ఎమ్మెల్యేలూ.. మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకోండి!

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సూచించారు.

Updated : 12 Sep 2020 18:42 IST

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ సూచన

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సూచించారు. సోమవారం అసెంబ్లీ ప్రారంభమయ్యేలోపు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అందరి శ్రేయస్సు దృష్ట్యా సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమావేశాలకు హాజరయ్యే అధికారులు ఆదివారం సాయంత్రం మరోసారి పరీక్షలు చేయించుకోవాలని పోచారం, గుత్తా తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశాల ప్రారంభానికి ముందు కూడా ఉభయ సభల సభ్యులతో పాటు అధికారులు, సిబ్బంది, పాత్రికేయులు కరోనా టెస్ట్‌లు చేయించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని