జాగాలపై జగన్ మూకలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఊరూరా ఆక్రమణలపర్వం
‘జాగా కనిపిస్తే..పాగా వేసేయడమే’ అన్నట్లు జగన్ అనుచరగణం ఊరూరా చెలరేగిపోయింది. అయిదేళ్ల జమానాలో మమ్మల్ని ఎవర్రా ఆపేది అన్నట్లు ఆక్రమణల పర్వం సాగింది. ప్రజల సామూహిక అవసరాలకు వినియోగించాల్సిన స్థలాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయాయి.
స్థలాలు కనిపిస్తే గెద్దల్లా వాలిపోతున్న వైనం
కాలువగట్లు, శ్మశానాలూ కబ్జా చెరలోకి..
ఈనాడు, భీమవరం, న్యూస్టుడే బృందం
‘జాగా కనిపిస్తే..పాగా వేసేయడమే’ అన్నట్లు జగన్ అనుచరగణం ఊరూరా చెలరేగిపోయింది. అయిదేళ్ల జమానాలో మమ్మల్ని ఎవర్రా ఆపేది అన్నట్లు ఆక్రమణల పర్వం సాగింది. ప్రజల సామూహిక అవసరాలకు వినియోగించాల్సిన స్థలాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయాయి.
దెందులూరు మండలం కొవ్వలిలో కొత్త సచివాలయం ఎదురుగా ఉన్న భూములను వైకాపా అనుచరులు ఆక్రమించారు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. గ్రామస్థులు స్పందనలో ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఓ వైకాపా నేత అధికారులపై ఒత్తిడి చేయడంతో వారు చర్యలకు ఉపక్రమించడం లేదు.
ప్రభుత్వ స్థలంపై కన్ను పడితే ముందు చదును చేసి..మెరక చేస్తారు. చిన్న దుకాణం..లేదా దేవుడు విగ్రహం పెట్టేస్తారు.. అదే దన్నుగా కొద్ది రోజులకు శాశ్వత నిర్మాణాలు చేపడతారు. ఉమ్మడి జిల్లాలో జలవనరులు, పంచాయతీ, పుర, నగరపాలిక, దేవాదాయ భూములన్న తేడా లేకుండా ఇలా కబ్జా చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఉత్సవ విగ్రహాల్లా చూస్తూ ఉండిపోయారు.
కాకి లెక్కలతో సరి..
వైకాపా అయిదేళ్ల పాలనలో ఆక్రమణలు పెరిగి పోయాయి. అధికారులు జిల్లాలో 4 వేల ఆక్రమణలు ఉన్నాయని కాకి లెక్కలు వేస్తున్నా..నిజానికి ఏలూరు పరిధిలోనే 4వేలకు పైగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జలవనరులు పంచాయతీ, దేవాదాయ, నగర, పురపాలిక, ఆర్అండ్బీ తదితర శాఖల్లో దాదాపు లక్షకు పైగా ఆక్రమణలు ఉన్నాయి. ఇందులో వైకాపా పాలనలోనే దాదాపు 50వేల వరకు కొత్త ఆక్రమణలు జరిగాయని తెలుస్తోంది.
భవిష్యత్తుకు భరోసా లేకుండా చేశారు
భవిష్యత్తులో కాలువలు, రహదారుల విస్తరణ, ప్రజా సేవలను పెంపొందించేందుకు ప్రభుత్వ భవనాల నిర్మాణం వంటి అవసరాల కోసం ప్రతి శాఖలో అదనపు భూములంటాయి. వాటిని అధికారులు పట్టించుకోకపోవటంతో నాయకుల అండతో వారి అనుచరులు ఆక్రమిస్తున్నారు. దీంతో భవిష్యత్తు అవసరాలకు ఇబ్బందులు పడుతున్నాం. ప్రైవేటు భూమి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో జగనన్న ఇళ్ల స్థలాల కోసం 932 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని రూ.1.34 లక్షల కోట్లతో కొనుగోలు చేశారు. ఉన్న ప్రభుత్వ స్థలాలను కాపాడుకుంటే కొంతమేర ఖర్చు తగ్గేది.
జిల్లాలో ఒక్క దేవాదాయ శాఖలోనే దాదాపు వెయ్యి ఎకరాల వరకు పొలాలు, స్థలాలు ఆక్రమణల్లో ఉన్నాయి. వైకాపా నాయకులు వాటిలో వ్యాపార సమూహాలు, నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ఖాళీగా ఉన్న స్థలాలను వారు ఆక్రమించగానే ఎక్కడన్నా అడ్డుకొనేందుకు అధికారులు వెళ్తే... ‘మా పార్టీ వాళ్లే వదిలేయండి’ అంటూ ప్రజాప్రతినిధులు ఫోన్లో హుకుం జారీ చేస్తారు. ఇల్లు లేని పేదలు చిన్న గుడిసె వేసుకుంటే ముందస్తు సమాచారం లేకుండా అధికారులు రాత్రికిరాత్రే కూల్చేస్తారు. వైకాపా నాయకులు వందల ఎకరాలు ఆక్రమించుకుని శాశ్వత నిర్మాణాలు చేపట్టినా పట్టించుకోరు.
ముసునూరు మండలం రమణక్కపేట పంచాయతీ భూమిని స్థానిక వైకాపా నేత ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ అవసరాల కోసం దాతలు ఇచ్చిన 2 సెంట్ల భూమిలో దుకాణ నిర్మాణం చేపట్టారు. అదే గ్రామంలో రూ.1.5 కోట్ల విలువైన 3 ఎకరాల శ్మశాన స్థలాన్ని వైకాపా నాయకులు ఆక్రమించి కోళ్లఫారాలు, దుకాణాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు.
పాలకొల్లు పట్ణణంలో దిగమర్రు ఛానల్కు ఆనుకుని ఉన్న జలవనరుల శాఖ స్థలం కబ్జా కోరల్లో చిక్కుకుంది. వైకాపా నేతల అండతో వారి అనుచరులు కాలువలో మట్టి పోసి మరీ అక్కడ ఈ కట్టడం నిర్మిస్తున్నారు. అధికారుల కళ్ల ముందే ఇదంతా సాగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా కాలువ పొడవునా ఆక్రమణలు పెరిగితే భవిష్యత్తులో కాలువలు విస్తరించాలంటే కష్టమే.
పెనుగొండ మండలం సిద్ధాంతం అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఉన్న రూ.కోట్ల విలువైన 10 సెంట్ల పంచాయతీ స్థలం ఆక్రమణ చెరలోకి వెళ్లింది. స్థానిక వైకాపా నేత అంతా నా ఇష్టం అన్నట్లు రాత్రికిరాత్రే ప్రభుత్వ భవనాలు కూల్చి భక్తి సాకుతో సరస్వతి విగ్రహం, మరుగుదొడ్లు, భోజనశాల పేరుతో రేకుల షెడ్లు ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు కనీస చర్యలకు ఉపక్రమించలేదు.
కుడిగట్టు కొల్లగొట్టారు
పెదవేగి మండలం జానంపేటలో కుడికాలువ గట్టును ఆక్రమించి వైకాపానేతలు ఏర్పాటు చేసిన కోళ్లఫారాలు
పోలవరం కుడికాలువ ఉన్న పోలవరం, కొయ్యలగూడెం, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, పెదవేగి మండలాల్లో గట్టు పొడవునా ఆక్రమణలే దర్శనమిస్తాయి. పెదవేగి మండలం జగన్నాథపురం, లక్ష్మీపురంలో ఆయిల్పాం, జీడి, కొబ్బరి తోటలు, వరి సాగు చేస్తున్నారు. భీమడోలు మండలం పోలసానిపల్లిలో ఆయిల్పామ్ తోటలు వేశారు. పెదవేగి మండలం జానంపేట సమీపంలో ఓ వైకాపా నేత అనుచరుడు షెడ్లు వేసి కోళ్లఫారాలు నిర్మించారు. ఇదంతా బహిరంగంగా సాగుతున్నా జలవనరుల శాఖ అధికారులు ఒక్క ఆక్రమణనూ తొలగించలేదు. కారణం ఆక్రమణదారులంతా వైకాపా వర్గీయులు కావడమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకింత.. మాకింత!
[ 02-06-2024]
ఏలూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం అక్రమాల ఊబిలో కూరుకుపోయింది. ఆస్తి పన్నుల విషయంలో అధికారుల చేతివాటంతో నగర పాలిక ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది. వాణిజ్య భవనాలను నివాసాలుగా చూపించడం, కొత్తగా కట్టిన నిర్మాణాలకు పన్నులు విధించకపోవడంతో భారీ నష్టం వాటిల్లుతోంది. -
బంధంచర్ల అడవిలో చిరుతపులి సంచారం!
[ 02-06-2024]
టి.నరసాపురం మండలం బంధంచర్ల అటవీ ప్రాంతంలో వారం రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఫాస్ట్ పాసింజర్ విజయవాడ వరకే
[ 02-06-2024]
నరసాపురం - గుంటూరు మధ్య నడిచే ఫాస్ట్ పాసింజర్ రైలు జూన్ 30 వరకు విజయవాడ వరకే నడవనుందని రైల్వేశాఖాధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ మరమ్మతులు చేపట్టినందున ఈ రైలు సేవలను గత నెలలో రద్దుచేశారు. -
ఎండన పడ్డ పండుటాకులు
[ 02-06-2024]
మండుటెండలో పండుటాకులు విలవిల్లాడారు. ఒకటో తేదీ నుంచి ఇంటికే పింఛను అందించే వ్యవస్థలు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసింది. వేసవి కావడంతో లబ్ధిదారులందరూ పింఛను నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడ్డారు. -
ప్రతిపాదనలతో నీళ్లొదిలేశారు!
[ 02-06-2024]
వేసవిలో చేపట్టాల్సిన పంట కాలువల నిర్వహణ పనులకు ఆమోదం లభించకుండానే ఈ ఏడాది సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఈ సారి కీలకమైన పూడిక తీత పనులకు అవకాశం లేకుండాపోయింది. -
అంజనీసుతా.. అతులిత బలధామా!
[ 02-06-2024]
హనుమజ్జయంతిని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో శనివారం వైభవంగా నిర్వహించారు. భీమవరంలోని పంచారామక్షేత్రం సోమేశ్వర జనార్దనస్వామి దేవస్థానం ప్రాంగణంలో భక్తాంజనేయ స్వామి ఉపాలయంలో ఉదయం స్వామికి అభిషేకాలు, లక్ష తమలపాకుల పూజలు, మూలమంత్ర హోమం చేశారు. -
4న భీమవరంలో ట్రాఫిక్ మళ్లింపు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భీమవరం పట్టణంలో ఈ నెల 4న ట్రాఫిక్ను మళ్లించనున్నట్లు ఎస్పీ వి.అజిత తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి వాహనాలను వేర్వేరు మార్గాల్లో మళ్లిస్తామన్నారు. లెక్కింపు కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, ఏజెంట్లు వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే నిలుపుదల చేయాలని సూచించారు. -
దిక్కు లేని ర.భ.శాఖ
[ 02-06-2024]
ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖకు భవనం నిర్మించాలన్నా రహదారులు భవనాలశాఖ డిజైన్ చేసి అనుమతి ఇవ్వాల్సిందే. రహదారులు అభివృద్ధి నిర్వహణ అంతా ఆ శాఖపైనే ఆధారపడి ఉంటుంది. -
ఎప్పటిలాగే ఏకరవు!
[ 02-06-2024]
జడ్పీటీసీ సభ్యులు పలువురు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ఏకరవు పెట్టారు. ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు తమ మండలాల్లోని సమస్యలను ప్రస్తావించారు. -
కళాశాలల్లో సమస్యల స్వాగతం
[ 02-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతులు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. కళాశాలల పునఃప్రారంభం నేపథ్యంలో వాటి ఆవరణలను పరిశీలిస్తే నాడు-నేడు పనులు అసంపూర్తిగా ఉన్నాయి.