ఈ జలం గరళం
వేసవికాలం వచ్చింది. తాగునీటి వనరులు అడుగంటి కలుషితమవుతాయి. ఈనీరు తాగి వ్యాధులు ప్రబలుతాయి.
నెల్లూరు వెంగళరావు నగర్లో మురుగు కాలువల్లో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులో
వృథాగా పోతున్న మంచినీరు .. లీకేజీ కారణంగా మంచినీరు లీకై మురుగుకాలువలా మారిందిలా..
మైపాడు రోడ్డు కిసాన్ నగర్లో మురుగునీటిలో ఇంటికెళ్లే పైపు
వేసవికాలం వచ్చింది. తాగునీటి వనరులు అడుగంటి కలుషితమవుతాయి. ఈనీరు తాగి వ్యాధులు ప్రబలుతాయి. ఈపరిస్థితుల్లో సరఫరాలో పుర అధికారులు ప్రమాణాలు పాటించడం లేదు. నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా పైపులైన్లు, ఇళ్లకు ఇచ్చే కనెక్షన్ల పైపులు మురుగుకాలువల్లో ఉంటున్నాయి. వీధి కుళాయిల చుట్టూ మురుగు తాండవిస్తోంది. వాల్వుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ గుంతల్లో చెత్త పేరుకుపోయింది. కావలిలో అయితే దశాబ్దాల క్రితం వేసిన పైపులకు లీకులు పడి కలుషితమై సరఫరా అవుతోంది. అయిదేళ్లుగా ఈపరిస్థితులను మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమైంది.
కావలి బాలకృష్ణారెడ్డినగర్ ఆంజనేయ విగ్రహం వాల్వు నుంచి లీకవుతున్న నీరు
ఈనాడు, నెల్లూరు, న్యూస్టుడే, కావలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధనల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు
[ 02-06-2024]
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. శనివారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. -
గంటల వ్యవధిలో దంపతుల మృతి
[ 02-06-2024]
ఏ కష్టం వచ్చినా కలసి ఉంటామని మనువాడేటప్పుడు బాస చేసుకున్న ఆ దంపతులు ఒక్కటిగానే ఇహం వీడి పరం చేరారు. భార్య కన్నుమూతతో కలత చెందిన భర్త కూడా ఆమె మృతదేహంపై రోదిస్తూ తుది శ్వాస విడిచారు. -
సోమశిల.. సాగుకెలా?
[ 02-06-2024]
ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారీ పరిశ్రమకు 115 ఎంఎల్డీ నీటిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సోమశిల జలాశయం నీటి కేటాయింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. పరిశ్రమల రాకతో ప్రగతికి బాటలు పడతాయని ఓ వర్గం అంటుండగా- ఈ ఏడాది ఎదురైన వర్షాభావ పరిస్థితులు.. -
భజే వాయుపుత్రం
[ 02-06-2024]
జిల్లా వ్యాప్తంగా శనివారం హనుమజ్జయంతిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అంజనీ సుతుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్గామిట్టలోని శబరి శ్రీరామ క్షేత్రంలో సామూహిక లక్ష మల్లెలార్చన నిర్వహించగా.. -
జమకాని సొమ్ము... జవాబు చెప్పేవారు లేరు!
[ 02-06-2024]
జూన్ నెలకూ సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా- ఈసారి పింఛనుదారులు ఇబ్బందులు పడ్డారు. అధిక ఉష్ణోగ్రతలు.. ఉక్కపోత మధ్య బ్యాంకుల వద్దకు చేరిన లబ్ధిదారులు.. -
కలగానే సొంత భవనాలు
[ 02-06-2024]
సంగంలోని ప్రభుత్వ ఆశ్రమ ఐటీఐకి సొంత భవనాలు కలగానే మిగిలాయి. ఏళ్లుగా పరాయి పంచనే తరగతులు నిర్వహిస్తున్నా.. ఐటీఐకి కేటాయించిన స్థలంపై కబ్జాదారులు కన్నేసి ప్రయత్నాలు చేస్తున్నా.. అదే సమయంలో గ్రావెల్ దొంగలు గుల్ల చేస్తున్నా.. -
నిబంధనలకు నీళ్లు
[ 02-06-2024]
జాతీయ రహదారి నిర్మాణంలో గుత్తేదారులు నిబంధనలకు నీళ్లొదిలారు. మట్టి తరలింపులో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించకుండా తీసుకెళుతున్నారు. -
అతివేగంతో అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు
[ 02-06-2024]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కామాక్షి ట్రావెల్స్కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు వస్తోంది.