DK Shivakumar: మా ఇంట్లోనూ బోరుబావి ఎండిపోయింది: నీటి సంక్షోభంపై డీకే
నీటి కొరత బెంగళూరు వాసులను పీడిస్తోంది. ఈ సంక్షోభంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమర్ స్పందించారు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో నీటి సంక్షోభం నెలకొంది. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కొరతతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. నీటి సమస్యపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar)స్పందించారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బెంగళూరు నీటి ఎద్దడితో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మా నివాసంలోని బోరు బావి కూడా ఎండిపోయింది. నీటి డిమాండ్ను తీర్చడానికి కాంగ్రెస్ సర్కారు తీవ్రంగా యత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి సరఫరా జరిగేలా చూస్తాం. సీఎం, రెవెన్యూ మంత్రి, ఆర్డీపీఆర్ మంత్రి, ఇతర మంత్రులతో నీటి సమస్యపై చర్చలు జరిపాం. పట్టణాలకు 15 కిలోమీటర్ల పరిధిలోని వనరులను వినియోగించుకుని నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించాం. బెంగళూరు నగరానికి రామనగర, హోస్కోట్, చన్నపట్న, మాగాడి వంటి పట్టణాల నుంచి ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తాయి’’ అని హామీ ఇచ్చారు.
నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్, పర్యవేక్షణకు సెక్యూరిటీ.. హౌసింగ్ సొసైటీ నిర్ణయం!
ఈ నేపథ్యంలో కొందరు నీటి ట్యాంకర్ల యజమానులు ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేయడంపై ఆయన మాట్లాడారు. ‘‘కొన్ని ట్యాంకర్లు రూ. 600కు నీటి సరఫరా చేస్తుండగా.. మరికొన్ని రూ.3 వేల వరకు ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి. నీటి ధరలను ప్రామాణికంగా ఉంచేందుకు అన్ని నీటి ట్యాంకర్ల యజమానులు అధికారుల వద్ద వివరాలను నమోదు చేసుకోవాలని కోరాం. ప్రయాణించే దూరాన్ని బట్టి ధర ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
బెంగళూరులో నీటి కొరతను తీర్చలేని పరిస్థితులకు కేంద్రంలోని భాజపా కూడా కారణమేనంటూ శివకుమార్ ఆరోపించారు. నగరంలో మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని పాదయాత్ర చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు అనుమతులు ఇవ్వాలని కోరారు.
అటు రాష్ట్ర సీఎం కార్యాలయం వద్ద నీటి ట్యాంకర్లు కనిపించడం నీటి సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది. వేసవిలో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇక నేను పెళ్లి చేసుకోవాలి’: రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఆయన ఏమని సమాధానం ఇచ్చారంటే..? -
స్వాతీమాలీవాల్పై దాడి..! దిల్లీ సీఎం నివాసం బాక్సింగ్ రింగ్లా మారిందన్న భాజపా
ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్ (Swati Maliwal) ఆరోపించినట్లుగా వెలుగులోకి వచ్చిన కథనాలపై భాజపా స్పందించింది. -
‘దుమ్మురేపిన’ గాలివాన.. ముంబయిలో మెట్రో, సబ్అర్బన్ సర్వీసులకు అంతరాయం
ముంబయిలో పలు ప్రాంతాల్లో వర్షంతోపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మెట్రోతోపాటు లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. -
ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం
జబ్బుపడిన ఓ ఏనుగును, దాని పిల్లను కాపాడేందుకుగానూ ‘వన్తార’ సిబ్బంది ఏకంగా 3500 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. -
‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’
లైంగిక వేధింపుల వ్యవహారంలో హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన షాకింగ్ విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. -
స్ట్రెచ్చర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
క్యాన్సర్తో పోరాడుతున్న బిహార్కు చెందిన ఓ మహిళ లేవలేని స్థితిలోనూ తన ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు. -
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా ఇప్పటి వరకు పనికొచ్చే ఆధారాలు, సమాచారం ఏదీ ఇవ్వలేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. -
సీఎం నివాసంలో ఎంపీ స్వాతీమాలీవాల్పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి !
దిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆయన పార్టీ ఆప్ మహిళా నేత స్వాతీమాలీవాల్పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. -
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
PM Modi: బిహార్లోని గురుద్వారలో ప్రధాని మోదీ సేవ చేశారు. భక్తులకు లంగర్ వడ్డించారు. -
చైనాతో పోటీ పడటం నేర్చుకోవాలి
చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. -
యోగా చిచ్చర పిడుగు హర్షిక
కష్టమైన యోగాసనాలను సులువుగా వేస్తూ అబ్బురపరుస్తోంది ఓ బాలిక. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. -
ఆసుపత్రికి తండ్రి భౌతికకాయం వితరణ.. నాన్న చివరి కోరికను నెరవేర్చిన కుమారులు
చనిపోయిన తరవాత తన శరీరాన్ని ఏదైనా వైద్యవిద్యా సంస్థకు దానం చేయాలన్న తండ్రి మాటను ఆ కుమారులు నెరవేర్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. -
సంక్షిప్త వార్తలు (3)
హవాలా కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. -
దర్శనమిచ్చిన బద్రీనాథుడు
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. -
దిల్లీలో 20 ఆసుపత్రులకు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 20 ఆసుపత్రులు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ), ఉత్తర రైల్వే సీపీఆర్వో కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇక నేను పెళ్లి చేసుకోవాలి’: రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్
-
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
-
గుజరాత్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం..
-
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?