పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ నిశిత పరిశీలన
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ పరిశీలించారు.
ఏర్పాట్లపై అసహనం
సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
నరసన్నపేట, న్యూస్టుడే: పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ పరిశీలించారు. స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో నాలుగు మండలాలకు చెందిన 5 పోలింగ్ కేంద్రాలను ఆయన నిశితంగా పరిశీలించారు. ఓటర్లు, పోలింగ్ ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలిచ్చారు. పోలింగ్ ఏర్పాట్లపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దాదాపు గంటంపావు కాలం పాటు పోలింగ్ కేంద్రాల వద్దే ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అధిక సంఖ్యలో ఉద్యోగ ఓటర్లు ఉండటాన్ని ఆయన గమనించి పరిస్థితిని చక్కదిద్దారు. పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై ఆర్వో రామ్మోహనరావుకు పలు సూచనలు చేశారు. కాలేజీ రోడ్డులో రాజకీయ పార్టీల ప్రచారం లేకుండా చూడాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుల వాన
[ 02-06-2024]
జిల్లాలో పలుచోట్ల శుక్రవారం రాత్రి ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలాస డివిజన్లో అత్యధికంగా, శ్రీకాకుళంలో సాధారణ వర్షం కురిసింది. -
తవ్వకాలతో ముప్పు.. కలగదా కనువిప్పు..?
[ 02-06-2024]
ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట మందస మండలాలకు సంబంధించి 50 వేల ఎకరాలకు పైగా పంట పొలాలకు సాగునీరు అందించడానికి రెండు నదులపై వివిధ ప్రాజెక్టులు నిర్మించారు. -
ఎన్నికల ఫలితాల ప్రకటనలో అలసత్వం వద్దు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న చేపట్టే ఓట్ల లెక్కింపు సమయంలో ఫలితాల ప్రకటన విషయంలో సంబంధిత అధికారులు ఎలాంటి అలసత్వం వహించవద్దని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు. -
ఈసారీ ఎదురుచూపులేనా..?
[ 02-06-2024]
ఇంటర్ విద్యార్థులు పాఠ్యపుస్తకాలు లేకుండా చదువు సాగిస్తున్నారు. గతంలో ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా సరఫరా చేసేవారు. -
గంటలోనే ముగించేశారు..!
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులో ఉండటం, ఓట్ల లెక్కింపు ప్రభావం జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంపై పడింది. -
ఆంక్షలు ఇవీ.. గమనించండి..!
[ 02-06-2024]
జిల్లాలో ఈ నెల 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వాహనాల రాకపోకలకు సంబంధించి ఆంక్షలు విధించారు. -
ఆర్భాటమే మిగిలింది
[ 02-06-2024]
మండలం పరిధి బూర్జపాడులో పాలకేంద్రం నిర్మాణమిది. పునాదులు వేసి పిల్లర్ల నిర్మాణం చేపట్టి మధ్యలోనే ఆపేశారు. బిల్లుల మంజూరులో జాప్యం నెలకొంది. -
ఇచ్చేది గోరంత.. కోరేది కొండంత
[ 02-06-2024]
శిక్షణలో వంటల తయారీకి నూనె ఎంత వేయాలి, పప్పు దినుసులు, మసాలా ఎంత వాడాలో చెబుతున్నారు. మెలకువలు నేర్పిస్తున్నారు.