Supreme Court: ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మనీలాండరింగ్ కేసుల దర్యాప్తుల సమయంలో ఈడీ (ED) అధికారులు చేపడుతున్న చర్యలపై సుప్రీంకోర్టు (Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని సూచించింది.
దిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల దర్యాప్తుల సమయంలో ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని, చట్టప్రకారం వ్యవహరించాలని సూచించింది. గురుగ్రామ్కు చెందిన ఎం3ఎం కంపెనీపై మనీలాండరింగ్ కేసు (money laundering case)లో ఆ కంపెనీ డైరెక్టర్లు బసంత్ బన్సల్, పంకజ్ బన్సల్ అరెస్టును కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఓ అవినీతికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎం3ఎం డైరెక్టర్లు బసంత్ బన్సల్, పంకజ్ బన్సల్పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే జూన్ 1వ తేదీన ఈడీ (ED) అధికారులు ఎం3ఎం గ్రూప్ (M3M Group), బన్సల్ సోదరుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. దీంతో వీరు జూన్ 9న పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించగా.. జులై 5 వరకు వారికి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించింది. అయితే, జూన్ 14న వారిని ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది.
సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
ఈ అరెస్టును సవాలు చేస్తూ బన్సల్ సోదరులు పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కోర్టు వేసింది. దీంతో వారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపి వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఆ ఉత్తర్వుల కాపీ తాజాగా బయటికొచ్చింది. కాగా.. విచారణ సమయంలో ఈడీ అధికారుల చర్యలపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
‘‘ఈడీ ప్రతి చర్య పాదర్శకంగా, ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. కానీ, ఈ కేసులో దర్యాప్తు సంస్థ తన అధికారాలను, విధులను అనుసరించడంలో విఫలమైనట్లు తేలింది. ఈడీ ప్రతీకారపూరిత చర్యలకు పాల్పడకూడదు. అత్యంత పారదర్శకంగా, న్యాయంగా వ్యవహరించాలి. ఈడీ అడిగిన ప్రశ్నలకు నిందితులు సమాధానాలు చెప్పలేదన్న కారణంతో వారిని అరెస్టు చేయడం సరికాదు. మనీలాండరింగ్ చట్టం కింద వారు నేరానికి పాల్పడ్డారని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలను సేకరించి అరెస్టు చేయాలి. అంతేగానీ, సమన్లకు సరిగా స్పందించలేదని ఎవరినీ అరెస్టు చేయకూడదు. అంతేగాక, అరెస్టు సమయంలో అందుకు గల కారణాలను కూడా నిందితులకు లిఖితపూర్వకంగా అందించాలి’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ కేసులో బన్సల్ సోదరుల అరెస్టు చట్ట వ్యతిరేకమన్న ధర్మాసనం.. వారిని తక్షణమే విడుదల చేయాలని ఈడీని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్టవిరుద్ధం
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. -
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కమలా బేనీవాల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనీవాల్ కన్నుమూశారు. ఆమె వయసు 97 ఏళ్లు. -
డిజిటల్ బాటలో పయనిస్తున్నాం
భారతీయ సుప్రీంకోర్టు 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించిందని, 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలు అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
భారత మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస క్షమాపణలు
భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె(46) మృతికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంతాపం తెలియజేసింది. గాజాలో ఐరాస తరఫున విధులు నిర్వహిస్తూ కాల్పుల్లో కాలె మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అటవీ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు
ఉత్తరాఖండ్లోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల నియంత్రణలో వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఉసురు తీస్తున్న వడగాలులు
వడగాలుల కారణంగా గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షన్నర మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. -
భారత నావికుల విడుదలకు ఇరాన్కు వినతి
గత ఎనిమిది నెలల్లో వివిధ అభియోగాల కింద నాలుగు వేర్వేరు రవాణా నౌకలలో అరెస్టు చేసిన 40 మంది భారతీయ నావికులను విడుదల చేయాల్సిందిగా ఇరాన్ను భారత్ కోరినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. -
6.7%కు తగ్గిన నిరుద్యోగిత
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో గత త్రైమాసికంలో నిరుద్యోగిత స్వల్పంగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 6.8%గా ఉన్న ఈ రేటు.. 2024 జనవరి-మార్చిలో 6.7%కు పరిమితమైందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (6)
వారణాసి లోక్సభ స్థానంలో నామినేషన్ దాఖలు చేసే గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. -
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. -
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. -
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు
తల్లి గర్భంలో ఉన్న శిశువుకూ జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని, ఏ చట్టమూ దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం మంజూరు షురూ
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరికి తొలి విడతలో భారత పౌరసత్వం మంజూరు చేసింది.