సింహభాగం భాజపాకే..
ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు అందిన మొత్తాల మరో జాబితా బహిర్గతమైంది. భాజపాకు మొత్తంమీద రూ.8,718.5 కోట్లు విరాళంగా వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఆదివారం అందుబాటులోకి తెచ్చిన డేటాను బట్టి తెలుస్తోంది.
ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం రూ.8,718.5 కోట్లు
ఇతర పార్టీలకూ గణనీయ స్థాయిలోనే నిధులు
ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి డీఎంకేకు రూ.509 కోట్లు
ఈసీ వెబ్సైట్లో తాజా గణాంకాలు
దిల్లీ: ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు అందిన మొత్తాల మరో జాబితా బహిర్గతమైంది. భాజపాకు మొత్తంమీద రూ.8,718.5 కోట్లు విరాళంగా వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఆదివారం అందుబాటులోకి తెచ్చిన డేటాను బట్టి తెలుస్తోంది. ఎన్నికల బాండ్ల పథకం ప్రారంభమైన 2018 మార్చి నుంచి రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న బాండ్ల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. ఇందులో గుర్తింపు పొందిన, పొందని 523 రాజకీయ పార్టీల సమాచారం ఉంది. ఈ డేటాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వెల్లడించిన 2019 ఏప్రిల్ 12, 2024 జనవరి 24 మధ్య సమాచారాన్ని పోల్చుకుంటే.. రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాల మొత్తాలు మరింతగా పెరిగాయి.
తాజా లెక్క ప్రకారం.. 2019 ఏప్రిల్ 12కు ముందు భాజపాకు రూ.2,658.35 కోట్ల విలువైన బాండ్లు వచ్చాయి. అంతేకాదు.. ఆ కాలంలో మొత్తం రాజకీయ పార్టీలకు లభించిన విరాళాల్లో కాషాయ పార్టీకే 66 శాతం దక్కాయి. అదే సమయంలో కాంగ్రెస్కు రూ.530.1 కోట్లు వచ్చాయి. హస్తం పార్టీ విరాళాల మొత్తం రూ.1,864.45 కోట్లుగా తేలింది. 2019 ఏప్రిల్ 12కు ముందు తృణమూల్ కాంగ్రెస్ రూ.97.28 కోట్ల విలువైన బాండ్లను నగదుగా మార్చుకుంది. ఆ పార్టీ మొత్తం విరాళాలు రూ.1,494.28 కోట్లు. భారాస ఎలక్టోరల్ బాండ్ల కింద మొత్తంమీద రూ.1,408.20 కోట్ల విరాళాలు అందుకుంది.
- ఎన్నికల బాండ్లతో తమకు ఒక్క రూపాయి కూడా విరాళంగా అందలేదని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్కు తెలిపాయి. ఇందులో బహుజన్ సమాజ్ పార్టీ, ఏఐఎంఐఎం, ఇండియన్ నేషనల్ లోక్దళ్, మేఘాలయకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి.
- తమకు రూ.10 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళంగా వచ్చాయని.. కానీ దాత ఎవరో తెలియదని జేడీ (యూ) పేర్కొంది. 2019లో పార్టీ కార్యాలయానికి ఓ కవరులో బాండు పత్రాలు వచ్చాయని, నగదుగా మార్చుకున్నామని ఈసీకి తెలిపింది.
- ఈసీ డేటా ప్రకారం.. తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకేకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిఘాలో ఉన్న ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ రూ.509 కోట్ల విలువైన బాండ్లను విరాళంగా ఇచ్చింది. ఆ సంస్థతోపాటు.. మేఘా ఇంజినీరింగ్ (రూ.105 కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ.14 కోట్లు), సన్ టీవీ (రూ.100 కోట్లు) కూడా డీఎంకేకు విరాళాలు అందించాయి. ఫ్యూచర్ గేమింగ్ దేశంలో అత్యధికంగా రూ.1,368 కోట్లు విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ఇందులో రూ.509 కోట్లు డీఎంకేకు ఇవ్వగా మిగిలిన రూ.859 కోట్లను ఆ సంస్థ ఏ రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చిందో స్పష్టత లేదు.
- జేడీ(ఎస్)కు రూ.89.75 కోట్ల విలువైన బాండ్లు లభించాయి. ఇందులో మేఘా ఇంజినీరింగ్ రూ.50 కోట్ల బాండ్లను విరాళంగా ఇచ్చింది.
- ఎన్నికల బాండ్ల పథకం ద్వారా విరాళాలు స్వీకరించకూడదని తాము విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని సీపీఐ, సీపీఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ-ఎంఎల్ పార్టీలు ఈసీకి తెలిపాయి.
ఎన్నికల బాండ్లు ఒక ప్రయోగం: ఆరెస్సెస్
నాగ్పుర్: ఎన్నికల బాండ్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కీలక వ్యాఖ్యలు చేశారు. బాండ్ల విధానం ఒక ‘ప్రయోగం’ మాత్రమేనని, ఇవి ఉపయోగకరమా కాదా అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
International Space Station: చెన్నై గగనతలంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కన్పించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
వలపువలలో గుజరాత్ యువకుడు
పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు భారీ ఎత్తున భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్లో ఓ యువకుడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
సుస్థిర నాయకత్వం నేటి అవసరం
ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం, అధికార ప్రాబల్యం చేతులు మారే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతాయనీ, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణత, సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. -
దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ పుణెలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. -
అహ్మదాబాద్ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్లో..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. -
మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం
మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్ శుక్రవారం వెల్లడించారు. -
త్వరలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలు
అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాలపై భారత్ జరిపిన తాజా పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాలº్ల భాగం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీతో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ఆర్గనైజేషన్స్ చట్టం
ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్ కంట్రోల్, డిసిప్లైన్) చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు. ఆ ప్రకారం ఈ నెల 10 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. -
బసవేశ్వరుని ఆశయసిద్ధికి కృషి : మోదీ
పన్నెండో శతాబ్దానికి చెదిన రాజనీతిజ్ఞుడు, కవి, తత్వవేత్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
-
కడపలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
-
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
-
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా