Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్-3
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లి ఉపరితలానికి మరింత దగ్గరగా వెళ్లింది. బుధవారం తాము చేపట్టిన కీలక విన్యాసంతో చంద్రయాన్-3 కక్ష్య.. 174 కి.మీ. × 1437 కి.మీ.కి తగ్గిందని ఇస్రో ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ నెల 14న తదుపరి విన్యాసం చేపట్టనున్నట్లు తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రాయలసీమకు నీటి కటకట
రాయలసీమ ప్రయోజనాలు కాపాడతామని..అక్కడి రైతుల శ్రేయస్సే తమకు ముఖ్యమని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి జగన్ ఆగస్టు రెండోవారం వచ్చినా ఆయకట్టుకు నీటిని విడుదల చేయించలేకపోయారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 863 అడుగుల నీటిమట్టం వద్ద 118.054 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఎగువన జలాశయాలు దాదాపుగా నిండటానికి సమీపంలో ఉన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. అక్కరకు రాని ఆసుపత్రులు
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఆంధ్రప్రదేశ్లో ఎంప్యానల్ అయిన 1,421 ఆసుపత్రుల్లో 524 ఆసుపత్రులు ఎలాంటి సేవలూ అందించడం లేదని కాగ్ పేర్కొంది. వాటి నుంచి ఒక్క క్లెయిమ్ కూడా రాలేదని తెలిపింది. మరో 81 ఆసుపత్రుల నుంచి 5 వరకు మాత్రమే క్లెయిమ్లు వచ్చినట్లు వెల్లడించింది. దీన్ని బట్టి ఇక్కడ ఎంప్యానల్డ్ ఆసుపత్రులు పూర్తిస్థాయిలో పనిచేయడంలేదని తెలుస్తున్నట్లు కాగ్ అభిప్రాయపడింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఎల్ అండ్ టీకే విమానాశ్రయ మెట్రో!
విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు టెండర్ ఎల్ అండ్ టీ సంస్థకే ఖరారైనట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండో దశకు గ్లోబల్ టెండర్లు పిలవగా.. రెండు బిడ్లు మాత్రమే దాఖలయ్యాయి. ఎల్ అండ్ టీ లిమిటెడ్, ఎన్సీసీ లిమిటెడ్ మాత్రమే పోటీపడ్డాయి. మెట్రో నిబంధనల్లో తొలిసారిగా పొందుపర్చిన ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ)లో అనుభవం, అర్హత ఉన్న ఎల్ అండ్ టీకే టెండర్ ఖరారైనట్లు ఒక అధికారి తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. గృహలక్ష్మికి దరఖాస్తుల వెల్లువ!
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల్లో వివిధ స్థాయుల్లో దరఖాస్తుల స్వీకరణ ముమ్మరంగా సాగుతోంది. సొంత స్థలం ఉండి, ఇప్పటివరకు ఆర్సీసీ స్లాబ్ ఇల్లు లేని పేదలు ఈ పథకం కింద ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్న సంగతి తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. అమ్మాయిని కనీసం డిగ్రీ చదివిద్దాం!
తమ అమ్మాయి ఉన్నత విద్య అభ్యసించాలని ఊర్లలోనూ అత్యధిక శాతం తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది. ఆడపిల్లల్ని కనీసం గ్రాడ్యుయేషన్ చదివించాలని గ్రామీణ భారత్లో కనీసం 78% తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లు నిర్ధారించింది. 20 రాష్ట్రాల్లో 6,629 గ్రామీణ కుటుంబాలపై ట్రాన్స్ఫార్మింగ్ రూరల్ ఇండియా ఫౌండేషన్ (టీఆర్ఎఫ్ఐ) నిర్వహించిన సర్వే నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. పాము కాటేసిన బాలికను బతికిస్తానని పేడ కప్పి..
ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ మంత్ర, తంత్రాల వైద్యాలపై జనం నమ్మకాలు తగ్గట్లేదు. ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పుర్ జిల్లా థానాకాంట్ సమీప గ్రామంలో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. మంగళ్సింగ్ కుటుంబం ఆదివారం రాత్రి తమ గుడిసెలో నిద్రపోతుండగా.. ఆరేళ్ల కుమార్తెను పాటు కాటేసింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. హిమాలయాలకు పయనమైన రజనీకాంత్
సూపర్స్టార్ రజనీకాంత్ హిమాలయ యాత్రకు బయలుదేరారు. నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్’ గురువారం తెరపైకి రానుంది. ఈ చిత్రంలో మోహన్లాల్, జాకీష్రాఫ్, శివరాజ్కుమార్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. సాధారణంగా తన చిత్రం విడుదలయ్యే సమయంలో రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లడం పరిపాటి. ఇందులో భాగంగా ఆయన బుధవారం హిమాలయాలకు పయనమై వెళ్లారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. మా రాష్ట్రం పేరును కేరళం అని మార్చండి
తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కేరళ శాసనసభ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని బుధవారం పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించింది. కొత్త పేరును అధికారికంగా మార్పుచేయాలని కోరుతూ ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు. పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సభలో ప్రవేశపెట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. జైల్లో ఉండలేను.. ఇక్కడి నుంచి తీసుకెళ్లండి
తోషాఖానా కేసులో దోషిగా నిరూపితమై అటక్ జైలులో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.. కారాగారంలోని వసతులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మూడో తరగతి ఖైదీలను ఉంచే గదిలో తనను ఉంచారని, పురుగులు ఇబ్బంది పెడుతున్నాయని తనను కలవడానికి వచ్చిన న్యాయవాది నయీమ్ హైదర్కు ఇమ్రాన్ తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు