డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అనంత అభివృద్ధి
వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని కేంద్ర మంత్రి అమిత్షా, తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అనంతపురం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు.
హంద్రీనీవాతోపాటు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
కేంద్రమంత్రి అమిత్షా, చంద్రబాబు హామీ
కేంద్రమంత్రి అమిత్షాకు జ్ఞాపిక అందజేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అనంతపురం: వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని కేంద్ర మంత్రి అమిత్షా, తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అనంతపురం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. హంద్రీనీవాతోపాటు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. జగన్ను ఇంటికి పంపి మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే తెదేపా, జనసేన, భాజపా పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం జరిగిన ఎన్డీయే కూటమి సభలో అమిత్షా, చంద్రబాబు కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత సాయంత్రం అనంతపురం నగరంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. అనంతపురం జిల్లా తన మనసుకు దగ్గరగా ఉంటుందన్నారు. జిల్లాకు ఎప్పుడు వచ్చినా ప్రజాస్పందన బ్రహ్మండంగా ఉంటుందన్నారు. మిమ్మల్ని చూసి ఎండలు భయపడుతున్నాయన్నారు.
హిందూపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి బీకే పార్థసారథి, ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్తో కలిసి అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి అమిత్షా, చంద్రబాబు, పరిటాల సునీత, మధుసూదన్రెడ్డి, పరిటాల శ్రీరామ్, భాజపా, జనసేన నాయకులు
జగన్ అంటేనే దోపిడీ
ధర్మవరం సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘‘జగన్ ఈ మధ్య క్లాస్వార్ అంటున్నారు. అయితే అది క్లాస్వార్ కాదు క్యాష్వార్. దేశంలో ఎప్పుడూ చూడని విధంగా లిక్కర్స్యామ్ చేస్తున్నాడు. రూ.70 ఉన్న క్వార్టర్ బాటిల్ ధర రూ.200 పెంచి నాశనం చేస్తున్నాడు. జె బ్రాండ్లు తీసుకొచ్చి ప్రాణాలు తీస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను ఇష్టారీతిన దోచేశాడు. తెదేపా అధికారంలోకొస్తే మీ ఊర్లో ఇసుకు మీరే ఉచితంగా తీసుకునేలా చేస్తాం.
అనంత సభలో మాట్లాడుతున్న చంద్రబాబు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుపాటి ప్రసాద్
హార్టికల్చర్ హబ్గా చేస్తాం
‘‘జగన్ ప్రభుత్వంలో రైతులకు అసలు డ్రిప్ పరికరాలు ఇవ్వడం లేదు. గతంలో 90 శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహించాం. తెదేపా మళ్లీ అధికారంలోకి రాగానే పథకాన్ని పునఃప్రారంభిస్తాం. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి జిల్లాను హార్టికల్చర్ హబ్గా మార్చే బాధ్యత తీసుకుంటాం. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు ఎయిర్కార్గో ద్వారా పంటలను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించేలా చేస్తాం.’ అని చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చారు.
కేతిరెడ్డికి గుడ్నైట్ చెప్పాలి
ధర్మవరంలో కేటురెడ్డి ఉన్నాడు. గుడ్మార్నింగ్ రెడ్డికి ఇప్పుడు శాశ్వతంగా గుడ్నైట్ చెప్పాలి. ఎర్రగుట్టను దోచేశాడా లేదా? ముదిగుబ్బలో ఉప్పలపాడు ఇసుక రీచ్లో ఇసుక తవ్వి బెంగళూరుకు తరలించిన దుర్మార్గుడు కేతిరెడ్డి అన్నారు.
పరిటాల శ్రీరామ్ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా..
పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గాన్ని భాజపాకు కేటాయించాం. ధర్మవరం తెదేపా ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ అందరి కోసం పనిచేస్తున్నారు. సత్యకుమార్ కోసం పెద్ద మనసుతో త్యాగం చేశారని పేర్కొన్నారు. శ్రీరామ్ త్యాగాన్ని పార్టీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుదన్నారు. ప్రభుత్వం రాగానే తగిన గుర్తింపు ఇస్తామన్నారు. శ్రీరామ్ను రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ధర్మవరం సభకు హాజరైన తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుచిగా వండాలంటే.. శుచి, శుభ్రతకు చోటేది?
[ 02-06-2024]
మధ్యాహ్న భోజనం నాణ్యమైన రుచులతో వడ్డించాలని ఆర్భాటం చేసిన అధికారులు వండటానికి శుచి, శుభ్రతతో కూడిన చోటు కల్పించడంలో విఫలమవుతున్నారు. సదుపాయమే లేనిచోట రుచికరమైన వంటలెలా తయారవుతాయోనన్న ఆలోచనను విస్మరించారు. -
కూటమి వైపే ఓటర్లు!
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని తెదేపా నాయకులు స్పష్టం చేస్తున్నారు. -
ఆగని కబ్జా పర్వం.. కుంటలు మాయం
[ 02-06-2024]
గుత్తి శివారులోని చాకలి కుంటలో కొంత భాగాన్ని వైకాపా నాయకులు ఆక్రమించారు. బంకులు ఏర్పాటు చేసి కబ్జా చేశారు. ఈవిషయం అధికారులకు తెలిసి బంకులను పక్కకు తోసేశారు. -
తొలుత సిఫార్సులతో నియామకం.. తర్వాత కాంట్రాక్టు హోదా
[ 02-06-2024]
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన ఉద్యోగాల నియామకం వివాదాస్పదంగా మారింది. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు, సహాయార్యుల కొరత కారణంగా టీచింగ్ అసిస్టెంట్లు, అతిథి, తాత్కాలిక అధ్యాపకులను నియమించుకుంటున్నారు. -
జిల్లా అంతటా నిఘా
[ 02-06-2024]
‘ఈనెల 4న ఓట్ల లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతుంది. జిల్లాంతటా ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా పూర్తి స్థాయి నిఘా ఉంచాం. జిల్లా వ్యాప్తంగా 315 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించాం. ప్రత్యేక నిఘా ఉంటుంది’ అని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, ఎస్పీ గౌతమిశాలి స్పష్టం చేశారు. -
కొందరికే పింఛను సొమ్ములు
[ 02-06-2024]
బ్యాంకులకు వెళ్లి పింఛను తీసుకోవాలని చెప్పడంతో ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. శనివారం కావడంతో మధ్యాహ్నం వరకే బ్యాంకులు ఉంటాయని ఉదయం 9 గంటలకే బ్యాంకులకు చేరుకున్నారు. సొమ్ము పడలేదని సచివాలయంలోకి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించడంతో మళ్లీ అక్కడకు పరుగులు తీశారు. -
పేదలకు బియ్యంతో సరి
[ 02-06-2024]
పౌర సరఫరాల ద్వారా నిరుపేదలకు అందిస్తున్న నిత్యావసరాల పంపిణీలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతినెలా రేషన్ సరకుల్లో కోత విధిస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు అరకొరగా పంపిణీ చేసే కందిపప్పు, గోధుమ, రాగిపిండిని పూర్తిగా నిలిపివేసింది. -
దిక్కూ మొక్కూ లేని స్థితిలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు
[ 02-06-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు దిక్కుమొక్కులేని స్థితిలో కునారిల్లిపోయాయి. పనులు లేవు, నిధుల మంజూరు లేదు, అభివృద్ధి లేదు అన్నది సుస్పష్టం. ధర్మవరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి (ఏఎంసీ) పాలకవర్గ నియామకం ఊసే మరిచిపోయారు. -
భద్రతా వలయంలో జేఎన్టీయూ
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నగరంలో పోలీసు వర్గాలు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా చర్యలను పూర్తిచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
-
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
-
అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి
-
రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
-
జగమొండి ప్రజ్వల్.. విచారణకు సహకరించడం లేదన్న సిట్