అటకెక్కిన నిబంధనలు.. అధికంగా వసూళ్లు!
ఇలా చాలా వరకు కేంద్రాల్లో ప్రతి దరఖాస్తు వెంట ఎక్కువ మొత్తంలో దోచుకోవడం సాధారణమైపోయింది. రవాణా కార్యాలయంలో పొందే అన్ని రకాల సేవలకు సంబంధించి వీటిల్లో అదనంగా వసూలు
మీ-సేవా కేంద్రాల్లో నిర్వాహకుల ఇష్టారాజ్యం
న్యూస్టుడే, వికారాబాద్
* వికారాబాద్ మండలం పుల్మద్దికి చెందిన ఓ రైతు బ్యాంకు రుణం కోసం అవసరమైన భూమి తాలూకూ సర్టిఫైడ్ పత్రాలకు మీ సేవలో నిర్ణీత రుసుం రూ.535 చెల్లించి ఉదయం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం తరువాత తీసుకెళ్లాలని చరవాణికి సంక్షిప్త సందేశం వచ్చింది. అదనంగా మరో రూ.వంద తీసుకుని పత్రాలు ఇచ్చారు.
* ఇటీవల ధారూర్కు చెందిన ఓ యువకుడు విద్యుత్తు మీటరు మార్పునకు వికారాబాద్లోని మీ- సేవ కేంద్రంలో అర్జీ సమర్పించారు. నిర్ణీత రుసుం రూ.170 చెల్లించాల్సి ఉండగా, అదనంగా రూ.50 కలిపి రూ.220 వసూలు చేశారు. అదేమని ప్రశ్నిస్తే అందరికీ ఇలాగే తీసుకుంటున్నామని బదులిచ్చారు.
ఇలా చాలా వరకు కేంద్రాల్లో ప్రతి దరఖాస్తు వెంట ఎక్కువ మొత్తంలో దోచుకోవడం సాధారణమైపోయింది. రవాణా కార్యాలయంలో పొందే అన్ని రకాల సేవలకు సంబంధించి వీటిల్లో అదనంగా వసూలు చేస్తున్నారు. సిటిజన్ ఛార్ట్ ప్రకారం ప్రతి సేవకు రుసుం ఉంటుంది. ఆ ప్రకారమే తీసుకోవాల్సి ఉండగా, అధికంగా రూ.20 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నారు. అడిగేవారు లేరని ఇదే అదునుగా నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 74 మీ- సేవ కేంద్రాలున్నాయి. వీటిలో ప్రతిరోజు 5 వేల నుంచి 6 వేల మంది వరకు అన్ని రకాలకు సంబంధించిన అర్జీలు సమర్పిస్తారు. అధికంగా ఆదాయం, కులం, జనన, మరణ, పహాణీ తదితర ధ్రువపత్రాలతో పాటు వివిధ రకాల బిల్లుల చెల్లింపునకు సంబంధించి కార్యకలాపాలు జరుగుతుంటాయి. అయితే ప్రతి పనికి సంబంధించిన నిర్ణీత రుసుం వసూలు చేయాల్సి ఉంటుంది. అంతకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయవద్ధు అయితే కొందరు నిర్వాహకులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉదాహరణకు ఆధార్కు రూ.35 చెల్లిస్తే సరిపోతుంది. నిర్వాహకులు మాత్రం రూ.50 నుంచి రూ.100 వరకు తీసుకుంటున్నారు. ఇలా కులం, ఆదాయం, జనన, మరణ ధ్రువపత్రాలన్నింటికీ అధికంగా వసూలు చేస్తున్నారు.
పట్టణాల్లోనే..: ఎక్కడో మారుమూల ప్రాంతంలో అధికంగా వసూళ్లకు పాల్పడటం కాదు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ వంటి పట్టణాల్లో నిర్వాహకులు ఇష్టానుసారం తీసుకుంటున్నారు. అధికంగా తీసుకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా వినియోగదారులకు తెలియదు. అందుకే ప్రతి కేంద్రంలో ఏ సేవకు ఎంతెంత రుసుం చెల్లించాలన్నది పేర్కొంటూ పట్టికను అందరికీ కనిపించేటట్లుగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే ఫిర్యాదు చేయాల్సిన అధికారి చిరునామాతో కూడిన చరవాణి సంఖ్యను కూడా పట్టికలో పొందుపరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
ఫిర్యాదు చేయండిలా..
* మీ- సేవ కేంద్రాల్లో అధిక వసూళ్లకు పాల్పడితే జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్ఛు తాము పొందిన సేవకు సంబంధించిన ఫారంతో పాటు పూర్తి వివరాలు జతచేస్తే చర్యలు తీసుకుంటారు.
* మండల స్థాయిలో తహసీల్దార్కు ఫిర్యాదు చేయవచ్ఛు పక్కా ఆధారాలు సమర్పిస్తే సంబంధిత కేంద్రంపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
* మీ- సేవ అంతర్జాల వెబ్సైట్లోనూ నేరుగా చేయవచ్ఛు గూగుల్లో మీ- సేవ తెలంగాణ అని టైప్ చేసి అధికారిక వెబ్సైట్లో ఫిర్యాదుల సెల్లో నమోదు చేసినా సరిపోతుంది.
* ఇలా వీలుకాని పక్షంలో ప్రత్యేకంగా టోల్ఫ్రీ నంబరు ఉంది. పరిష్కారం కాల్సెంటర్ సంఖ్య 18004251110కు ఫిర్యాదు చేస్తే వారు సంబంధిత జిల్లా అధికారులకు సమాచారం చేరవేస్తారు.
పరిశీలించి చర్యలు..
అధికారికంగా నిర్దేశించిన సిటిజన్ ఛార్ట్ ప్రకారం ప్రతి సేవకు నిర్ణీత రుసుం మాత్రమే తీసుకోవాలి. దీనికి మించి వసూలు చేస్తే సంబంధిత కేంద్రంపై చర్యలు తీసుకుంటాం. మండల కేంద్రాలకు సంబంధించినవారు ఆయా తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటాం. కేంద్రాల్లో రుసుం వివరాలను తెలియపర్చే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తాం.
- మోతీలాల్, జిల్లా అదనపు కలెక్టర్, వికారాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమో నినాదం.. కమల వికాసం
[ 11-05-2024]
వికసిత కమలాలతో.. కాషాయ రెపరెపలతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కళకళలాడాయి. మైదానమంతా మోదీ నినాదమే మార్మోగింది. -
అడుగడుగునా హారతులు.. అభివృద్ధికి వరాలు
[ 11-05-2024]
అడుగడుగునా హారతులు.. బతుకమ్మ ఆటలు.. శ్రేణుల నినాదాలు.. వెరసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. -
భద్రత మాది.. బాధ్యత మీది
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100 శాతం భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. -
సికింద్రాబాద్ ఓటర్లు అభివృద్ధి చూశారు
[ 11-05-2024]
‘రాష్ట్ర రాజధానిలో సగం సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ నేను చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు. -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. జాతీయ హోదాకు పోరాడతా
[ 11-05-2024]
‘చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఓవైపు ఆధునికతను పుణికి పుచ్చుకోవడంతోపాటు మరోవైపు వెనకబడిన ప్రాంతాల సమాహారంగా విస్తరించి ఉంది. -
ప్రలోభాలకు ఎర.. పంపకాల జాతర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజులే గడువు ఉండటంతో రాజధాని పరిధిలో ప్రలోభాలకు తెర లేచింది. -
కమలం గుర్తుంచుకోండి
[ 11-05-2024]
శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి రోడ్షో నిర్వహించారు. -
తెలంగాణ గుండెచప్పుడు.. ప్రతిధ్వనించింది
[ 11-05-2024]
ఇప్పటి వరకు లోక్సభకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్) చారిత్రక విజయం నమోదు చేసుకుంది. -
భాజపా శ్రేణుల్లో నయా జోష్
[ 11-05-2024]
సార్వత్రిక ప్రచారం తుది దశలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్, నారాయణపేట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అధోగతి: సబిత
[ 11-05-2024]
ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. -
చేవెళ్ల సీటు సోనియాకు కానుకగా ఇస్తాం: టీఆర్ఆర్
[ 11-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ సీటును గెలిపించుకుని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కో ఇంఛార్జి డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. -
ప్రచార పర్వం.. నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
దాదాపు నెల రోజులుగా హోరెత్తించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో తెర పడుతోంది. -
సొంతవారికే పంపకాల అప్పగింతలు
[ 11-05-2024]
ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి. -
ప్రయాణం మానుకోండి.. ప్రతిఫలం పొందండి
[ 11-05-2024]
ఏపీ నుంచి వచ్చి శేరిలింగంపల్లిలో ఉంటున్న కొందరు ఓటర్లు సొంతూరుకు ప్రయాణమయ్యారు. -
గత స్మృతులను గుర్తు చేస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తూ
[ 11-05-2024]
ఆరు నెలల క్రితం చిన్నారి పాడిన పద్యాన్ని గుర్తు చేసుకొని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రముఖుల రాకపోకలతో బేగంపేట విమానాశ్రయంలో సందడి
[ 11-05-2024]
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నగరానికి ప్రముఖుల రాకపోకలతో శుక్రవారం బేగంపేట విమానాశ్రయం సందడిగా మారింది. -
ఎన్నికల రోజున డ్రోన్లతో నిఘా
[ 11-05-2024]
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ తెలిపారు. -
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
[ 11-05-2024]
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
చీటీ వచ్చిందా.. ఏ బ్రాండు కావాలో ఇచ్చెయ్
[ 11-05-2024]
ఓటర్లకు మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం దృష్టి మళ్లించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. -
దుర్గంచెరువు పూడ్చివేతపై ఫిర్యాదు
[ 11-05-2024]
మాదాపూర్లోని దుర్గంచెరువు ఎఫ్టీఎల్ను ఫూడ్చివేసిన ప్రాంత్రాన్ని శుక్రవారం ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. -
జనం డబ్బుతో సినిమా నిర్మాణం
[ 11-05-2024]
చిట్టీల వ్యాపారంతో ప్రజల వద్ద రూ.కోట్లు వసూలు చేసిన దంపతులు ఆ సొమ్ముతో ఓ సినిమాను నిర్మించారు. -
గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
[ 11-05-2024]
కేపీహెచ్బీ ఠాణా పరిధిలో నాలుగు రోజుల క్రితం మహిళ మెడలోంచి గొలుసు చోరీ చేసిన ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నిందితుడని గుర్తించిన పోలీసులు.. -
ఈత కొలనులో మునిగి అయిదేళ్ల చిన్నారి దుర్మరణం
[ 11-05-2024]
వేసవి శిబిరం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!