుతా అంటూ ఓ వైకాపా కార్యకర్త మద్యం మత్తులో వేటకొడవలితో వీరంగం సృష్టించాడు. -
కబ్జాలు కనిపించవా..?
[ 01-06-2024]
మున్సిపల్ స్థలాల ఆక్రమణపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు. -
4 మార్కులు లెక్కించడం మరిచారు!
[ 01-06-2024]
పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో పొరపాట్లు చోటు చేసుకొన్నాయి. అనంతపురం నగరానికి చెందిన విద్యార్థిని షేక్. -
దళిత మహిళ భూమి వైకాపా నాయకుడి పేరున మార్పు
[ 01-06-2024]
మండలంలోని పందిపర్తికి చెందిన పేద దళిత మహిళ గంగరత్న పేరుతో ఉన్న 3.81 ఎకరాల అసైన్డ్ భూమిని వైకాపా నాయకుడు సజ్జారెడ్డి పేరున ఎలా రికార్డులు మార్చారని తహసీల్దార్ అంజనాదేవిని దళిత నాయకులు నిలదీశారు. -
నిక్కచ్చిగా పనిచేస్తే ముచ్చెమటలెందుకు?
[ 01-06-2024]
ఐదేళ్లపాటు పోలీసులను, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి.. ఇప్పుడు పోలీసులు, ఎన్నికల కమిషన్ నిక్కచ్చిగా, నిజాయితీగా పని చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. -
ఎరవేసి.. హతమార్చారు
[ 01-06-2024]
ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి, న్యాయవాది సంపత్కుమార్ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. -
తొలి ఫలితం.. పుట్టపర్తి, మడకశిర
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో హిందూపురం పార్లమెంటు స్థానంతో పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు లెక్కించనున్నారు. -
కుళాయిల్లో గరళం!
[ 01-06-2024]
జీవకోటికి జలమే ప్రాణాధారం. పట్టణాల్లో తాగునీటి సరఫరా నిర్వహణలో మున్సిపల్ యంత్రాంగంలో నిర్లక్ష్యం ఆవహించింది. జిల్లాలోని కదిరి, పుట్టపర్తి, ధర్మవరం పట్టణాలకు చిత్రావతి రిజర్వాయరు నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. -
రైతు ఆత్మహత్యల పాపం జగన్ సర్కారుదే
[ 01-06-2024]
రాష్ట్రలో రైతన్నల ఆత్మహత్యల పాపం జగన్ సర్కారుదేనని ధర్మవరం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.