విలీనం చేసి.. జగన్ నిలువునా ముంచి
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది. అవసరమైన సదుపాయాలు సమకూరుతాయి.
ప్రయోజనాలు కోల్పోయిన ఆర్టీసీ ఉద్యోగులు
బకాయిల చెల్లింపులోనూ నిర్లక్ష్యం
కర్నూలులో ఆందోళన చేస్తున్న కార్మికులు (పాత చిత్రం)
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది. అవసరమైన సదుపాయాలు సమకూరుతాయి.
ముఖ్యమంత్రి చెప్పిన మాటలు..
కర్నూలు బి.క్యాంపు, న్యూస్టుడే : ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. విలీనానికి ముందు కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు ఉండేవి. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారమయ్యేవి. విలీనం తర్వాత ఆర్థిక ప్రయోజనాలు ఆగిపోయాయి. జీతాలు సైతం సరిగా రాని పరిస్థితి ఏర్పడింది. చివరికి బకాయిల కోసం కార్మికులు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోయామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 బస్సు డిపోలు ఉన్నాయి. 975 బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రతిరోజూ సుమారు 3 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగిస్తుంటారు. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం విలీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. మేలు జరుగుతుందని భావించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత ఉద్యోగులు, కార్మికులకు కష్టాలు తెలిసొచ్చాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేసినా ప్రయోజనం లేకపోయింది.
25 శాతం ఇచ్చి..
ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం వేతన సవరణ చేపట్టింది. ఇప్పటివరకు బకాయిలు పూర్తి చెల్లించకపోవడం గమనార్హం. ఒకేసారి చెల్లించలేమని.. నాలుగు విడతల్లో ఇస్తామని పేర్కొంది. మొదటి విడతతో 25 శాతం చెల్లింపులు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో సుమారు 3,500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా కేవలం రూ.కోటి మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ఇంకనూ రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు రావాల్సి ఉందని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడుతున్నారు.
- కర్నూలు-1, కర్నూలు-2 నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్, కోవెలకుంట్ల, బనగానపల్లి, ఆళ్లగడ్డ, ఆత్మకూరు తదితర డిపోలకు చెందిన కార్మికులకు లీవ్ ఎన్క్యాష్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారు.
భత్యాలు కనుమరుగు
2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు పలు ప్రతిపాదనలు పెట్టింది. విలీనమైతే ఎన్నో ప్రయోజనాలు వస్తాయని ఆశలు రేకెత్తించింది. ఇందులో భాగంగా 2020 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రజారవాణా సంస్థగా మార్చి విలీనం చేసుకుంది. అప్పటినుంచి కార్మికులకు కష్టాలు అధికమయ్యాయి. ప్రభుత్వంలో విలీనం కాకముందు గ్యారేజీ ఉద్యోగులకు రాత్రి భత్యం, డీజిల్ పొదుపు చేసే కార్మికులకు ప్రతి నెలా ప్రోత్సాహకాలను అందరి సమక్షంలో అందించేవారు. అదనపు విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు అదనపు జీతం, గ్యారేజీలో పనిచేసేవారికి ప్రత్యేక అలవెన్స్, సాంకేతిక వేతనం, మహిళా కండక్టర్ల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక నిధులు మంజూరయ్యేవి. ప్రస్తుతం ఇవేమీ వర్తించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- గతంలో ప్రతి రెండేళ్లకోసారి కండక్టర్లు, డ్రైవర్లకు మూడు జతల ఖాకీ దుస్తులు ఇచ్చేవారు. దీంతోపాటు పాదరక్షల కోసం సంస్థ రూ.వెయ్యి ఇచ్చేది. విలీనం తర్వాత గ్యారేజీ కార్మికులు, ఉద్యోగులు తమ సొంత డబ్బులతో బూట్లు, ఖాకీ దుస్తులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.
- బస్సులు దూర ప్రాంతాలకు వెళ్లి మధ్యలో ఆగిపోతే వాటికి మరమ్మతులు చేయించేందుకు.. గ్యారేజీ నుంచి బస్సు మొరాయించిన ప్రదేశానికి వెళ్లేందుకు మెకానిక్లకు డబ్బులు ఇచ్చేవారు. వారి సమయానికంటే ఎక్కువగా పనిచేస్తే ఓటీ వచ్చేది. ప్రస్తుతం ఇవేమీ మంజూరు కావడం లేదు.
కేసుల పరిష్కారమెప్పుడో..
ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వందల సంఖ్యలో కేసులు పెండింగ్ ఉన్నాయి. విధి నిర్వహణలో లోపాలు ఉన్న సమయంలో అధికారులు కేసులు నమోదు చేసేవారు. విలీనం కాకముందే డిపోలో ఉండే కార్మికుల కేసులు డిపో మేనేజర్స్థాయిలో పరిష్కారం అయ్యేవి. అక్కడ పరిష్కారంకాకుంటే డిప్యూటీ చీప్ మెకానికల్ ఇంజినీరు/డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్స్థాయిలో పరిష్కరించేవారు. రీజినల్ మేనేజర్దే తుది నిర్ణయం. 2020 తర్వాత పరిస్థితి దయనీయంగా మారింది. ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియని పరిస్థితి.
ఆరోగ్య సేవలు అంతంతే..
ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వైద్యసేవలు అందించేందుకుగాను ఆర్టీసీ డిస్పెన్సరీ ఏర్పాటుచేశారు. ఇక్కడ అవసరమైనవారికి వైద్యసేవలు అందిస్తారు. ఆరోగ్య పరిస్థితులను బట్టి అక్కడ వైద్యుల సిఫారసు మేరకు కార్పొరేట్ ఆసుపత్రిలో చేరితే వైద్యానికయ్యే ఖర్చు మొత్త ఆర్టీసీ సంస్థ భరించేది. ఉద్యోగి తమ గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోయేది. విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో కష్టాలు ఎదురయ్యాయి. ఏటా ప్రభుత్వానికి రూ.1,200 చెల్లించినా పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్వజన.. నిత్యం అవస్థేనా..
[ 01-06-2024]
సర్వజన ఆసుపత్రిలోని వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని రూ.కోట్లు వెచ్చించి నిర్మించారు. మౌలిక వసతులు కల్పించడంలో విఫమయ్యారు. -
నమ్మితే.. నట్టేట మునిగినట్లే
[ 01-06-2024]
:సామాజిక మాధ్యమాల్లో సైబర్ నేరగాడి ప్రకటన ఆదోని నేరవిభాగం ూసి ఆదోనికి చెందిన రాముడు రూ.5 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. -
అక్కాచెల్లెళ్లు..అందెల రవళులు
[ 01-06-2024]
తోడుగా పుట్టారు.. జోడీగా కూచిపూడి నేర్చుకుంటున్నారు. పదెళ్ల వయసులో నృత్యంపై పట్టుసాధించారు. ఆ చిన్నారులు ప్రదర్శనలిస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు -
ఎన్నికల ఫలితాలు త్వరితగతిన మీడియాకు అందిస్తాం: కలెక్టర్
[ 01-06-2024]
జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున రాయలసీమ యూనివర్సిటీలో మీడియా, కమ్యూనికేషన్ సెంటర్ల ద్వారా త్వరితగతిన ఫలితాలను మీడియాకు అందిస్తామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. -
మట్టిపై కన్ను.. అధికారం దన్ను
[ 01-06-2024]
నియోజకవర్గ పరిధిలోని అటవీ, ప్రభుత్వ భూముల్లో ఇప్పటివరకు మట్టిని తవ్వి సొమ్ము చేసుకున్న అక్రమార్కులు ప్రస్తుతం చెరువులపై కన్నేశారు. -
అర్ధరాత్రి మృత్యుఘోష
[ 01-06-2024]
అర్ధరాత్రి.. అంతా నిద్రలోకి జారుకున్నారు. ఒక్కసారిగా వాహనం కుదుపునకు గురైంది.. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.. తేరుకునే సరికి రక్తపు మడుగులో పడున్నారు. -
నిర్వహణ.. దిగువకే
[ 01-06-2024]
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి కర్నూలు జిల్లాలోకి దిగువ కాలువ ప్రవహిస్తుంది. -
మండుటెండలో.. పండుటాకులు
[ 01-06-2024]
సామాజిక భద్రత పింఛనుదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. వారిని గత రెండు నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. -
గడువు ముగిసింది.. ఆందోళన మిగిలింది
[ 01-06-2024]
కర్నూలు నగర పరిధిలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు నగరపాలక సంస్థ గతేడాది తాత్కాలిక ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికులను నియమించుకుంది. -
గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి
[ 01-06-2024]
కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఏజెంటు ను తనిఖీ చేసి అనుమతించాలని, ఆర్వోలు జారీ చేసిన గుర్తింపు కార్డు ఉంటేనే లోపలకు పంపాలని కర్నూలు రేంజి డీఐజీ విజయరావు ఆదేశించారు. -
ఏటి ఒడ్డున భూచోళ్లు
[ 01-06-2024]
నగరంలో హంద్రీ ఒడ్డున 12వ వార్డు పరిధిలోని కేవీఆర్ గార్డెన్లో అనధికారిక భవన నిర్మాణం చేపట్టారు. స్థానికుల నుంచి నగరపాలక అధికారులకు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోవడం లేదు.