India Corona : 70వేల సమీపంలోకి క్రియాశీల కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు రోజులుగా 12వేలకుపైగా నమోదైన కొత్త కేసులు.

Published : 18 Jun 2022 10:25 IST

దిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు రోజులుగా 12వేలకుపైగా నమోదైన కొత్త కేసులు.. తాజాగా 13 వేలు దాటాయి. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతూ 70 వేలకు సమీపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* గడిచిన 24 గంటల్లో  4,84,924 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 13,216  కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 2.73 శాతానికి పెరిగింది.

*దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో ఎక్కువ శాతం మహారాష్ట్ర, దిల్లీ, కేరళ నుంచే ఉంటున్నాయి. నిన్న మహారాష్ట్రలో కొత్తగా 4,165 కేసులు రాగా.. వాటిలో ఒక్క ముంబయిలోనే 2,255 కేసులు నమోదయ్యాయి. దిల్లీలో 1797, కేరళలో 3,253 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

* నిన్న దేశవ్యాప్తంగా 23 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,24,840కు చేరింది.

* నిన్న 8148 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.26 కోట్లు(98.63%) దాటింది.

* గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉంటుండటంతో క్రియాశీల కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 68,108 యాక్టివ్‌ కేసులు (0.16%) ఉన్నాయి.

* దేశవ్యాప్తంగా నిన్న 14,99,824 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకూ 196 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని