సైన్యం గుప్పిట్లో మయన్మార్
మయన్మార్ సాయుధ బలగాల కవాతులతో దద్దరిల్ల్లుతోంది.
ఇంటర్నెట్.. మళ్లీ కట్
యాంగూన్: అతిపెద్ద నగరం యాంగూన్తో సహా మయన్మార్ సాయుధ బలగాల కవాతులతో దద్దరిల్ల్లుతోంది. ఆదివారం అర్థరాత్రి దాటిన అనంతరం దేశంలో ఇంటర్నెట్ సదుపాయం నిలిచిపోయింది. ప్రదర్శనల నిషేధం, ప్రజాహక్కుల రద్దు వంటి సైనిక ప్రభుత్వ ఆదేశాలపై నిరసనలు హోరెత్తాయి. మరో వైపు ప్రజలను, నిరసనకారులను భయభ్రాంతులను చేసేందుకు సైనిక ప్రభుత్వం ఏకంగా 23 వేల మంది ఖైదీలను విడుదల చేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాత్రివేళ అలజడులు సృష్టించేందుకు గాను.. సైనిక ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హక్కులపై నిషేధం, కర్ఫ్యూ అమలు
గతేడాది జరిగిన ఎన్నికల్లో అవకతవకలపై సక్రమ విచారణ జరపలేదన్న సాకుతో.. సైన్యం ప్రభుత్వాన్ని కూలదోసి, నాయకురాలు ఆంగ్ సాన్ సూకితో సహా పలువురు మంత్రులు, రాజకీయ నేతలను అరెస్టు చేసింది. ఇక దేశంలో చెలరేగుతున్న నిరసనలపై ఉక్కు పాదం మోపేందుకు పలు చర్యలు చేపడుతోంది. ఆంగ్ సాన్ సూకిని సోమవారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టాల్సి ఉండగా.. ఇది ఒక రోజు ఆలస్యం కావచ్చని సమాచారం. ఈ క్రమంలో నేడు తెల్లవారు ఝామున ఒంటి గంట నుంచి, ఉదయం తొమ్మిది గంటల వరకు ఇంటర్నెట్ను నిలిపారు. బహిరంగ ప్రదేశాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటాన్ని ప్రభుత్వం నిషేధించింది. అంతేకాకుండా రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తోంది.
ప్రభుత్వ, రైల్వే సిబ్బంది కూడా..
పలు పౌర హక్కులను రద్దు చేస్తూ సైనిక నేత సెన్ జెన్ మిన్ యాంగ్ లయింగ్ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. ఆదివారం నిరసనలు మిన్నంటాయి. నిబంధనలను అతిక్రమించిన వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామన్న హెచ్చరికలను బేఖాతరు చేస్తూ దేశ రాజధాని నయాపైటాతో సహా పలు ప్రాంతాల్లో లక్షలాది పౌరులు వీధులకెక్కారు. ఈ నిరసనల్లో ప్రభుత్వోద్యోగులు చురుగ్గా పాల్గోవటం గమనార్హం. వారితో చేయి కలిపిన రైల్వే సిబ్బంది కూడా సమ్మెచేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. విడుదలైన ఖైదీలను ఎదుర్కొనేందుకు మయన్మార్ ప్రజలు ఏకమై, తమ తమ ప్రాంతాల్లో సొంత రక్షక దళాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
అంతర్జాతీయ ఖండన
ఇదిలా ఉండగా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మద్దతుగా ప్రదర్శనలు చేస్తున్న వారిపై హింసాత్మక చర్యలను మానుకోవాలని అమెరికా, కెనడాలతో సహా పన్నెండు యూరోపియన్ దేశాల రాయబారులు మయన్మార్ సైనిక ప్రభుత్వానికి హితవు పలికారు. అంతేకాకుండా ఆ దేశంలో చోటుచేసుకున్న రాజకీయ నేతల అరెస్టులను కూడా వారు ఖండించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొలిటికల్ యాడ్లలో భాజపా దూకుడు.. ఈసీ లిస్టులో టాప్
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు అన్ని మీడియా మాధ్యమాల్లో భారీ స్థాయిలో ప్రకటనలు ఇస్తున్నాయి. -
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా తిహాడ్ జైలుకు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ
ప్రజ్వల్ వీడియోలు ఉన్న పెన్డ్రైవ్లను లీక్ చేయడం వెనక ‘భారీ తిమింగలం’ ఉందని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. -
హోర్డింగ్ కుప్పకూలిన ఘటన.. వెలుగులోకి పలు కీలక విషయాలు
Mumbai hoarding collapse: గాలివానలకు హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో యాడ్ ఏజెన్సీ యజమాని గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
Swati Maliwal: సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి జరగడం నిజమేనని ఆ పార్టీ ఎంపీ సంజయ్సింగ్ అంగీకరించారు. -
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ
దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Excise Policy Scam Case) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ఆద్మీ పార్టీ కూడా నిందితుల జాబితాలో చేరనుంది. -
సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్’ డ్రోన్ల కలకలం!
దేశంలో లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 60 రోజుల వ్యవధిలో సరిహద్దు భద్రతా దళం.. 49 డ్రోన్లను కూల్చివేసింది. -
‘ఆ మాటలు సరికాదు’: ఐఎంఏ చీఫ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) అధ్యక్షుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు (Supreme Court) .. మాట్లాడేటప్పుడు నిగ్రహం పాటించాలని సూచించింది. -
విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై!
విమానం రద్దు కారణంగా ఒమన్లోని ఆసుపత్రిలో ఉన్న తన భర్తను.. బతికుండగా చూడలేకపోయానంటూ కేరళకు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తంచేశారు. -
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
Mumbai hoarding collapse: బలమైన ఈదురుగాలుల ధాటికి సోమవారం ముంబయిలోని భారీ హోర్డింగ్ ఒకటి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది మృతిచెందారు. -
సీఎం ఇంట్లో ఎంపీపై దాడి: ఎవరీ బిభవ్ కుమార్..?
ఎన్నికల వేళ ఆప్ గంభీరమైన వివాదంలో చిక్కుకొంది. ఆ పార్టీ మహిళా ఎంపీ ఏకంగా సీఎం ఇంట్లో దాడికి గురైనట్లు పోలీసులకు వెల్లడించారు. -
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
నేడు వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీకి ప్రధాని మోదీ (Modi) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. -
ఆపరేషన్ చేసి కడుపులో దూది మర్చిపోయిన వైద్యుడు
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. పిత్తాశయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి లోహియానగర్లోని స్థానిక నర్సింగ్ హోంలో చేరారు. -
ముంబయి విమానాశ్రయంలో రూ.13.56 కోట్ల బంగారం పట్టివేత
మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.13.56 కోట్లు విలువ చేసే బంగారం పట్టుబడింది. -
కేజ్రీవాల్ సహాయకుడు నాపై దాడి చేశారు
మద్యం కుంభకోణం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరో వివాదంలో చిక్కుకుంది. -
‘సిజేరియన్’ శిశువులకు రెండో తట్టు టీకా తప్పనిసరి
సహజ ప్రసవం ద్వారా పుట్టే శిశువులతో పోలిస్తే సిజేరియన్ విధానంలో జన్మించిన శిశువుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని బ్రిటన్, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. -
కేజ్రీవాల్కు ఇచ్చినట్లే నాకూ బెయిలివ్వండి
లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
వీవీప్యాట్ స్లిప్పుల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్
లెక్కింపు సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీయం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను పూర్తిస్థాయిలో సరిపోల్చాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ఏప్రిల్ 26నాటి తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
త్రిపురకు వెళ్లి ఏనుగులను కాపాడిన అంబానీ ‘వన్ తారా’బృందం
గుజరాత్లోని జామ్నగర్కు చెందిన ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్ర సిబ్బంది జబ్బుపడిన ఏనుగును, దాని పిల్లను కాపాడేందుకు ఏకంగా 3,500 కి.మీ. ప్రయాణించారు. -
ముంబయిలో గాలివాన బీభత్సం
కొన్నిరోజులుగా వేడి వాతావరణంతో సతమతమవుతోన్న ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. -
56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు
రాజస్థాన్లోని జైపుర్లో ఉన్న 56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు రావడం కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం మెయిల్ రూపంలో ఈ సందేశాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నెహ్రూ జులాజికల్ పార్క్లో తెల్లపులి మృతి
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!