Auction: ‘కృష్ణా హోటల్‌’@ రూ.12.7 కోట్లు!

ప్రముఖ భారతీయ చిత్రకారుడు భూపేన్‌ ఖఖర్‌ వర్ణచిత్రం ‘కృష్ణా హోటల్‌’ అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. సోథ్‌ బే సంస్థ లండన్‌లో నిర్వహించిన వేలంలో ఈ చిత్తరువును రూ.12.7కోట్లకు

Published : 29 Oct 2021 08:35 IST

లండన్‌: ప్రముఖ భారతీయ చిత్రకారుడు భూపేన్‌ ఖఖర్‌ వర్ణచిత్రం ‘కృష్ణా హోటల్‌’ అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. సోథ్‌ బే సంస్థ లండన్‌లో నిర్వహించిన వేలంలో ఈ చిత్తరువును రూ.12.7కోట్లకు విక్రయించినట్లు అమెరికాకు చెందిన ఆర్కిటెక్ట్‌ క్రిస్టోఫర్‌ బెనింగర్‌ తెలిపారు. తాము అంచనావేసిన మొత్తం కన్నా ఆరు రెట్లు అధికంగా ధర లభించిందని హర్షం వ్యక్తం చేశారు. బెనింగర్‌ ఈ పెయింటింగ్‌ను 1970లో అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఓ వేలంలో సొంతం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని