ఓటర్ల జాబితాలో మీపేరుందా?
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. సరైన నాయకుణ్ని ఎన్నుకోవాలంటే ముందుగా మీకు ఓటు ఉండాలి. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో పరిశీలించుకోండి.
మీ కుటుంబంలోని అర్హులందరి పేర్లూ జాబితాలో ఉన్నాయా?
మీ ఇంట్లో కొందరి పేర్లు ఒక పోలింగ్ కేంద్రంలో, మరికొందరివి మరోచోటా ఉన్నాయా?
ప్రతి ఒక్కరూ ఈ వివరాలు వెంటనే తనిఖీ చేసుకోండి
ఈనాడు, అమరావతి
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. సరైన నాయకుణ్ని ఎన్నుకోవాలంటే ముందుగా మీకు ఓటు ఉండాలి. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో పరిశీలించుకోండి. అందుకు చాలా విధానాలున్నాయి. వీటి ద్వారా తరచి చూసుకుని, ఒకవేళ జాబితాలో మీ పేరు లేకుంటే ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలో చూసుకోవచ్చు..
- https://ceoandhra.nic.in వెబ్సైట్లోకి వెళితే పై భాగంలో పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాలు అనే విభాగం కనిపిస్తుంది. వాటిపై క్లిక్ చేసి మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం ఎంపిక చేసుకోవాలి. ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్ ఫైల్స్లో ఉంటాయి. మీరు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తారో చూసుకుని ఆ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించి మీ పేరుందా? లేదా చూసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లోనే పై భాగంలో ‘సెర్చ్ యువర్ నేమ్’ అనే ఉప విభాగం ఉంటుంది.
ఫొటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య పొందుపరిచి
- https://voterportal.eci.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే...‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, మీ ‘ఫొటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య’ను పొందుపరిస్తే జాబితాలో మీ పేరు ఉందా? లేదా? ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది? సీరియల్ నంబర్ ఎంత వంటి వివరాలన్నీ కనిపిస్తాయి. మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య తెలియకపోతే.. ‘అడ్వాన్స్ సెర్చ్’ విభాగంలోకి వెళ్లి మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు పొందుపరిచి జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు.
మీ పేరు, వివరాలు నమోదు చేసి
- www.nvsp.in వెబ్సైట్లోకి వెళితే.. ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై డిటెయిల్స్’, ‘సెర్చ్ బై ఎపిక్ నంబర్’ అనే రెండు ఉప విభాగాలు ఉంటాయి. మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు నమోదు చేసి లేదా ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేసి ఓటరు జాబితాలో మీ పేరు ఉందా లేదా అన్నది తెలుసుకోవచ్చు.
ఓటరు హెల్ప్లైన్ మొబైల్ యాప్లో ఇలా
గూగుల్ ప్లే స్టోర్లో భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన Voter Helpline మొబైల్ యాప్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్ నంబర్, వివరాలతో రిజిష్టర్ చేసుకుని, లాగిన్ కావాలి. యాప్లోకి ప్రవేశించిన వెంటనే పై భాగంలో ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై బార్కోడ్, సెర్చ్ బై క్యూఆర్ కోడ్, సెర్చ్ బై డిటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్’ అనే నాలుగు విభాగాలు కనిపిస్తాయి. వీటిలో మొదటి రెండు విభాగాలకు సంబంధించి మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న బార్ కోడ్ను యాప్లో స్కాన్ చేయటం ద్వారా లేదా ఫొటో ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం ద్వారా ఓటరు జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవచ్చు. మీ పేరు, తండ్రి పేరు, వయసు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు పొందుపరచడం ద్వారా లేదా ఫొటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య పొందుపరచటం ద్వారా కూడా జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు.
పోలింగ్ కేంద్రాల వద్ద చూడొచ్చు...
ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి అధికారి (బీఎల్వో) ఉంటారు. వారి వద్ద ఆ కేంద్రం ఓటర్ల జాబితా ఉంటుంది. వాటిని పరిశీలించి మీ ఓటుందా లేదా చూసుకోవచ్చు.
ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే ఈ కింది పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
బీఎల్వోకు నేరుగా దరఖాస్తు
పద్ధతి 1: బూత్ స్థాయి అధికారి (బీఎల్వో)కి నేరుగా ఫారం-6 దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఈఆర్వో, ఏఈఆర్వో కార్యాలయాల్లో ఇవ్వొచ్చు
పద్ధతి 2: ప్రతి నియోజకవర్గానికీ డివిజన్ స్థాయి అధికారిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో)గా, ప్రతి మండలంలోనూ తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ను అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్వో)గా ఎన్నికల సంఘం నియమించింది. వారి కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించొచ్చు. వాటిపై విచారణ జరిపి, ఓటు హక్కు కల్పిస్తారు.
ఎన్వీఎస్పీ వెబ్సైట్లోకి వెళ్లి
పద్ధతి 3: www.nvsp.in వెబ్సైట్లోకి వెళ్లి ముందుగా మీ ఫోన్ నంబర్తో రిజిష్టర్ చేసుకుని, లాగిన్ కావాలి. వెబ్సైట్లోకి ప్రవేశించిన వెంటనే పక్కనే ‘రిజిష్టర్ యాజ్ ఏ న్యూ ఓటర్’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ‘ఫాం-6: అప్లికేషన్ ఫామ్ ఫర్ న్యూ ఓటర్స్’ అని వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఓ ఆన్లైన్ దరఖాస్తు వస్తుంది. అందులో పేర్కొన్న వివరాలన్నీ నింపి సబ్మిట్ చేయాలి. తర్వాత మీ ఫోన్ నంబర్కు ఒక రిఫరెన్స్ ఐడీ నంబరు వస్తుంది. దాని ఆధారంగా ఇదే వెబ్సైట్లో ఆ దరఖాస్తు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులోని వివరాలు ఆధారంగా బూత్ స్థాయి అధికారి మీ చిరునామాకు వచ్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఓటరు జాబితాలో అధికారులు మీ పేరు చేరుస్తారు.
న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ విభాగంలోకి ప్రవేశించి
పద్ధతి 4: https://voterportal.eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లి తొలుత మీ ఫోన్ నంబర్తో రిజిస్టర్ చేసుకుని, లాగిన్ కావాలి. వెబ్సైట్లోకి ప్రవేశించిన వెంటనే ‘న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్’ విభాగంపై క్లిక్ చేసుకుంటూ వెళ్లి... దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ నింపి సబ్మిట్ చేయొచ్చు.
ఓటరు హెల్ప్లైన్ మొబైల్యాప్తో
పద్ధతి 5: ప్లే స్టోర్లో భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన VoterHelpline అనే మొబైల్ యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నంబర్, వివరాలతో రిజిష్టర్ చేసుకుని, లాగిన్ కావాలి. ‘ఓటరు రిజిస్ట్రేషన్’ విభాగంలోకి వెళితే ‘న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్’ అనే విభాగం వస్తుంది. దానిపై క్లిక్ చేసి, అందులో అడిగిన వివరాలన్నీ నింపి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
పద్ధతి 6: https://ceoandhra.nic.in వెబ్సైట్లోకి వెళ్లి ఎన్వీఎస్పీ, ఓటర్ పోర్టల్ వెబ్సైట్ లింక్ల్లోకి వెళ్లొచ్చు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సందేహాలుంటే: ఓటు హక్కు నమోదు సహా ఇతరత్రా ఏవైనా సందేహాలుంటే 1950 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసలైన ప్రజాసేవకుడు కాటన్
నాటి బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకపోయినా.. పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు అనువుగా ధవళేశ్వరం ఆనకట్ట, కాలువలు నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. -
పోలీసు వలయంలో పల్నాడు
రెండురోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. -
ఆ నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక బలగాలు
పోలింగ్ తర్వాత హింస చెలరేగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
పోలింగ్ తర్వాత.. నిప్పు రాజేస్తోందెవరు?
పోలింగ్ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండను నియంత్రించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
సంక్షిప్త వార్తలు (8)
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యం పెంచడానికి ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) షెడ్యూల్ ప్రకటించిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
సుప్రీం చెప్పినా.. మేమెందుకు వింటాం!
‘‘ప్రతివాది సమర్పించిన ఫొటోల్లో తేదీలు, సమయం, అక్షాంశాలు, రేఖాంశాలు చూస్తే.. యంత్రాలతో ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించినప్పటికీ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయనేది ప్రాథమికంగా తెలుస్తోంది. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
117 నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే పోస్టల్ బ్యాలట్లతో కలిపి 2.09% పెరిగింది. మొత్తం 3.33 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే అధికారి అయిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. -
అసలేం జరుగుతోంది?
పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్రూంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. తిరుపతిలో స్ట్రాంగ్రూంను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
రాష్ట్రంలో 15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఒంగోలు లోక్సభ పరిధిలో 87.06% మంది ఓటర్లు కదం తొక్కారు. -
పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తప్పని నిరూపించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. -
నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం సందర్శించనున్నారు. -
వైకాపా నేతల రాజశ్యామల సహస్ర చండీయాగం
జగన్కు ఎన్నికల్లో విజయం చేకూరాలని వైకాపా నేతలు ఆరిమండ వరప్రసాద రెడ్డి, పడమట సురేష్బాబు సీఎం నివాసం పక్కన శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించారు. -
గత ఎన్నికల కంటే 1.82 లక్షలు అధికంగా పోస్టల్ బ్యాలట్ ఓట్లు
రాష్ట్రంలో 2019 కంటే ఈ ఎన్నికల్లో 1,81,839 పోస్టల్ బ్యాలట్ ఓట్లు అధికంగా నమోదయ్యాయి. 2019 ఎన్నికల్లో 2,62,379 మంది పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోగా.. ఈ ఎన్నికల్లో 4,44,218 మంది ఓటేశారు. -
ఆగని అధికార అరాచకాలు
తెదేపా నాయకులపై అధికార అండతో వైకాపా నాయకుల బెదిరింపులు, కేసులు, రిటర్న్గిఫ్టు ఉంటుందనే హెచ్చరికలు.. వెరసి ఎంతో ప్రశాంతంగా ఉండే నంద్యాల జిల్లా డోన్లో కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
ఆదివాసీ గ్రామంలో ప్రబలిన అతిసారం
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కురుముల తోగు అనే ఆదివాసీ గ్రామంలో అతిసారంతో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే