అధర్మకర్తల మండలి
జగనన్న పాలనలో పాలకవర్గాల(ధర్మకర్తల మండలి) సభ్యులు దేవస్థానం శ్రేయస్సు, భక్తుల సౌకర్యాలు కల్పించేలా పనిచేసింది అంతంతమాత్రమే. ఆలయ పాలకవర్గాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి.
వైకాపా పాలనలో ఆలయాల్లో ఇదీ పరిస్థితి
పునరావాస కేంద్రాలుగా ఆలయ పాలకవర్గాలు
న్యూస్టుడే, అన్నవరం
ధర్మకర్తగా నా విద్యుక్త ధర్మాన్ని యోగ్యంగా.. నమ్మకంగా.. శక్తివంచన లేకుండా న్యాయదృష్టితో.. జ్ఞాన విధేయంగా.. భయాభిమాన, రాగద్వేష రహితంగా.. దేవస్థానం శ్రేయస్సు దృష్ట్యా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నా..
దేవాలయాల పాలక మండలి సభ్యులు ప్రమాణం స్వీకారం సమయంలో చెప్పే మాటలివి.
జగనన్న పాలనలో పాలకవర్గాల(ధర్మకర్తల మండలి) సభ్యులు దేవస్థానం శ్రేయస్సు, భక్తుల సౌకర్యాలు కల్పించేలా పనిచేసింది అంతంతమాత్రమే. ఆలయ పాలకవర్గాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. సభ్యులకు తోడు ప్రత్యేక ఆహ్వానితులంటూ నచ్చినవారిని నియమించడమే ఇందుకు నిదర్శనం.
తెదేపా హయాంలో..: పాలక వర్గాల నియామకానికి ముందుగా ప్రకటన విడుదల చేసేవారు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి సహాయ కమిషనర్ కార్యాలయం ద్వారా పోలీస్ శాఖ నుంచి దరఖాస్తుదారుల వివరాలు తెలుసుకునేవారు. ఆ తర్వాత సభ్యుల నియామకానికి ఉత్తర్వులు వచ్చేవి. 2017 మేలో అన్నవరం దేవస్థానానికి 16 మంది సభ్యులను నియమించారు. దీనికి గానూ 100 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
వైకాపా వచ్చాక..: ప్రభుత్వమే నేరుగా పాలకవర్గాలను నియమించేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ప్రకటన లేకుండా.. సభ్యుల గత చరిత్ర పరిశీలించకుండా 2020, 2023 అన్నవరం ఆలయానికి పాలక వర్గాలను నియమించారు. గత ఏడాది హడావుడిగా ఒక్కరోజులోనే ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు దేవాదాయశాఖ మంత్రి అనుయాయులైన ఇద్దరిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.
నిధులనూ రాబట్టలేకపోయారు: కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్ ద్వారా దేవస్థానానికి నిధులు తీసుకురావడంలో ధర్మకర్తల పాత్ర శూన్యం. పలు అభివృద్ధి పనులకు రూ.54.62 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏళ్లతరబడి కదలిక కనిపించడం లేదు. ఇటీవల రూ.20 కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది.
వచ్చామా.. వెళ్లామా: గత అయిదేళ్లలో రెండు పాలక వర్గాల తీరు వచ్చామా.. వెళ్లామా అన్నట్లుంది. అన్నవరంలో అభివృద్ధి పనుల పేరిట కొండపై విధ్వంసం చేసి రూ.కోట్లు వృథా చేసినా చూసీచూడనట్లు వ్యవహరించారు. తెదేపా హయాంలో ధర్మకర్తల మండలి సభ్యులు పలు పనులపై అభ్యంతరం వ్యక్తం చేసి సొమ్ము వృథాకానివ్వలేదు.
స్వప్రయోజనాలకే..: ‘మా వాళ్లు వస్తే వసతి గది ఇమ్మంటే మన వాళ్లు ఇవ్వలేదు. దర్శనానికి పంపలేదు.. మాకు గౌరవం ఇవ్వలేదు.’ ఇలాంటి అంశాలను మాత్రం ప్రస్తావించేవారే ఎక్కువ. ప్రస్తుత ధర్మకర్తల మండలిలో సభ్యుడొకరు బదిలీపై వెళ్లిన గత అధికారి హయాంలో అంతా తానై వ్యవహరించారు.
దాతలు: పాలకవర్గ సభ్యుల్లో ఇద్దరు దాతలకు తెదేపా హయాంలో ప్రాధాన్యమిచ్చేవారు. 2017 ఇలా నియమించినవారిలో ఇద్దరు పారిశ్రామిక వేత్తలు భక్తులకు సౌకర్యాలు కల్పించేలా, ఆలయాభివృద్ధికి వీరు రూ.కోట్లు ఖర్చుచేశారు. వైకాపా హయాంలో నియమించిన సభ్యుల్లో ఇటువంటి వారికి ప్రాధాన్యమివ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏజెంట్ 004
[ 02-06-2024]
సజ్జల వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కేసూ నమోదయ్యింది. ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తంచేస్తున్నాయి. -
నలుచెరుగులా బలగాలు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 48 గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూం, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో సుమారు 1,100 మంది కేంద్ర, రాష్ట్ర బలగాలతో బందోబస్తు ఉంటుంది. -
కూటమి ఖుషీ
[ 02-06-2024]
తెదేపా- జనసేన- భాజపా కూటమిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో ఫలితాలు అనుకూలంగా రావడంతో తమ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమనే ధీమా కనిపిస్తోంది. -
ఓట్ల లెక్కింపునకు 17 కేంద్రాలు
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి నన్నయ విశ్వవిద్యాలయంలో మొత్తం 17 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్ చెప్పారు. కలెక్టరేట్లో శనివారం విలేకరుల సమావేశంలో కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. -
ఎన్డీఏ కూటమిదే విజయం: సీఎం రమేష్
[ 02-06-2024]
కేంద్రంలోను, రాష్ట్రంలోను ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, భాజపాకు చెందిన సి.ఎం.రమేష్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి శనివారం రాత్రి విమానంలో వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బ్యాంకుల్లో 47.82 శాతమే పింఛను సొమ్ము ఉపసంహరణ
[ 02-06-2024]
సామాజిక భద్రత పింఛను డబ్బులు బ్యాంకుల ద్వారా తీసుకునేందుకు ఈ నెల కూడా జిల్లాలోని లబ్ధిదారులు ఇబ్బందులు పడక తప్పలేదు. కొన్నిచోట్ల బ్యాంకుల్లో పింఛను నగదు కోసం గంటల తరబడి వరసలో నిరీక్షించాల్సి వచ్చింది. -
ఆగండి.. ఎలా వెళ్లాలో గమనించండి
[ 02-06-2024]
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ (కౌంటింగ్) జర¢గనుండటంతో ఆ రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి అటుగా వెళ్లే భారీ వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకుంటున్నారు. -
4జీ సేవలు మరింత విస్తృతం
[ 02-06-2024]
4జీ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజరు ఎం.శేషాచలం చెప్పారు. ఈ మేరకు శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
ఈదురు గాలుల బీభత్సం
[ 02-06-2024]
కాకినాడ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో జనం బెంబేలెత్తారు. శనివారం వేకువజామున 4 గంటల నుంచి జిల్లాలోని 14 మండలాలను ఒక్కసారిగా ఈదురుగాలులు చుట్టుముట్టాయి. -
పూడికతీత.. పనుల్లో రోత..!
[ 02-06-2024]
‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా మారింది గోదావరి కాలువలో పూడికతీత పనుల పరిస్థితి. అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నా, పనులకు పక్కాగా అనుమతులు లభించినా పారదర్శకంగా నిర్ణీత గడువులోపు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం నెలకొంది. -
సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమదే మొదటి స్థానం
[ 02-06-2024]
ఏలూరు రేంజ్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమ ప్రథమ స్థానంలో ఉందని ఎస్ఈబీ ఐజీ, జిల్లా లెక్కింపు ప్రత్యేకాధికారి ఎం.రవిప్రకాష్ తెలిపారు. శనివారం ఆయన అమలాపురంలో మాట్లాడారు. -
సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గ్రూపులు..
[ 02-06-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఆవశ్యకత, ఓటు విలువను గుర్తించిన యువత పెద్దఎత్తున ఓట్ల పండగలో పాల్గొని.. తమకు నచ్చినవారికి ఓటు వేశారు. జిల్లాలో పోలింగ్ శాతం కూడా భారీగానే నమోదైంది.