TS News: హోమ్ ఓటింగ్కు ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి: వికాస్రాజ్
లోక్సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు.
హైదరాబాద్: లోక్సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఏప్రిల్ 22 లోపు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇందుకు ఫారం-డీ పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఆర్వో వద్ద పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ ఉంటుందని వివరించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వేళ 2.09 లక్షల మంది పోస్టల్, హోమ్ ఓటింగ్ను వినియోగించుకున్నట్లు చెప్పారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 3, 4 రోజుల్లో హోమ్ ఓటింగ్ ఉంటుందని సీఈవో వెల్లడించారు.
మరిన్ని అంశాలు..
- తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.30 కోట్ల మంది
- 85 ఏళ్లు దాటిన వారు 1.94 లక్షల మంది
- దివ్యాంగులు, 85 ఏళ్ల వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం
- సరిహద్దుల వద్ద 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు
- సరైన పత్రాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటాం
- ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ లేదా 1950 ద్వారా ఫిర్యాదు చేయాలి
- ఎన్నికల ప్రచారంలో పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యం చేయకూడదు
- రోడ్షోలకు ముందస్తు అనుమతి తప్పనిసరి
- రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడకూడదు
- ఆర్వో, డీఈవో, పోలీసు అధికారులకు దిల్లీలో శిక్షణ ఇచ్చాం
- మరికొంత మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది
- ఎన్నికల కోసం 1,85,612 మంది పోలీసు సిబ్బంది నియామకం
- 35,365 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి
- పోలింగ్ కోసం 54,353 వీవీప్యాట్లు అందుబాటులో ఉన్నాయి
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం 500 బీయూలు, 500 వీవీ ప్యాట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఓటర్లకు పంచేందుకు తరలింపు.. ఒంగోలులో 6 లారీల బియ్యం పట్టివేత
నగరంలోని వేంకటేశ్వర కాలనీలో భారీగా బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. -
విజయవాడలో బస్సుల కొరత.. ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల మండిపాటు
ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఐదు వసంతాల పండగ.. కదలాలి కేంద్రాలకు నిండుగా
ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ఒక జాతీయ, రాష్ట్రీయ వేడుక. ఏదైనా పండుగ వస్తే ఒక సామాజికవర్గం సంబరాలు చేసుకుంటుంది. -
ఓటర్లను కదిలించు తల్లీ..
అమ్మ.. అలుపు ఎరగకుండా శ్రమిస్తుంది. కుటుంబ ఉన్నతికి తపిస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ