TS Elections: కరీంనగర్‌ కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు

కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు పడింది.

Updated : 27 Oct 2023 19:44 IST

హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు అఖిల భారత సర్వీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ బి.గోపి, పోలీస్‌ కమిషనర్‌ ఎల్‌.సుబ్బారాయుడు బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే కింది అధికారులకు బాధ్యతలు అప్పగించాలని, సాధారణ పరిపాలనాశాఖలో రిపోర్టు చేయాలని ఐఏఎస్‌ అధికారి గోపి, ఐపీఎస్‌ అధికారి సుబ్బారాయుడును సీఎస్‌ ఆదేశించారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇరువురు అధికారులను ఈసీ బదిలీ చేసినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని