AP News: ఓట్ల తొలగింపు.. భాస్కర్ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

అనంతపురం జిల్లా పరిషత్ ప్రధాన ఎన్నికల అధికారి కె.భాస్కర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. భాస్కర్‌రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు.

Updated : 20 Aug 2023 20:16 IST

అమరావతి: అనంతపురం జిల్లా పరిషత్ ప్రధాన ఎన్నికల అధికారి కె.భాస్కర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈసీ ఆదేశాల మేరకు భాస్కర్‌రెడ్డిని సస్పెండ్‌ చేసినట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  ఉరవకొండ నియోజకవర్గంలో జరిగిన భారీ ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘానికి పీఏసీ చైర్మన్, తెదేపా నేత పయ్యావుల కేశవ్ గతంలో ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపులో అక్రమాలను నిర్ధారించిన కేంద్ర ఎన్నికల సంఘం.. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు అతడిని సస్పెండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని