చీకటి పాలన నుంచి త్వరలో విముక్తి : నారా రోహిత్
అయిదేళ్ల చీకటి పాలన నుంచి త్వరలోనే విముక్తి పొందుతామని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. తెదేపా యువ నాయకుడు ఆరిమిల్లి నిఖిల్రత్న ఆధ్వర్యంలో స్థానిక భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువ గళం...
మాట్లాడుతున్న రోహిత్
తణుకు, తణుకు గ్రామీణ, న్యూస్టుడే : అయిదేళ్ల చీకటి పాలన నుంచి త్వరలోనే విముక్తి పొందుతామని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. తెదేపా యువ నాయకుడు ఆరిమిల్లి నిఖిల్రత్న ఆధ్వర్యంలో స్థానిక భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువ గళం... ఇది నవ గళం పేరుతో నిర్వహించిన తణుకు నియోజకవర్గ యువత ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలిసీ తెలిసీ మనం రాక్షసుడిని తెచ్చుకున్నామని పేర్కొన్నారు. నాడు రాక్షసుడిని అంతం చేయడానికి రాముడు, లక్ష్మణుడు, వానర సైన్యం కలసి పోరాడారు. నేడు జగన్ పాలనను అంతం చేయడానికి చంద్రబాబు, పవన్కల్యాణ్, మోదీ కూటమిగా పోరాడుతున్నారన్నారు. 2014- 19లో నవ్యాంధ్రతో తెలంగాణ పోటీ పడేదని, 2019 తర్వాత ఇక్కడ యువత అంతా తెలంగాణకు వలసలు పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుండాలంటే ఎన్డీయే అధికారంలోకి రావాలన్నారు. అప్పుడే వస్తే ఐటీ కంపెనీలు, పరిశ్రమలు రాష్ట్రానికి తరలివచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ‘‘హలో ఏపీ బైబై వైసీపీ’’ అంటూ యువతలో ఉత్సాహాన్ని రేకెత్తించి ప్రసంగం ముగించారు. కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో చరిత్రాత్మక నిర్ణయానికి యువత పెద్ద ఎత్తున దీక్ష వహించి దుర్మార్గ వైకాపాను ఇంటికి పంపించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం నారా రోహిత్ను నాయకులు, కార్యకర్తలు గజ మాలతో ఘనంగా సన్మానించారు. తణుకు పట్టణం, తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలకు చెందిన తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకింత.. మాకింత!
[ 02-06-2024]
ఏలూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం అక్రమాల ఊబిలో కూరుకుపోయింది. ఆస్తి పన్నుల విషయంలో అధికారుల చేతివాటంతో నగర పాలిక ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది. వాణిజ్య భవనాలను నివాసాలుగా చూపించడం, కొత్తగా కట్టిన నిర్మాణాలకు పన్నులు విధించకపోవడంతో భారీ నష్టం వాటిల్లుతోంది. -
బంధంచర్ల అడవిలో చిరుతపులి సంచారం!
[ 02-06-2024]
టి.నరసాపురం మండలం బంధంచర్ల అటవీ ప్రాంతంలో వారం రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఫాస్ట్ పాసింజర్ విజయవాడ వరకే
[ 02-06-2024]
నరసాపురం - గుంటూరు మధ్య నడిచే ఫాస్ట్ పాసింజర్ రైలు జూన్ 30 వరకు విజయవాడ వరకే నడవనుందని రైల్వేశాఖాధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ మరమ్మతులు చేపట్టినందున ఈ రైలు సేవలను గత నెలలో రద్దుచేశారు. -
ఎండన పడ్డ పండుటాకులు
[ 02-06-2024]
మండుటెండలో పండుటాకులు విలవిల్లాడారు. ఒకటో తేదీ నుంచి ఇంటికే పింఛను అందించే వ్యవస్థలు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసింది. వేసవి కావడంతో లబ్ధిదారులందరూ పింఛను నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడ్డారు. -
ప్రతిపాదనలతో నీళ్లొదిలేశారు!
[ 02-06-2024]
వేసవిలో చేపట్టాల్సిన పంట కాలువల నిర్వహణ పనులకు ఆమోదం లభించకుండానే ఈ ఏడాది సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఈ సారి కీలకమైన పూడిక తీత పనులకు అవకాశం లేకుండాపోయింది. -
అంజనీసుతా.. అతులిత బలధామా!
[ 02-06-2024]
హనుమజ్జయంతిని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో శనివారం వైభవంగా నిర్వహించారు. భీమవరంలోని పంచారామక్షేత్రం సోమేశ్వర జనార్దనస్వామి దేవస్థానం ప్రాంగణంలో భక్తాంజనేయ స్వామి ఉపాలయంలో ఉదయం స్వామికి అభిషేకాలు, లక్ష తమలపాకుల పూజలు, మూలమంత్ర హోమం చేశారు. -
4న భీమవరంలో ట్రాఫిక్ మళ్లింపు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భీమవరం పట్టణంలో ఈ నెల 4న ట్రాఫిక్ను మళ్లించనున్నట్లు ఎస్పీ వి.అజిత తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి వాహనాలను వేర్వేరు మార్గాల్లో మళ్లిస్తామన్నారు. లెక్కింపు కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, ఏజెంట్లు వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే నిలుపుదల చేయాలని సూచించారు. -
దిక్కు లేని ర.భ.శాఖ
[ 02-06-2024]
ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖకు భవనం నిర్మించాలన్నా రహదారులు భవనాలశాఖ డిజైన్ చేసి అనుమతి ఇవ్వాల్సిందే. రహదారులు అభివృద్ధి నిర్వహణ అంతా ఆ శాఖపైనే ఆధారపడి ఉంటుంది. -
ఎప్పటిలాగే ఏకరవు!
[ 02-06-2024]
జడ్పీటీసీ సభ్యులు పలువురు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ఏకరవు పెట్టారు. ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు తమ మండలాల్లోని సమస్యలను ప్రస్తావించారు. -
కళాశాలల్లో సమస్యల స్వాగతం
[ 02-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతులు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. కళాశాలల పునఃప్రారంభం నేపథ్యంలో వాటి ఆవరణలను పరిశీలిస్తే నాడు-నేడు పనులు అసంపూర్తిగా ఉన్నాయి.