స్వేచ్ఛగా ఓటు వేసేలా..!
శాసనసభ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. ఆయా వసతులను ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు అనువుగా తీర్చేదిద్దేందుకు అధికారులు మరోసారి ఏర్పాట్లు చేపడుతున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు
సూర్యాపేటలో పోలింగ్ కేంద్రంలో చేపడుతున్న పనులను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్టుడే: శాసనసభ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. ఆయా వసతులను ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు అనువుగా తీర్చేదిద్దేందుకు అధికారులు మరోసారి ఏర్పాట్లు చేపడుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో మండుటెండలకు ఓటర్లు ఇబ్బందులు పడకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధుల నుంచి యువకుల వరకు ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేందుకు మౌలిక వసతుల లేమి అడ్డురాకుండా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్ద ఓటు వేసే కార్యక్రమం మొదలైంది. మిగిలిన ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయనున్నారు. గతేడాది శాసనసభ ఎన్నికల్లో చేపట్టిన శాశ్వత పనులు మినహా మిగతా పనులను గుర్తించి క్షేత్రస్థాయి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వాటికి అధికారులు ఆమోదం తెలిపిన తరువాత పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే చాలావరకు పనులు పూర్తి అయ్యాయి. మిగిలినవి వేగంగా పూర్తిచేసేలా ఎన్నికల అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ఓటర్లను చైతన్య పరుస్తున్నారు.
వేసవిలో ఇబ్బందులు లేకుండా..
ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 3,580 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 35,16,658 మంది ఓటర్లకు అనుగుణంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేపడుతున్నారు. మే 13న పోలింగ్ ఉండటంతో అందుకు అనుగుణంగా ఆ లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, చల్లటి నీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీ సిబ్బందికి ఇప్పటికే అవగాహన కల్పించారు. ప్రధానంగా విద్యుత్తు సౌకర్యం, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వృద్ధులకు, వికలాంగులు సులువుగా కేంద్రంలోకి వెళ్లేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది ఇబ్బందులు పడకుండా మరుగుదొడ్లు, అందులో నీటి సౌకర్యం, భోజన వసతి కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీటికి పోలింగ్ కేంద్రాల వారీగా నిధులు మంజూరు చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్లుగా.. ఈ నేలలో..!
[ 02-06-2024]
స్వరాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దకాలం గడిచిపోయింది. ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ నేతృత్వంలోని భారాస ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లు పాలించగా.. -
నకిలీ విత్తనాల విక్రయాలకు కట్టడి
[ 02-06-2024]
నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యత లేని విత్తనాలను కొనుగోలు చేసి అన్నదాతలు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
పల్లె ప్రగతిపై ఆరా..!
[ 02-06-2024]
గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి పేరుతో ఉపాధి హామీ పథకం కింద అనేక పనులు చేపట్టారు. ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
బంధాలను అల్లుదాం.. రండి..!
[ 02-06-2024]
వేసవి సెలవులు.. పిల్లలు ఇంటి పట్టున ఉండే సమయం ఇది. సెలవుల్లో వారిని ఆటాపాటకు వదిలి పెట్టడమే సరిపోదు.. వారి వ్యక్తిత్వ వికాస అభివృద్ధి కోసం సమయం కేటాయించాల్సిన తరుణం ఇదేనని తల్లిదండ్రులు గుర్తించాలి. -
లక్ష్మణ్, పద్మ సమేత.. రామచిలుక
[ 02-06-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటకు చెందిన గౌటె లక్ష్మణ్, పద్మ దంపతులది ప్రత్యేకశైలి. వీరికి రామచిలుకలంటే అమితమైన భక్తి, శ్రద్ధ. ఏడేళ్లక్రితం వ్యాపారపరంగా తిరుగుతున్న క్రమంలో లక్ష్మణ్కు రంగురంగుల చిలుకలు కనిపించాయి. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28)ని టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు డానియేల్, శ్రీనివాస్తో కలిసి టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మిపెరుమాళ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. -
ప్రభుత్వ బడికి డిజిటల్ హంగులు
[ 02-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులు కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. విద్యార్థుల్లో భాషాభివృద్ధితో పాటు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకునే విధంగా బోధన కొనసాగించేందుకు ప్రభుత్వం, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. -
గేదెను ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. యువకుడి దుర్మరణం
[ 02-06-2024]
ద్విచక్ర వాహనం గేదెను ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా, మరొక యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.