Facebook Love: మొన్న సీమా.. నిన్న అంజు.. ఇవాళ జూలీ.. సరిహద్దులు దాటుతున్న ‘ప్రేమ’
ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని పెళ్లాడేందుకు ఓ మహిళ బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చేసింది. అయితే, కుటుంబ కలహాలతో అసలు విషయం బయటపడింది.
ఇంటర్నెట్డెస్క్: సోషల్ మీడియా ప్రేమలు.. సరిహద్దులు దాటి పెళ్లిళ్లు.. ఈ తరహా ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్థాన్కు చెందిన సీమా హైదర్ అనే వివాహిత పబ్జీలో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు భారత్ వచ్చిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అక్కడికి రెండు రోజుల వ్యవధిలోనే భారత్కు చెందిన అంజూ అనే వివాహిత తన ప్రియుడు నస్రుల్లాను కలుసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లి ఫాతిమాగా పేరు మార్చుకొని అతడినే వివాహం చేసుకుంది. వీరి ప్రేమకు ఫేస్బుక్కే వేదిక. తాజాగా ఉత్తర్ప్రదేశ్కు చెందిన అజయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకునేందుకు జూలీ అనే మహిళ బంగ్లాదేశ్ నుంచి వచ్చేసింది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం కూడా జరిగిపోయింది. అయితే, కుటుంబ కలహాలతో అసలు విషయం బయటపడింది. బంగ్లాదేశ్లో ఉన్న తన కుమారుడిని విడిపించాల్సిందిగా అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజా విషయం వెలుగులోకి వచ్చింది.
ఏంటీ ప్రేమ కథ?
ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్కు చెందిన అజయ్కి బంగ్లాదేశ్కు చెందిన జూలీతో 2017లో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. 2022లో జూలీ భర్త చనిపోయాడు. దీంతో జూలీని వివాహం చేసుకోవాలని అజయ్ నిర్ణయించుకున్నాడు. అతడి సూచనమేరకు బంగ్లాదేశ్ నుంచి ఆమె భారత్కు వచ్చేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో వారిద్దరి పెళ్లి జరిగింది. అయితే, వృత్తి రీత్యా అతడు కర్ణాటకలో ఉండాల్సి రావడంతో.. భార్యను ఇంటి వద్దనే ఉంచాడు. కొన్నాళ్లకు అత్తాకోడళ్ల మధ్య గొడవలు తలెత్తాయి. అవి తీవ్రం కావడంతో కోపంతో జూలీ తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొడుకు వచ్చి ప్రశ్నించగా అతడిని కూడా ఇంటి నుంచి వెళ్లిపోవాలని తల్లి వార్నింగ్ ఇచ్చింది. దీంతో అజయ్ కోపంతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.
పాక్ ప్రియుణ్ని పెళ్లాడిన భారత మహిళ
తాజాగా బంగ్లాదేశ్లో తన కొడుకు నరకయాతన అనుభవిస్తున్నాడంటూ రక్తమోడుతున్న ఫొటోతో వెళ్లి అతడి తల్లి ఉత్తర్ప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని భారత్కు రప్పించారు. అయితే, తాను బంగ్లాదేశ్ వెళ్లలేదని, పశ్చిమబెంగాల్ సరిహద్దులో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నానని చెప్పాడు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలుజారి పడిపోయానని, దీంతో తలకు బలంగా గాయమైందని పోలీసులకు తెలిపాడు. నిశితంగా ప్రశ్నించగా తాను బంగ్లాదేశ్కు వెళ్లినట్లు అంగీకరించాడు. అయితే, అక్కడ ఏం జరిగింది? గాయాలకు కారణాలేంటి? అనే విషయాలు మాత్రం బయటకి రాలేదు. మీడియాతో తాను పశ్చిమబెంగాల్ సరిహద్దులోనే ఉన్నట్లు అజయ్ చెప్పుకొచ్చాడు. పోలీసులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు యూపీ పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
India-China: సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. -
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు హైకోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మ్యానువల్ ఫర్ మామ్స్ టు బి’ పుస్తకంలో బైబిల్ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టఫర్ అంథోనీ వేసిన పిటిషన్లో భాగంగా ఈ నోటీసులను పంపింది. -
ఎడిట్ చేసిన వీడియోను గవర్నర్ చూపించారు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎడిట్ చేసిన వీడియోను ఆయన సాధారణ పౌరులకు చూపించారని ఆరోపించారు. -
ఆయనకు 84.. ఆమెకు 66
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చించోలి రహీమాపుర్కు చెందిన విఠల్ ఖండారే (84)కు ఆయన కుమారులు, కుమార్తెలు 66 ఏళ్ల వృద్ధురాలితో ఘనంగా రెండోపెళ్లి జరిపించారు. -
సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ శనివారం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారు. ముస్సోరీలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. -
4 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తే అథ్లెట్లకు దీర్ఘాయుష్షు
నాలుగు నిమిషాల్లోనే ఒక మైలు దూరం పరుగులు తీసే అథ్లెట్లు.. వారి సాధారణ ఆయుష్షు కన్నా ఐదేళ్లు ఎక్కువగా జీవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
సైబర్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) కీలక నిర్ణయం తీసుకుంది. -
వారణాసి గంగా హారతిలో అమిత్ షా, యోగి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్లో జరిగిన గంగా హారతికి హాజరయ్యారు. -
చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు
హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం శుక్రవారం తెరుచుకోవడంతో మొదటిరోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి పెద్దఎత్తున భక్తులు చేరుకొంటున్నారు. -
ఓ ఆదివాసీ ప్రశ్నకు వ్యంగ్యంగా బదులిచ్చానంతే
రత్లాం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా తాజాగా చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
కుంకుమ పువ్వుకు యుద్ధం సెగ
సుగంధ ద్రవ్యాల రారాణి ‘కుంకుమ పువ్వు’ ధరలకు పశ్చిమాసియా యుద్ధం సెగలు తగులుతున్నాయి. దేశంలో చిల్లర (రిటైల్) మార్కెట్లో కేజీ ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. -
నింగిలో రంగురంగుల అరోరాలు
చాలా బలమైన సౌర తుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది.
తాజా వార్తలు (Latest News)
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ