AP news: కొత్తగా 2,224 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.  గడచిన 24 గంటల్లో 71,758 నమూనాలను పరీక్షించగా 2,224 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తాజాగా

Updated : 28 Jun 2021 17:01 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.  గడచిన 24 గంటల్లో 71,758 నమూనాలను పరీక్షించగా 2,224 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తాజాగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సోమవారం సాయంత్రం బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా నుంచి నిన్న 4,714 మంది కోలుకోగా..రాష్ట్రంలో ప్రస్తుతం 42,252 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్‌ కారణంగా  చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశః జిల్లాల్లో ఇద్దరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరుచొప్పున మృతి చెందారు. ఇప్పటివరకు 2,18,04,691 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని