Simhachalam: సింహాచలం గిరిప్రదక్షిణ.. ఇసుకేస్తే రాలనంతగా భక్త జనం

సింహాచలం గిరిప్రదక్షిణ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన గిరిప్రదక్షిణలో సోమవారం ఉదయానికి పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు.

Updated : 03 Jul 2023 09:06 IST

విశాఖపట్నం: సింహాచలం గిరిప్రదక్షిణ రెండోరోజు కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన గిరిప్రదక్షిణకు సోమవారం ఉదయానికి పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఉభయగోదావరి, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో గిరి ప్రదక్షిణ మార్గాలు కిక్కిరిసిపోయి గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పాతగోశాల టీ జంక్షన్‌ వద్ద రద్దీ జనసంద్రాన్ని తలపించింది. ఆ మార్గంలో కనుచూపు మేరలో ఇసుకేస్తే రాలనంతంగా భక్తులు కనిపించారు. అప్పన్నస్వామిని స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని