Andhra News: ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఏపీ సర్కారు పచ్చజెండా
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఇప్పటివరకు నిషేధం కొనసాగుతూ వచ్చింది
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఇప్పటివరకు నిషేధం కొనసాగుతూ వచ్చింది. ఆ నిషేధాన్ని సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకం చేశారు. దీంతో ఉద్యోగుల సాధారణ బదిలీలపై అడ్డంకులు తొలిగిపోయినట్లు అయింది. దీంతో జూన్ 17 లోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!