Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. గడువు పొడిగింపు ఉండదు.. రిటర్నులు త్వరగా వేయండి
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే గడువు (జులై 31)ను పొడిగించాలన్న ఆలోచన ఆర్థిక శాఖకు లేదని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా చెప్పారు. అందువల్ల ఆఖరి రోజుల వరకు వేచి ఉండి, ఇబ్బందులు ఎదుర్కోకుండా.. సాధ్యమైనంత త్వరగా రిటర్నులు వేయాలని చెల్లింపుదార్లకు సూచించారు. గత ఆర్థిక సంవత్సరం కంటే అధికమొత్తంలో రిటర్నులు దాఖలవుతాయనే అంచనాను ఆయన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. శ్రీవారి దర్శనానికి వచ్చే రెండు నెలల్లో రోజుకు 4 వేల అదనపు టికెట్లు
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఆగస్టు, సెప్టెంబరు మాసాలకు రోజుకు నాలుగు వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం అదనపు టికెట్లు త్వరలోనే జారీ చేస్తామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఆదివారం అన్నమయ్య భవనంలో తితిదే డయల్ ఈవో అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కుతకుతలాడుతున్న ప్రపంచం
భూగోళం వేడెక్కుతోందన్న శాస్త్రవేత్తల అంచనాలు నిజమవుతున్నాయి. గత నెలలో ప్రపంచం ఎన్నడూ లేనంతగా ఎండి వేడిమిని చవి చూసింది. యూరోపియన్ యూనియన్ వాతావరణ పర్యవేక్షణ సంస్థ అంచనాల ప్రకారం.. అమెరికా, జపాన్, ఐరోపాలోని దేశాలు కుతకుతలాడాయి. ప్రజలను అవెన్లో పెట్టి ఉడికించినట్లుగా ఎండలు ఇబ్బంది పెట్టాయి. ఈ నెలలోనూ ఎండలు మండిపోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. నేడు అక్కడక్కడా భారీ వర్షాలు
బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై ఏర్పడిన గాలుల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్పై అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మంగళవారం నాటికి దక్షిణ దిశకు కదిలే సూచనలున్నాయి. పశ్చిమ దిశ నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఏపీలో 12 చోట్ల సౌర విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు
కేంద్ర ప్రభుత్వం కొత్తగా సౌర విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానుంది. హరిత నగరాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా వాటిని ఏర్పాటు చేస్తోంది. ఈ తరహా ఛార్జింగ్ కేంద్రాలు అనంతపురం, విజయవాడ, తిరుపతి నగరాల్లో 12 ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించింది. ఇందుకు రూ.95 లక్షలు విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఏపీలో స్థానిక విద్యార్థులతోనే అన్-రిజర్వుడు సీట్ల భర్తీ
ఏపీలో 2014 ఫిబ్రవరి 2 తరువాత కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 15% అన్-రిజర్వుడు (స్థానికేతర) సీట్లను ఆ రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిరుటి వరకు తెలంగాణ విద్యార్థులూ ఈ కోటాలో సీట్లు పొందేందుకు అవకాశం ఉండేది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఎంబీబీఎస్లో ప్రవేశాలకు 20 నుంచి రిజిస్ట్రేషన్
ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ(నర్సింగ్) కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఆలిండియా కోటా సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) శ్రీకారం చుట్టింది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) షెడ్యూలును విడుదల చేసింది. జులై 20 నుంచి నమోదు(రిజిస్ట్రేషన్) ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఓటర్ల జాబితాలో మీపేరుందా?
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. సరైన నాయకుణ్ని ఎన్నుకోవాలంటే ముందుగా మీకు ఓటు ఉండాలి. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో పరిశీలించుకోండి. అందుకు చాలా విధానాలున్నాయి. వీటి ద్వారా తరచి చూసుకుని, ఒకవేళ జాబితాలో మీ పేరు లేకుంటే ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. మన వాణిని ప్రపంచమంతా వింటోంది
గతంలో మన వాణిని ప్రపంచ దేశాలు అంత సీరియస్గా తీసుకునేవి కావని, కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తోందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రతిష్ఠ అంతర్జాతీయ వేదికలపై పెరిగిందని లఖ్నవూలో ఆదివారం ఆయన వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన కోసం ఆయన లఖ్నవూ వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. భారీ అప్పుల్లో ట్విటర్: ఎలాన్ మస్క్
ప్రకటనలు సగానికి పైగా తగ్గడంతో ట్విటర్ భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నట్లు సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ వెల్లడించారు. నగదు ప్రవాహ స్థితి ఇప్పటికీ ప్రతికూలంగానే ఉందని, ప్రకటనల ఆదాయం దాదాపు 50 శాతం క్షీణించడంతో పాటు సంస్థ భారీ రుణభారంలో ఉందని తెలిపారు. కంపెనీ ఏదైనా చేయడానికంటే ముందుగా సరిపడా నగదు నిల్వలకు చేరుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు