Hyderabad: పీపుల్స్‌ ప్లాజాలో శారీ రన్‌.. పాల్గొన్న నారా బ్రాహ్మణి

తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘శారీ రన్‌’ నిర్వహించాయి.

Updated : 17 Mar 2024 10:46 IST

హైదరాబాద్‌: తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘శారీ రన్‌’ నిర్వహించాయి. పీపుల్స్‌ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3 వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. చీర సంప్రదాయంతో పాటు స్త్రీలకు గుర్తింపును తీసుకువస్తుందన్నారు. ఇది సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. తనైరా సీఈవో అంబుజ్ నారాయణ్ మాట్లాడుతూ.. చీరలు మహిళలకు హుందాతనం, గౌరవాన్ని ఇస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు