AP news: కొత్తగా 2,224 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 71,758 నమూనాలను పరీక్షించగా 2,224 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 71,758 నమూనాలను పరీక్షించగా 2,224 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సోమవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి నిన్న 4,714 మంది కోలుకోగా..రాష్ట్రంలో ప్రస్తుతం 42,252 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్ కారణంగా చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశః జిల్లాల్లో ఇద్దరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరుచొప్పున మృతి చెందారు. ఇప్పటివరకు 2,18,04,691 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి